epaper
Thursday, January 15, 2026
epaper

గుట్టలను గుల్ల చేస్తున్న మాఫియా.. పట్టించుకోని అధికార యంత్రాంగం

కాక‌తీయ‌, కొత్త‌గూడెం రూర‌ల్ : చారిత్రక గుట్టలు.. ఎత్తయిన ప్రాంతాలు అక్రమార్కుల దందాతో కనుమెరుగుతున్నాయి.. కొందరు సిండికేట్ గా ఏర్పడి ప్రకృతి సంపదను దర్జాగా కొల్లగొడుతున్న పరిస్థితి నెలకొంది.. ఇసుక దందాను దొంగల ముఠా కొనసాగించడమే కాకుండా కొత్తగా గుట్టలపై కన్నేసి అందులో ఉన్న సంపదను దోచుకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు.

కొత్తగూడెం మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని సింగరేణి సెంట్రల్ వర్క్ షాప్ పక్కన ఉన్న బోడ గుట్టను మ‌ట్టి దొంగ‌లు తోడేస్తున్నారు. ఎక్స్‌క‌వేట‌ర్ లతో ఇష్టారాజ్యంగా తవ్వుతూ మట్టితో పాటుగా ఇండ్లకు ఉపయోగించే పునాది రాయిని సైతం యథేచ్చగా తరలించుకుపోతున్నారు. వాల్టా నిబంధనలు, గిరిజన చట్టాలను పాతరేస్తూ యథేచ్ఛగా మొరం దోపిడీని సాగిస్తున్నారు. పగలు, రాత్రి విచ్చలవిడిగా దందా సాగుతున్నా రెవెన్యూ, గనులశాఖ, నిఘా విభాగాలు మీనమేషాలు లెక్కిస్తుండటం అనుమానాలకు దారి తీస్తోంది.

ప్రభుత్వ సంపద తరలిపోతున్నా యంత్రాంగం చోద్యం చూస్తోంది. ముఖ్యంగా గత కొద్ది రోజులుగా తెల్లవారుజామున బోడగుట్ట వనరులను నెంబర్ లేని జెసిబి యంత్రంతో తవ్వకాలు చేసి ట్రాక్టర్ల ద్వారా మట్టిని సమీపంలో ఉన్న వెంచర్లకు ఇండ్ల నిర్మాణాలకు తరలిస్తున్నట్లుగా ఆ ప్రాంతానికి చెందిన కొందరు మాట్లాడుకోవడం గమనార్హం.

ట్రాక్టర్ ట్రక్కు మట్టి 2000 నుంచి 3000 వరకు అమ్ముతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. పునాదిరాయి అయితే సైజును బట్టి 4000 నుంచి 10000 దాకా అమ్ముతున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. ఇంత బహిరంగంగా దందా కొనసాగుతున్న పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు స్పందించి బోడగుట్ట నుండి సంపద తరలిపోకుండా చర్యలు తీసుకోవడంతో పాటు జెసిబి యంత్రాలను ట్రాక్టర్లను సీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖండాంతరాల్లో సిపిఐ శతాబ్ది సంబరం..!

ఖండాంతరాల్లో సిపిఐ శతాబ్ది సంబరం..! విదేశాల్లోనూ ఎగసిన వామపక్ష జెండా ఖమ్మం వామపక్ష కుటుంబాల...

రూ.15 లక్షల గంజాయి ద్రవం పట్టివేత.. ఇద్ద‌రి అరెస్టు..

రూ.15 లక్షల గంజాయి ద్రవం పట్టివేత.. ఇద్ద‌రి అరెస్టు.. ద్విచక్ర వాహనం, రెండు...

రిజర్వేషన్లకు ముందే టికెట్ల యుద్ధం

రిజర్వేషన్లకు ముందే టికెట్ల యుద్ధం * మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పొలిటికల్ హీట్ *...

చైనా మాంజాలపై ఉక్కుపాదం

చైనా మాంజాలపై ఉక్కుపాదం * విక్రయిస్తే కేసులు తప్పవు * వాహనదారులకు ప్రాణహాని * పక్షుల...

ప్రజావాణి కి అధికారుల డుమ్మా

ప్రజావాణి కి అధికారుల డుమ్మా * 11 దాటినా జాడలేని అధికారులు * 29...

భూసారం కాపాడుకోవడం రైతు బాధ్యత

భూసారం కాపాడుకోవడం రైతు బాధ్యత సాగు ఖర్చులు త‌గ్గితేనే ఆదాయం పెరుగుతుంది అవసరానికి మించి...

స్థానిక సమస్యలకు సీపీఐ(ఎం)తోనే పరిష్కారం

స్థానిక సమస్యలకు సీపీఐ(ఎం)తోనే పరిష్కారం సంస్కృతి–సంప్రదాయాలకు ప్రతీక రంగవల్లికలు సీపీఐ(ఎం) ఖమ్మం డివిజన్ కార్యదర్శి...

నేడు కాంగ్రెస్‌ ముత్యాల ముగ్గుల పోటీలు

నేడు కాంగ్రెస్‌ ముత్యాల ముగ్గుల పోటీలు కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో 3 గంటలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img