epaper
Saturday, November 15, 2025
epaper

స్థానిక ఎన్నికల్లో న్యూడెమోక్రసీ అభ్యర్థులను గెలిపించాలి: ఆవునూరి మధు

కాకతీయ, బయ్యారం : రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ అభ్యర్థులను గెలిపించటం ద్వారా పేదల హక్కులకు రక్షణ కలుగుతుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు ఆవునూరి మధు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆదివారం అల్లిగూడెంలో ఏజెన్సీలో పార్టీ ముఖ్య నాయకుల జనరల్ బాడీ సమావేశం బానోత్ నర్సింహ అధ్యక్షతన నిర్వహించారు. దీనికి ముఖ్య అతిధిగా ఆవునూరి మధు హాజరై మాట్లాడారు.

నరేంద్ర మోడీ నేతృత్వంలో దేశంలో నియంతృత్వ ఫాసిస్టు విధానాలు అమలు జరుగుతున్నాయని, ఆపరేషన్ కగార్ పేర ఆదివాసీలను, మావోయిస్టులను వందల సంఖ్యలో హతమారుస్తున్నారని అన్నారు. కార్పొరేట్ వర్గాల ప్రయోజనాల కోసమే మోడీ ప్రభుత్వం నెత్తురు టేరులను పారిస్తున్నదని విమర్శించారు. రాష్ట్రంలో అధికారంలో వున్న కాంగ్రెస్ పార్టీ రెండు సంవత్సరాలుగా స్థానిక సంస్థల ఎన్నికలు జరపకుండా వాయిదా వేస్తూ వస్తున్నదని, దాంతో గ్రామాల అభివృద్ధి కుంటు పడిందని అన్నారు.

హై కోర్టు ఆదేశించినా స్థానిక ఎన్నికలు జరపకుండా వాయిదా వేస్తున్నదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయకుండా ప్రజల వ్యతిరేకతనుఎదుర్కొంటున్నదని, అందుకే స్థానిక ఎన్నికలు జరపటానికి భయపడుతున్నదన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల హక్కులు హరిస్తున్నాయని, ప్రజల హక్కుల పరిరక్షణ కోసం విప్లవ పార్టీ సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీని ప్రజలు ఆదరించాలని కోరారు.

పార్టీ శ్రేణులు స్థానిక ఎన్నికలకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. జనరల్ బాడీలో పార్టీ జిల్లా కార్యదర్శి గౌని ఐలయ్య, మహబూబాబాద్ డివిజన్ కార్యదర్శి నందగిరి వెంకటేశ్వర్లు, పార్టీ బయ్యారం మండల కార్యదర్శి మోకాళ్ళ మురళీ క్రిష్ణ, పార్టీ జిల్లా నాయకులు యాకన్న, పూనెం బిక్షం ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మాదంశెట్టి నాగేశ్వరరావు, మేకపోతుల నాగేశ్వరరావు, బానోత్ హోలీ, తదితరులు పాల్గొన్నారు..

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్‌లో రేవంత్ జోష్‌

కాంగ్రెస్‌లో రేవంత్ జోష్‌ జూబ్లీహిల్స్ పీఠంపై హ‌స్తం పార్టీ జెండా ఉప ఎన్నిక గెలుపుతో...

సామినేనిని హ‌త్య చేసిందెవ‌రు..??

సామినేనిని హ‌త్య చేసిందెవ‌రు..?? ద‌ర్యాప్తు ఎందుకు ముందుకు సాగ‌డం లేదు..? ర‌క్త‌చ‌రిత్ర‌లో రాజ‌కీయ కోణంపై...

ఎన్ డి ఎ కూటమి విజయం

ఎన్ డి ఎ కూటమి విజయం హర్షం వ్యక్తం చేసిన బీజేపీ మండల...

యువతలో కొత్త జాగృతి ప్రేరణనే చైతన్యం

యువతలో కొత్త జాగృతి ప్రేరణనే చైతన్యం డ్రగ్స్ పై యుద్ధం ముగింపు ర్యాలీ ప్రజల...

భళారే.. యమ

భళారే.. యమ పిల్లల పండుగ రోజున అలరించిన బుడతడు కాకతీయ కొత్తగూడెం రూరల్: బాలల...

ఆయిల్ పామ్ సాగుతో రైతులకు లాభాల పంట…

ఆయిల్ పామ్ సాగుతో రైతులకు లాభాల పంట... రాష్ట్ర వ్యవసాయ,మార్కెటింగ్, సహకార, చేనేత...

కాంగ్రెస్ నాయకుడు మిక్కిలినేని కి మాతృవియోగం

కాంగ్రెస్ నాయకుడు మిక్కిలినేని కి మాతృవియోగం కాకతీయ,ఖమ్మం ప్రతినిధి: జిల్లా కాంగ్రెస్ నాయకుడు,...

టీబీ వ్యాధి పై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి

టీబీ వ్యాధి పై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి డాక్టర్ దుర్గాభవాని కాకతీయ, పినపాక:...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img