epaper
Sunday, March 1, 2026
epaper

కారేపల్లిలో ‘మంచి దొంగ’

కారేపల్లిలో ‘మంచి దొంగ’
పేదోడి కన్నీరు చూసి కరిగిన దొంగ మనసు
దోచుకున్న బంగారం, వెండి, నగదు గుమ్మం ముందు పెట్టివెళ్లిన వైనం
బాధిత కుటుంబంలో ఆనంద భాష్పాలు
అసలు కారణం ఏంటి? దర్యాప్తు కొనసాగిస్తున్న పోలీసులు

కాకతీయ, కారేపల్లి: కఠినంగా మారిపోయిందనుకుంటున్న కాలంలో మానవత్వం మళ్లీ మెలుకువ వచ్చిందనిపించే ఘటన కారేపల్లి మండలంలో చోటుచేసుకుంది. దొంగతనం చేసి పారిపోయిన వ్యక్తులు, పేద కుటుంబం ఆవేదన చూసి మనసు మార్చుకుని దోచుకున్న సొత్తును తిరిగి యజమాని గుమ్మం వద్దే ఉంచి వెళ్లడం గ్రామంలో చర్చనీయాంశమైంది. చీమ్న తండాకు చెందిన గుగులోత్ వీరు సాధారణ కూలీ. ఏళ్ల తరబడి కష్టపడి కూడబెట్టుకున్న తులం బంగారం, 30 తులాల వెండి ఆభరణాలు, 10 వేల రూపాయల నగదు బుధవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. అది కేవలం సొమ్ము కాదు, ఆ కుటుంబం భవిష్యత్తు. సర్వస్వం కోల్పోయామనే బాధతో కుటుంబం కన్నీటి పర్యంతమవ్వడం గ్రామస్తులను కలచివేసింది. దొంగతనం జరిగిన వెంటనే బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే గురువారం అర్ధరాత్రి నిశ్శబ్దంగా అదే ఇంటి వద్దకు వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు, దోచుకున్న సొత్తును ఒక కవర్‌లో భద్రంగా చుట్టి గుమ్మం ముందు ఉంచి వెళ్లిపోయారు. ఉదయం లేచి చూసిన కుటుంబ సభ్యులు తమ సొత్తు తిరిగి రావడంతో ఆశ్చర్యంతో పాటు ఆనంద భాష్పాలు కార్చారు. ఈ ఘటన మండలవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. బాధితుల పేదరికం చూసి దొంగల మనసు కరిగిందా? లేక పోలీసులు గాలింపు చర్యలు చేపట్టడంతో దొరికిపోతామనే భయంతో తిరిగి ఇచ్చేశారా? లేక గ్రామంలో అనుమానాలు పెరగడంతో పరిచయస్తులే మనసు మార్చుకున్నారా? అన్న అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సొత్తు తిరిగి వచ్చినా చట్టపరమైన చర్యలు కొనసాగుతాయని పోలీసులు స్పష్టం చేశారు. ఈ ఘటన వెనుక ఉన్న అసలు వ్యక్తులను గుర్తించేందుకు దర్యాప్తు కొనసాగుతోంది. “మా కష్టం మాకు తిరిగి వచ్చింది” అంటూ బాధిత కుటుంబం దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటోంది. నేరం నేరమే అయినా, నేరస్థుల్లో మిగిలిన ఈ కొద్దిపాటి మానవత్వం గ్రామస్తులను ఆశ్చర్యపరుస్తోంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు

ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు సింగరేణిలో ఎమ్మార్పీఎస్ గద్దె వద్ద నివాళులు త్యాగాలు...

బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..!

బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..! మణుగూరు–బయ్యారం రహదారి ధ్వంసం దుమ్ము ధూళితో గిరిజన బిడ్డల అనారోగ్యం ప్రజల...

అదుపుతప్పిన ఇసుక ట్రాక్టర్ – డ్రైవర్ దుర్మరణం

అదుపుతప్పిన ఇసుక ట్రాక్టర్ – డ్రైవర్ దుర్మరణం నాగులవంచ వద్ద తెల్లవారుజామున ప్రమాదం ఓవర్‌టేక్...

వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే

వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే 21 మంది తహశీల్దార్లతో యుద్ధప్రాతిపదికన సర్వే ఖమ్మం జిల్లాకు...

వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ

వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో భోజనాల పంపిణీ కాకతీయ,...

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ కాకతీయ, ఖమ్మం : ఎస్సీ...

భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు

భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు పేదల పేరుతో రాద్ధాంతం చేశారు ఏజెంట్ల మోసాలపై బాధితులకు...

మోదీ పాలనలో దేశానికి ప్రమాదం

మోదీ పాలనలో దేశానికి ప్రమాదం కార్పొరేట్ల కోసమే కేంద్రం విధానాలు సీపీఐ (ఎం) పొలిట్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img