epaper
Thursday, January 15, 2026
epaper

కాంట్రాక్ట్ కార్మికులకు లాభాల బోనస్ పెంచాల్సిందే…

కాంట్రాక్ట్ కార్మికులకు
లాభాల బోనస్ పెంచాల్సిందే…

కేవలం రూ.500 పెంచి చేతులు దులుపుకోవడం సరికాదు
కార్మికులను దగా చేసిన యాజమాన్యం.. కాంగ్రెస్ ప్రభుత్వం
నేడు ఎమ్మెల్యే ఆఫీస్ ముందు జరిగే ధర్నాలో పాల్గొనండి
కార్మికులకు సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ పిలుపు

కాకతీయ, కొత్తగూడెం రూరల్: సింగరేణివ్యాప్తంగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు లాభాల బోనస్ పెంచాల్సిందేనని, కేవలం రూ.500 పెంచి చేతులు దులుపుకోవడం సరికాదని సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్ట్ కార్మికులకు అధిక శాతం లాభాల బోనస్ ఇవ్వడంతోపాటు వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఎమ్మెల్యే కార్యాలయం ముందు భారీ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టామ‌ని, ఈ నిరసన కార్యక్రమంలో కార్మికుల అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. గురువారం జరిగిన సమావేశంలో జేఏసీ నాయకులు మల్లెల రామనాథం, భూక్య రమేష్, గుడెల్లి యాక‌య్య మాట్లాడారు. కార్మికులకు జరిగిన అన్యాయంపై కోల్ బెల్ట్ ఎమ్మెల్యేలు స్పందించి జీతాలు లాభాల బోనస్ పెంపుదలలో చొరవ చూపాలని డిమాండ్ చేశారు. సింగరేణి యాజమాన్యం ప్రభుత్వం ప్రకటించిన లాభాల వాటా విషయంలో 30 వేల మంది కాంట్రాక్టు కార్మికులను దగా చేసిందని, కేవలం 500 రూపాయలు పెంచి చేతులు దులుపుకుందని, కాంట్రాక్ట్ కార్మికుల వేతనాల పెంపుదల ప్రస్తావన చేయలేదని విమర్శించారు. లాభాల బోనస్ లో 20 వేలు ఇచ్చే వరకు పోరాటం కొనసాగిస్తామని దశలవారీ ఆందోళన పోరాటాల్లో భాగంగా ఈనెల 26వ తేదీన కొత్తగూడెం ఎమ్మెల్యే కార్యాలయం వద్ద భారీ నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. కాంట్రాక్టు కార్మికులంతా పాల్గొని జయప్రదం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో నాయకులు గూగులోత్ సక్రాం, మాతంగి రాజేష్, భాస్కర్, రాణి, రవి, తాండ్ర విజయ్ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖండాంతరాల్లో సిపిఐ శతాబ్ది సంబరం..!

ఖండాంతరాల్లో సిపిఐ శతాబ్ది సంబరం..! విదేశాల్లోనూ ఎగసిన వామపక్ష జెండా ఖమ్మం వామపక్ష కుటుంబాల...

రూ.15 లక్షల గంజాయి ద్రవం పట్టివేత.. ఇద్ద‌రి అరెస్టు..

రూ.15 లక్షల గంజాయి ద్రవం పట్టివేత.. ఇద్ద‌రి అరెస్టు.. ద్విచక్ర వాహనం, రెండు...

రిజర్వేషన్లకు ముందే టికెట్ల యుద్ధం

రిజర్వేషన్లకు ముందే టికెట్ల యుద్ధం * మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పొలిటికల్ హీట్ *...

చైనా మాంజాలపై ఉక్కుపాదం

చైనా మాంజాలపై ఉక్కుపాదం * విక్రయిస్తే కేసులు తప్పవు * వాహనదారులకు ప్రాణహాని * పక్షుల...

ప్రజావాణి కి అధికారుల డుమ్మా

ప్రజావాణి కి అధికారుల డుమ్మా * 11 దాటినా జాడలేని అధికారులు * 29...

భూసారం కాపాడుకోవడం రైతు బాధ్యత

భూసారం కాపాడుకోవడం రైతు బాధ్యత సాగు ఖర్చులు త‌గ్గితేనే ఆదాయం పెరుగుతుంది అవసరానికి మించి...

స్థానిక సమస్యలకు సీపీఐ(ఎం)తోనే పరిష్కారం

స్థానిక సమస్యలకు సీపీఐ(ఎం)తోనే పరిష్కారం సంస్కృతి–సంప్రదాయాలకు ప్రతీక రంగవల్లికలు సీపీఐ(ఎం) ఖమ్మం డివిజన్ కార్యదర్శి...

నేడు కాంగ్రెస్‌ ముత్యాల ముగ్గుల పోటీలు

నేడు కాంగ్రెస్‌ ముత్యాల ముగ్గుల పోటీలు కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో 3 గంటలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img