epaper
Monday, March 2, 2026
epaper

టౌన్ ప్లానింగ్‌లో అవినీతికి చెక్ పెడుతాం

టౌన్ ప్లానింగ్‌లో అవినీతికి చెక్ పెడుతాం
లంచాలు తీసుకుంటే క్రిమినల్ కేసులు
అక్రమ నిర్మాణాలపై కొరడా
నిజాయితీగా పనిచేసేవారికి రక్షణ
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్
దళారుల వ్యవస్థ నిర్మూలనకు ఆదేశాలు

కాకతీయ, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ విభాగంలో అవినీతి, అక్రమాలకు పూర్తి స్థాయిలో అడ్డుకట్ట వేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. ‘‘ఇప్పటిదాకా ఒక లెక్క… ఇకపై మరో లెక్క’’ అంటూ ఇంటి నిర్మాణ అనుమతుల పేరుతో ప్రజలను వేధించడం, బ్రోకర్లు, ఏజెన్సీల ద్వారా లంచాలు వసూలు చేయడం సహించబోమని తేల్చిచెప్పారు. మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావులతో కలిసి నిర్వహించిన సమీక్ష సమావేశంలో అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. నిబంధనల పేరుతో కొర్రీలు పెట్టడం ఆపాలని, ప్రజలకు సులభంగా అనుమతులు అందేలా వ్యవస్థను మార్చాలని సూచించారు. ఇకపై లంచాలు తీసుకుంటే బదిలీతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అదే సమయంలో నిజాయితీగా పనిచేసే అధికారులకు పూర్తి రక్షణ ఉంటుందని హామీ ఇచ్చారు. రాజకీయ ఒత్తిళ్లు ఉండవని స్పష్టం చేశారు.

అవినీతికి తావు లేదు… ఉండలేనివారు వెళ్లొచ్చు

పట్టణ ప్రణాళిక విభాగంపై ఉన్న అవినీతి ముద్రను పూర్తిగా తొలగించాలన్నారు. అవినీతి కొనసాగించే అధికారులు ఇక్కడ కొనసాగలేరని, అలాంటివారు స్వచ్ఛందంగా బదిలీపై వెళ్లొచ్చని కఠిన హెచ్చరిక జారీ చేశారు. ప్రజలతో మర్యాదగా వ్యవహరించి నిబంధనలు స్పష్టంగా వివరించి వేగంగా సేవలు అందించాలని ఆదేశించారు. కార్యాలయాల చుట్టూ ప్రజలను తిరగదోపడం ఇక సహించబోమన్నారు.
దళారుల వ్యవస్థను పూర్తిగా నిర్మూలించాలని స్పష్టం చేశారు. ప్రజలకు నేరుగా సేవలు అందేలా ప్రత్యేక సహాయ కేంద్రం ఏర్పాటు చేయాలని సూచించారు. ఇంటి నిర్మాణ అనుమతులను పారదర్శకంగా, త్వరితగతిన మంజూరు చేసే విధానాన్ని అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.

అక్రమ నిర్మాణాలపై కొరడా

అనుమతి లేకుండా జరుగుతున్న నిర్మాణాలను ప్రారంభ దశలోనే అడ్డుకోవాలని మంత్రి ఆదేశించారు. కార్పొరేషన్ పరిధిలోని అక్రమ నిర్మాణాలను గుర్తించి వారం రోజుల్లో నోటీసులు జారీ చేయాలని స్పష్టం చేశారు. నోటీసులు పట్టించుకోకపోతే కూల్చివేత చర్యలు చేపట్టాలని హెచ్చరించారు. ప్రభుత్వ భూముల విషయంలో నిర్లక్ష్యం సహించబోమన్నారు.అధికారుల పనితీరుపై నిరంతర నిఘా ఉంటుందని, ప్రతి చర్యపై పర్యవేక్షణ కొనసాగుతుందని పేర్కొన్నారు. పట్టణ ప్రణాళిక, ఆదాయ, పారిశుధ్య విభాగాలపై మూడు రోజుల్లో అవగాహన సదస్సు నిర్వహించాలని ఆదేశించారు. అక్రమ వసూళ్లకు పూర్తిగా చెక్ పెట్టాలని స్పష్టం చేశారు.నగరంలో ఇంటి నిర్మాణానికి సులభంగా అనుమతులు లభించే విధానాన్ని అమలు చేసి కరీంనగర్‌ను ఆదర్శ నగరంగా తీర్చిదిద్దాలని సూచించారు. ఎన్నికల హామీ మేరకు ప్రక్షాళన ప్రారంభించామని పేర్కొంటూ నెలరోజుల్లో స్పష్టమైన మార్పు కనిపించాల్సిందేనని అధికారులను హెచ్చరించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

పీడీఎస్ బియ్యం, అక్రమ ఇసుక రవాణాపై కేసులు

పీడీఎస్ బియ్యం, అక్రమ ఇసుక రవాణాపై కేసులు ఎనిమిది మందిని బైండోవర్ చేసిన...

ఇంటర్ పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్

ఇంటర్ పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్ కాక‌తీయ‌, క‌రీంన‌గ‌ర్ : జిల్లాలో...

సీఈఐఆర్ సాయంతో పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ రికవరీ

సీఈఐఆర్ సాయంతో పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ రికవరీ కాకతీయ, కరీంనగర్ : జనవరి...

విద్యుత్ సమస్యలు పరిష్కరించాలి

విద్యుత్ సమస్యలు పరిష్కరించాలి ఏఈ మహేష్‌కు సర్పంచ్ భూక్యా మోహన్ వినతి కాకతీయ, వేములవాడ...

పోలీసులు మీకోసం అను శీర్షికన

పోలీసులు మీకోసం అను శీర్షికన -పదో తరగతి విద్యార్థులకు పరీక్షల పై అవగాహన...

శిశు మందిర్‌లో సీఏ కోర్సుపై అవగాహన సదస్సు

శిశు మందిర్‌లో సీఏ కోర్సుపై అవగాహన సదస్సు కాకతీయ, కరీంనగర్ : స్థానిక...

విన్న‌వించాం..ప‌రిష్క‌రించండి

విన్న‌వించాం..ప‌రిష్క‌రించండి ఉమ్మడి జిల్లాల్లో ప్రజావాణికి విన‌తుల వెల్లువ‌ అర్జీల పెండింగ్‌కు నో నిర్ణీత గడువులో పరిష్కారం...

వేములవాడ చైర్మన్ పదవీకాలంపై స్పష్టత ఇవ్వాలి

వేములవాడ చైర్మన్ పదవీకాలంపై స్పష్టత ఇవ్వాలి ఫిబ్రవరి సమావేశం ఎందుకు నిర్వహించలేదు ‘చెరో రెండున్నర...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img