epaper
Monday, March 2, 2026
epaper

పీవోడ‌బ్ల్యూ రాష్ట్ర శిక్షణ తరగతులను జయప్రదం చేయండి

పీవోడ‌బ్ల్యూ రాష్ట్ర శిక్షణ తరగతులను జయప్రదం చేయండి
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అందే మంగ విజయ్

కాకతీయ, కొత్తగూడెం రూరల్ : అక్టోబర్ 11, 12 తేదీల్లో నల్లగొండ జిల్లాకేంద్రంలోని శ్రామిక భవన్లో నిర్వ‌హించే ప్రగతిశీల మహిళా సంఘం (పీవోడ‌బ్ల్యూ) రాష్ట్రస్థాయి శిక్షణ తరగతుల‌ను జయప్రదం చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అందే మంగ విజయ్ పిలుపునిచ్చారు. కొత్తగూడెం రైటర్ బస్తీ ఐఎఫ్‌టీయూ కార్యాలయం నందు ముఖ్య కార్యకర్తల సమావేశం రాజేశ్వరి అధ్యక్షతన గురువారం జరిగింది. ఈ సందర్భంగా అందే మంగ విజయ్ హాజ‌రై మాట్లాడారు. గత 50 సంవత్సరాలుగా త‌మ సంఘం మహిళల హక్కుల కోసం అనేక పోరాటాలు నిర్వహించిందని, హక్కుల సాధించడంలో ప్రధాన పాత్ర పోషించిందని అన్నారు. విద్యార్థి, యువజన సంఘాలతో ఐక్య కార్యాచరణ కమిటీ నిర్వహించి హైదరాబాదులో జరిగిన అందాల పోటీలకు వ్యతిరేకంగా పోరాడిందని పేర్కొన్నారు. బ్రాహ్మణ హిందూ భావజాలం పేరుతో మహిళలని వంటింటికే పరిమితం చేసే విధంగా ఈ పాలకవర్గాలు వ్యవహరిస్తున్నాయన్నారు. అందులో భాగంగానే సనాతన ధర్మం పేరుతో మహిళల్ని ఇంటికే పరిమితం చేయడం కోసం ఉద్యోగాల్లో రాణించకుండా, రిజర్వేషన్ల కోసం కొట్లాడకుండా, సాధించుకున్న హక్కులను పోగొట్టుకునే విధంగా పాలకులు వాళ్ల మెదల్లోకి పాశ్చాత్య సంస్కృతిని హిందూ భావజాలాన్ని ఎక్కిస్తున్నారని అన్నారు. మణిపూర్ రాష్ట్రంలో సుగంధ ద్రవ్యాల కోసం జరిగిన పోరాటంలో మహిళలను నగ్నంగా ఊరేగించి మహిళలను హింసించి దాడులు చేసి విధ్వంసం సృష్టించారని వారన్నారు. మరోపక్క ఏజెన్సీలో ఆదివాసీ మహిళలపై అత్యాచారాలు మారణ హోమం సృష్టిస్తున్నారని సైన్యాలతో బెదిరిస్తున్నారని, ఎదురు తిరిగిన వారిని బూటక ఎన్కౌంటర్ల పేరుతో కాల్చి చంపుతున్నారని మండిప‌డ్డారు. 79 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో మహిళలపై దాడులు పెరుగుతున్నాయని, అభివృద్ధి పేరుతో మహిళలని వ్యాపార వర్గాలు వాణిజ్య ప్రకటనల కోసం వారి అందచందాలను మార్కెట్లో వ్యాపారంగా మార్చుతున్నాయని, ఇది సరైన పద్ధతి కాదన్నారు. ఈ క్రమంలోనే మహిళలను చైతన్యం చేయడం కోసం ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో అక్టోబర్ 11, 12 తేదీల్లో నల్గొండ జిల్లాలో రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామ‌న్నారు. మహిళలు, విద్యార్థినులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ రాజకీయ శిక్షణ తరగతులను ప్రభుత్వ జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్ సుధారాణి ప్రారంభిస్తారని తెలిపారు. ప్రపంచీకరణ మహిళలు అనే అంశంపై పీవోడ‌బ్ల్యూ
జాతీయ నాయకురాలు సంధ్య, పని విధానం ప్రణాళిక కార్యక్రమంపై ఝాన్సీ, సామాజిక పరిణామ క్రమంలో స్త్రీలు అనే అంశంపై రాష్ట్ర అధ్యక్షురాలు అనసూయ, ఉద్యమాలలో స్త్రీలు అనే అంశంపై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అందే మంగ విజయ్ బోధిస్తారని తెలియజేశారు. సమావేశంలో నాగలక్ష్మి, సంధ్య, రాములమ్మ, కరుణ, రాధ, వెంకటమ్మ, సుప్రియ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు

ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు సింగరేణిలో ఎమ్మార్పీఎస్ గద్దె వద్ద నివాళులు త్యాగాలు...

బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..!

బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..! మణుగూరు–బయ్యారం రహదారి ధ్వంసం దుమ్ము ధూళితో గిరిజన బిడ్డల అనారోగ్యం ప్రజల...

అదుపుతప్పిన ఇసుక ట్రాక్టర్ – డ్రైవర్ దుర్మరణం

అదుపుతప్పిన ఇసుక ట్రాక్టర్ – డ్రైవర్ దుర్మరణం నాగులవంచ వద్ద తెల్లవారుజామున ప్రమాదం ఓవర్‌టేక్...

వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే

వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే 21 మంది తహశీల్దార్లతో యుద్ధప్రాతిపదికన సర్వే ఖమ్మం జిల్లాకు...

వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ

వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో భోజనాల పంపిణీ కాకతీయ,...

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ కాకతీయ, ఖమ్మం : ఎస్సీ...

భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు

భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు పేదల పేరుతో రాద్ధాంతం చేశారు ఏజెంట్ల మోసాలపై బాధితులకు...

మోదీ పాలనలో దేశానికి ప్రమాదం

మోదీ పాలనలో దేశానికి ప్రమాదం కార్పొరేట్ల కోసమే కేంద్రం విధానాలు సీపీఐ (ఎం) పొలిట్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img