పెండింగ్ వేతనాలు ఇవ్వాలని,
సర్పంచ్ ల బెదిరింపులు, తొలగింపులు ఆపాలని కలెక్టరెట్ ధర్నా
సమస్యల పరిష్కారం కోసం బడ్జెట్ సమావేశాల సందర్భంగా
చలో హైదరాబాద్ కి సిద్దంగా ఉండాలి
ఎజె రమేష్, సిఐటియు జిల్లా కార్యదర్శి
కాకతీయ, కొత్తగూడెం రూరల్: గ్రామ పంచాయతి కార్మికులకు మూడు నెలల పెండింగ్ వేతనాలు ఇవ్వాలని,సర్పంచ్ ల బెదిరింపులు,తొలగింపులు మానుకోవాలని,మల్టీ పర్పస్ విధానం రద్దు చేయాలని,పండుగ సెలవులు ఆదివారాలు అమలు చేయాలని గ్రామ పంచాయతి ఉద్యొగుల,కార్మికుల యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సిఐటియు ఆధ్వర్యం లో సోమవారం జిల్లా కలెక్టరెట్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా జరిగింది.ధర్నా సందర్భంగా యూనియన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ చిక్కుల శ్రీను అధ్యక్షతన జరిగిన సభలో జిల్లా సిఐటియు అధ్యక్ష,కార్యదర్శులు కే.బ్రహ్మాచారి,ఎజె రమేష్ లు మాట్లాడుతూ రాష్ట్రం లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చి రెండేళ్లు పూర్తైనా ఎన్నికలకు ముందు గ్రామ పంచాయతి కార్మికులకు ఇచ్చిన హామీలు ఏమీ అమలు చేయలేదన్నారు.పెరుగుతున్న ధరలలో ఒక్క రూపాయి కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పెంచలేదన్నారు.కార్మికులకు ఉరి తాడుగా మారిన మల్టీ పర్పస్ విధానం రద్దు చేస్తామని ఇచ్చిన హమీ పై ఒక్క మాట కూడా మాట్లాడటం లేదన్నారు.పంచాయతి ఎన్నికలు జరిగి కొత్త పాలక వర్గాలు ఏర్పడి,కార్మికులను తొలగింపులు,
వెధింపులు కొన్ని పంచాయతీలలో ప్రారంభమయ్యాయని,తక్షణమే ఈ తొలగింపులను ఆపాలని డిమాండ్ చేశారు.పోస్టల్ ఇన్సూరెన్స్ రేన్యువల్ చేయక సంవత్సరం పైన అవుతుందని,వెంటనే పోస్టల్ ఇన్సూరెన్స్ చేయాలని డిమాండ్ చేశారు.బిల్ కలెక్టర్,కారోబార్ లకు స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఎనిమిది గంటల పని దినాన్ని అమలు చేయాలని,గ్రీన్ ఛానల్ ద్వారా ప్రతీ నెల ఒకటవ తేదీన జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.ధర్నా అనంతరం జిల్లా కలెక్టర్ పరిపాలనా అధికారి,జిల్లా గ్రామ పంచాయతి అధికారులకు సమస్యలతో కూడిన వినతి పత్రం ఇచ్చారు.ఈ సందర్భంగా జిల్లా గ్రామ పంచాయతి అధికారి మాట్లాడుతూ ప్రస్తుతం సర్పంచ్ ల శిక్షణా తరగతులు జరుగుతున్నాయని,వీటిల్లో సర్పంచ్ లకు కార్మికులను తొలగించే అధికారం లేదని చెప్పామని,పోస్టల్ ఇన్సూరెన్స్ చేయిస్తామని,అశ్వాపురం,అశ్వారావుపేట మండలాల్లో కార్మికులకు ఆగిన జూన్ నెల వేతనాలను ఎక్కడ ఆగాయో పరిశీలన చేసి,పరిష్కరిస్తామని అన్నారు.ఈ కార్యక్రమం లో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పిట్టల అర్జున్,గద్దల శ్రీనివాస్,దొడ్డ రవి కుమార్, వెంకటమ్మ,సహాయ కార్యదర్శులు భూక్యా రమేష్, రాజేష్,గ్రామ పంచాయతి ఎంప్లాయిస్ & వర్కర్స్ యూనియన్ జిల్లాకార్యదర్శిగద్దల,శివకృష్ణ,జిల్లానాయకులురంగా,విజయ్,అనిల్,విజయలక్ష్మి,సిఐటియు నాయకులు నిమ్మల మధు, రఘు,విజయ్,అభిమిత్ర తదితరులు పాల్గొన్నారు.


