epaper
Saturday, November 15, 2025
epaper

ఎరువుల సరఫరాపై రైతులకు ఆందోళన పడోద్దు: సీఎం చంద్రబాబు

*యూరియా బ్లాక్ మార్కెట్ చేస్తే కఠిన చర్యలు

*మార్క్ ఫెడ్ ద్వారా 2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా విక్రయాలు

*గత ఏడాదితో పోలిస్తే 91 వేల మెట్రిక్ టన్నుల అదనంగా యూరియా సరఫరా

*రసాయన ఎరువుల వినియోగంపై అన్నదాతలకు అవగాహన కల్పించాలి

*తక్కువ మొత్తంలో ఎరువులు, పురుగుమందుల వాడే రైతులకు సబ్సిడీలు

*కాఫీ తోటల తెగుళ్లపై తక్షణం చర్యలు చేపట్టాలి

*ఉద్యాన పంటలు, ఎరువుల లభ్యత, మార్కెటింగ్శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష

కాకతీయ,అమరావతి: రాష్ట్రంలో ఎరువుల సరఫరాపై రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. డిమాండ్ కంటే అదనంగానే నిల్వలు ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఎరువులు బ్లాక్ మార్కెట్ కు తరలి పోకుండా కఠినంగా వ్యవహరించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఉద్యాన పంటలు, ఎరువుల లభ్యత, మార్కెటింగ్ శాఖపై సమీక్ష నిర్వహించారు. ఇ-క్రాప్ ద్వారా రాష్ట్రంలో ఎంత మేర ఏ పంటలు సాగు అవుతున్నాయి. ఎరువుల వినియోగం ఎంత జరుగుతుందన్న లెక్కలు తీయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. నిరంతర పర్యవేక్షణ ద్వారా సమస్య రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈసారి 2.02 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి సరఫరా అయ్యిందని.. వాస్తవ డిమాండ్ కంటే అదనంగా నిల్వలు ఉన్నాయని అధికారులు వివరించారు.

గతంతో పోలిస్తే ఈసారి 91 వేల మెట్రిక్ టన్నుల యూరియా అదనంగా వచ్చినట్టు తెలిపారు. ఇక డిఏపి 51,700 మెట్రిక్ టన్నుల మేర వచ్చిందని.. గత ఏడాదితో పోలిస్తే 16 వేల మెట్రిక్ టన్నులు ఇది అదనమని అధికారులు సీఎంకు తెలిపారు. కాంప్లెక్స్ ఎరువులు కూడా ప్రస్తుత ఏడాదిలో 2.72 లక్షల మెట్రిక్ టన్నుల మేర వచ్చిందని వివరించారు. గతంతో పోలిస్తే 1.20 లక్షల మెట్రిక్ టన్నులు ఇది అదనమని తెలియచేశారు.దీనిపై స్పందించిన సీఎం రాష్ట్రంలో ఎరువుల లభ్యత ఇంతగా ఉన్నా.. కొందరు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని.. ఇంటిగ్రేటెడ్ ఫెర్టిలైజర్ మేనేజ్మెంట్ సిస్టం ద్వారా యూరియా వినియోగం కూడా లెక్కించాలని అన్నారు.

రసాయన ఎరువులు, పురుగుమందులు వాడకం తగ్గితే సబ్సిడీలు

రసాయన ఎరువులు, పురుగు మందుల రహిత రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఆ మేరకు వాటి వినియోగం తగ్గించేలా రైతుల్లో అవగాహన కల్పించాలని స్పష్టం చేశారు. పంటల సాగులో రసాయన ఎరువులు, పురుగుమందుల వినియోగం తగ్గించిన రైతులకు రాయితీలు ఇచ్చే అంశంపై ప్రణాళికలు చేయాలని సీఎం స్పష్టం చేశారు. ఎవరు ఎంత వినియోగిస్తున్నారనే అంశాన్ని రైతు సేవా కేంద్రాల ద్వారా పర్యవేక్షించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఎప్పటికప్పుడు రైతు సేవా కేంద్రాల ద్వారా కూడా ఎరువుల వినియోగంపై గణాంకాలు నమోదు చేయాలని స్పష్టం చేశారు.

