దుర్గమ్మ ఆలయానికి భూమి పూజ చేసిన మాజీ ఎమ్మెల్యే
కాకతీయ, చేర్యాల: చేర్యాల మండలంలోని అర్జున్ పట్ల గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న దుర్గమ్మ దేవాలయానికి మాజీ ఎమ్మెల్యే,మాజీ ఎమ్మెల్సి నాగపురి రాజలింగం గౌడ్ గ్రామస్థులతో కలిసి బుధవారం భూమిపూజ చేసారు.ఈ సందర్బంగా మాజీ ఎమ్మెల్యే రాజలింగం గౌడ్ మాట్లాడుతూ… గ్రామ ప్రజలను చల్లంగా చూసే గ్రామ దేవాత అయిన దుర్గమ్మకు ప్రత్యేకంగా దేవాలయ నిర్మాణం కోసం తనతో భూమి పూజ చేయించడం సంతోషంగా ఉందని, ఆలయ నిర్మాణం కోసం తనవంతు సహకారం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో,సిద్దిపేట జిల్లా మాజీ జెడ్పి ఫ్లోర్ లీడర్ గిరి కొండల్ రెడ్డి,గ్రామ సర్పంచ్ చంద్రశేఖర్, ఆకునూరు గ్రామ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కొమ్మురవి, కాంగ్రెస్ నాయకులు నాగపురి కిరణ్ కుమార్ గౌడ్, బైతి శ్రీశైలం వార్డు సభ్యులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.


