నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
*బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ముస్త్యాల బాల్ నర్సయ్య
కాకతీయ, చేర్యాల: అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, ముస్త్యాల బాల్ నర్సయ్య,చేర్యాల మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ పుర్మ వెంకట్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.సోమవారం ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురువడంతో పార్టీ నాయకులతో కలిసి నష్టపోయిన పంటలను పరిశీలించారు.అనంతరం చేర్యాల బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ. కురిసిన వర్షం కారణంగా వరి, మొక్కజొన్న, మిరప పంటలు దెబ్బతిన్నదన్నారు. జిల్లా అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేసి పంట నష్టం అంచనా వేయాలన్నారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.25 వేల చొప్పున నష్ట పరిహారం చెల్లించాలన్నారు.ఈ కార్యక్రమంలో, రైతు సమన్వయ సమితి సిద్దిపేట జిల్లా మాజీ కన్వీనర్ అంకుగారి శ్రీధర్ రెడ్డి, మాజీ ఎంపీపీ మేడిశెట్టి శ్రీధర్, మాజీ ఉప సర్పంచ్ మంచాల కొండయ్య, మున్సిపల్ మాజీ ప్లోర్ లీడర్ మంగోల్ చంటి, పచ్చిమడ్ల సిద్ధిరాములు,బి రెడ్డి ఇన్నారెడ్డి, కాశెట్టి భాగయ్య,కామల్ల కమలాకర్, బండి సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.