11 ఉద్యాన పంటలకు సాగు ధర దక్కాలి

రాష్ట్రంలోని 11 ఉద్యాన పంటలకు సంబంధించి సాగు వ్యయానికి తగినట్టే ఆయా పంటలకు కనీస ధర వచ్చేలా చూడాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ నష్ట పోవడానికి వీల్లేదని ముఖ్యమంత్రి తేల్చి చెప్పారు. మరోవైపు కాఫీ తోటలకు కొత్తగా వచ్చిన బోరర్ తెగులు పై తక్షణమే చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. కొత్త తెగులు వచ్చిన కాఫీ పంట 20 ఎకరాల్లో ఉందని…దానిని తక్షణం తొలగించాల్సిన అవసరం ఉందని అధికారులు సీఎంకు తెలిపారు. ఇతర ప్రాంతాలకు తెగులు ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా చర్యలు చేపట్టాలని సీఎం సూచించారు. అలాగే తొలగించిన పంటకు నష్టపరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలని స్పష్టం చేశారు.

వచ్చే మూడేళ్ల పాటు ట్రాప్ లను ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షించాల్సిందిగా ముఖ్యమంత్రి సూచనలు జారీ చేశారు. మరోవైపు ఉల్లి పంట మొత్తాన్ని కొనుగోలు చేయాల్సిందిగా అధికారులకు సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కొనుగోలు చేసిన ఉల్లిని స్థానికంగా కమ్యూనిటి హాళ్లను తీసుకుని ఆరబెట్టాలని సీఎం సూచనలు జారీ చేశారు. ఇప్పటి వరకూ హెచ్డీ బర్లీ పొగాకు కొనుగోళ్లకు సంబంధించి రూ.54 కోట్ల రూపాయల చెల్లింపులు జరిగాయని .. మరో రూ.59 కోట్లు చెల్లించాల్సి ఉందని తెలిపారు. అలాగే ఈ సమీక్షకు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, సీఎస్ కె.విజయానంద్, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కళ్యాణదుర్గంలో లోకేష్ ప్రజాదర్బార్

కళ్యాణదుర్గంలో లోకేష్ ప్రజాదర్బార్ ప్రజల‌ నుంచి వినతులు స్వీకరించిన మంత్రి అన్ని విధాల అండగా...

గుంత‌లు లేని దారులే మా ప్ర‌భుత్వ ల‌క్ష్యం

ప్రజల చేతిలో పల్లె రహదారుల సమాచారం త్వరలో అందుబాటులోకి ‘జియో...

శ్రీ చరణికి రూ.2.5 కోట్ల నజరానా

ఇంటి నిర్మాణానికి 1000 చ.గ. స్థలం గ్రూప్ 1 ఉద్యోగం...

జ‌గ‌న్ ప్ర‌భుత్వంలోనే ఎస్సీ, ఎస్టీల‌కు న్యాయం

కోట మండ‌ల వైసీపీ అధ్య‌క్షులు రాయంకుల‌ కాక‌తీయ. ఏలూరు ప్ర‌తినిధి :...

గిరిజన ‘గూడెం’లో తొలిసారి విద్యుత్ కాంతులు

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో గూడెంకు వెలుగులు కేంద్ర...

కృష్ణా నదిపై హై లెవెల్ వంతెన

దీవుల్లోని గ్రామాలకు అనుసంధానం రాష్ట్ర నిధులతోపాటు, సాస్కీ పథకం నిధులు...

దైవ‌ద‌ర్శ‌నంలో మృత్యుఘోష‌

దైవ‌ద‌ర్శ‌నంలో మృత్యుఘోష‌ శ్రీకాకుళం జిల్లా కాశిబుగ్గ ఆలయంలో తొక్కిసలాట 9 మంది భ‌క్తులు మృతి మృతుల్లో...

ఆలయంలో తొక్కిసలాట

9 మంది భ‌క్తులు మృతి మృతుల్లో బాలుడు.. ఎనిమిది మంది...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img