epaper
Saturday, November 15, 2025
epaper

కాంట్రాక్ట్ కార్మికులకు బోనస్ రూ.20 వేలు ఇవ్వాలి

కాంట్రాక్ట్ కార్మికులకు బోనస్ రూ.20 వేలు ఇవ్వాలి
బోనస్ పెంపుదలకు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి
లేనిపక్షంలో పోరాటం ఉధృతం చేస్తాం
సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ నాయకులు
కొత్తగూడెం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట ధర్నా

కాకతీయ, కొత్తగూడెం రూరల్ : సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు లాభాల బోనస్ విషయంలో సింగరేణి యాజమాన్యం ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి కాంట్రాక్ట్ కార్మికులకు రూ.20 వేలు బోనస్ ప్రకటించాలని లేనిపక్షంలో పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరిస్తూ శుక్రవారం సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన ధర్నాలో జేఏసీ రాష్ట్ర నాయకులు బి.మధు, షేక్ షావలి, మల్లెల రామనాథం, గూడేల్లి యాకయ్య, కరుణాకర్ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి యాజమాన్యం ప్రకటించిన లాభాల వాటాలో 36 వేల మంది కాంట్రాక్టు కార్మికులను దగా చేసిందని కేవలం రూ.5వేలు ఇచ్చి చేతులు దులుపుకుందన్నారు.
కోల్బెల్టు ఎమ్మెల్యేలు ఎందుకు నోరు మెదపడం లేదో సమాధానం చెప్పాలన్నారు. లాభాల బోనస్ లో రూ.20 వేలు ఇచ్చే వరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. బోనస్ చట్టం ప్రకారం చూసినా లాభాల్లో ఉన్న కంపెనీలు కాంట్రాక్ట్ కార్మికులకు 20 శాతం వరకు బోనస్ చెల్లించాలన్నారు. గతంలో అనేకమార్లు కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలపై సానుభూతి పలికిన భట్టి విక్రమార్క గానీ, జీతాలు పెంచుతామని హామీలు ఇచ్చి గెలిచిన కోల్ బెల్ట్ ఎమ్మెల్యేలు గానీ ముఖ్యమంత్రి పక్కనే కూర్చొని ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం సమంజసం కాదన్నారు. నెల రోజుల్లో వేతనాలు పెంచుతామని అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం 20 నెలలు గడిచినప్పటికీ నేటికీ వేతనాలు పెంచక పోవడం, వీరి శ్రమతోటి వచ్చిన లాభాల నుండి కూడా సముచిత స్ధాయిలో ఇవ్వకపోవడంతో కాంట్రాక్టు కార్మికుల్లో తీవ్ర అసంతృప్తి అలుముకొంటుందని అన్నారు.
గత సంవత్సరం కాంట్రాక్ట్ కార్మికులతో పాలాభిషేకాలు చేయించుకున్న ఎమ్మెల్యేలు స్పందించాలని డిమాండ్ చేశారు. లాభాల వాటాను పునః సమీక్షించి కాంట్రాక్ట్ కార్మికులకు సముచితమైన లాభాల వాటాను ఇప్పించాలని వేతనాలను పెంచాలని డిమాండ్ చేశారు. లేనియెడల బీఆర్ఎస్ ప్రభుత్వానికి పట్టిన గతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఎమ్మెల్యేలకు పడుతుందని హెచ్చరించారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు భూక్యా రమేష్, సతీష్, తాండ్ర విజయ్, రాజశేఖర్, నునావత్ విజయ్, గుగులోత్ సక్రాం, మాతంగి రాజేష్, భాస్కర్, రాణి, సునీల్, రాధ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సామినేనిని హ‌త్య చేసిందెవ‌రు..??

సామినేనిని హ‌త్య చేసిందెవ‌రు..?? ద‌ర్యాప్తు ఎందుకు ముందుకు సాగ‌డం లేదు..? ర‌క్త‌చ‌రిత్ర‌లో రాజ‌కీయ కోణంపై...

ఎన్ డి ఎ కూటమి విజయం

ఎన్ డి ఎ కూటమి విజయం హర్షం వ్యక్తం చేసిన బీజేపీ మండల...

యువతలో కొత్త జాగృతి ప్రేరణనే చైతన్యం

యువతలో కొత్త జాగృతి ప్రేరణనే చైతన్యం డ్రగ్స్ పై యుద్ధం ముగింపు ర్యాలీ ప్రజల...

భళారే.. యమ

భళారే.. యమ పిల్లల పండుగ రోజున అలరించిన బుడతడు కాకతీయ కొత్తగూడెం రూరల్: బాలల...

ఆయిల్ పామ్ సాగుతో రైతులకు లాభాల పంట…

ఆయిల్ పామ్ సాగుతో రైతులకు లాభాల పంట... రాష్ట్ర వ్యవసాయ,మార్కెటింగ్, సహకార, చేనేత...

కాంగ్రెస్ నాయకుడు మిక్కిలినేని కి మాతృవియోగం

కాంగ్రెస్ నాయకుడు మిక్కిలినేని కి మాతృవియోగం కాకతీయ,ఖమ్మం ప్రతినిధి: జిల్లా కాంగ్రెస్ నాయకుడు,...

టీబీ వ్యాధి పై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి

టీబీ వ్యాధి పై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి డాక్టర్ దుర్గాభవాని కాకతీయ, పినపాక:...

సమాజ నిర్మాణం తరగతి గదిలోనే రూపుదిద్దుకుంటుంది…

సమాజ నిర్మాణం తరగతి గదిలోనే రూపుదిద్దుకుంటుంది... పిల్లలను స్వేచ్ఛగా వివక్షతరహితంగా పెంచాలి... స్మార్ట్ కిడ్జ్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img