సేవాగుణంలో సాటిలేని ఎస్.ఐ. బైరు గోపి
అభయ ఆంజనేయ స్వామి ఆలయ నిర్మాణానికి ఆర్థిక సాయం
కాకతీయ,కారేపల్లి:శాంతిభద్రతల పరిరక్షణలోనే కాకుండా, సామాజిక సేవలోనూ తాను ఎప్పుడూ ముందే ఉంటానని కారేపల్లి ఎస్.ఐ. బైరు గోపి మరోసారి నిరూపించుకున్నారు. తన ఉదారతతో అప్పాయిగూడెం పంచాయతీ పరిధిలోని తులిస్య తండా గ్రామస్తుల మన్ననలు పొందారు.
వెంటనే స్పందించిన ఎస్.ఐ.
తులిస్య తండాలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయ పహరీ (కంపౌండ్ వాల్) నిర్మాణం కోసం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న గ్రామస్తులు, ఎస్.ఐ. గోపి గారిని కలిసి సహాయం కోరారు. వారి విన్నపాన్ని సానుకూలంగా స్వీకరించిన ఎస్.ఐ., ఏమాత్రం ఆలస్యం చేయకుండా తక్షణమే స్పందించారు. ఆలయ నిర్మాణ పనుల నిమిత్తం సుమారు 7,000 రూపాయల విలువ గల ఇసుక లోడ్ను సొంత ఖర్చుతో కొనుగోలు చేసి గ్రామస్తులకు అందజేశారు.
గ్రామస్తుల కృతజ్ఞతలు
దైవ కార్యానికి ఎస్.ఐ. చేసిన ఈ గొప్ప సాయం పట్ల గ్రామ పెద్దలు, యువత హర్షం వ్యక్తం చేశారు. నిస్వార్థంగా సేవలందించే ఇలాంటి అధికారులు ఉండటం తమ తండాకు గర్వకారణమని వారు కొనియాడారు. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు మరియు గ్రామస్తులు ఎస్.ఐ. బైరు గోపి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ దండు ప్రవీణ్, ఆలయ నిర్మాణ దాతలతో పాటు
భూక్యా రాములు, గుగులోత్ లచ్చిరాం, భూక్యా కాసనావంకుడోత్ హార్జ్య, పాలతీయ లక్ష్మణ, శివ, రాము
శ్రీను, చందర్, రాంజీ, రాములు, వినయ్ బన్నీ, లక్క, వెంకన్న మరియు తండా వాసులు పాల్గొన్నారు.


