epaper
Monday, March 2, 2026
epaper

అమ్మో పులి… ఏజెన్సీ గ్రామాల్లో గుబులు

అమ్మో పులి… ఏజెన్సీ గ్రామాల్లో గుబులు
మైలారం–రేగళ్ల అటవీ ప్రాంతాల్లో పులి సంచారం
ఒంటరిగా అడవికి వెళ్లొద్దని అటవీశాఖ హెచ్చరిక
పశువుల కాపరులు, తునికాకు కార్మికుల్లో ఆందోళన

కాకతీయ, కొత్తగూడెం రూరల్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీ గ్రామాల్లో పులి సంచారం ప్రచారం కలకలం రేపుతోంది. మైలారం, రేగళ్ల, గట్టు మల్ల, బంగారు చిలక అటవీ ప్రాంతాల్లో పులి తిరుగుతోందన్న సమాచారంతో గిరిజన గ్రామాల్లో భయం నెలకొంది. ఒంటరిగా అడవికి వెళ్లవద్దని అటవీశాఖ అధికారులు గ్రామస్తులకు హెచ్చరికలు జారీ చేయడంతో ప్రజల్లో మరింత గుబులు మొదలైంది. ఒకప్పటి నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలుగా పేరొందిన ఈ దట్ట అటవీ మండలాల్లో ప్రస్తుతం పులి సంచరిస్తోందన్న ప్రచారం రైతులు, కూలీలలో ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా పూడు వ్యవసాయం చేపట్టిన రైతులు అడవికి వెళ్లేందుకు వెనుకాడుతున్నారు. పశువులను అడవిలో మేపే కాపరులు కూడా అప్రమత్తమయ్యారు. అటవీశాఖ పులి సంచరిస్తోందని చెబుతున్నప్పటికీ, పాదముద్రల స్పష్టమైన ఆధారాలు చూపించలేదని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. “పులి ఉన్నట్లయితే పాదముద్రలు, కెమెరా ట్రాప్ చిత్రాలు చూపించాలి. భయపెట్టి అడవికి వెళ్లొద్దంటున్నారు” అని కొందరు రైతులు అభిప్రాయపడుతున్నారు. పాదముద్రల సేకరణలో అటవీశాఖ మరింత స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

వేసవికాలం… ఉపాధిపై ప్రభావం

వేసవి ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంతాల్లో తునికాకు సేకరణకు సిద్ధమవుతున్న గిరిజనులకు ఈ హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి. తునికాకు సేకరణే ప్రధాన ఉపాధి కావడంతో, పులి సంచారం భయంతో అడవికి వెళ్లలేకపోతే జీవనోపాధి దెబ్బతింటుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహిళలు వంటచెరుకు కోసం ప్రతిరోజూ అడవికి వెళ్తుంటారు. ఇప్పుడు పులి సంచారం ప్రచారంతో అడవికి వెళ్లడానికి భయపడుతున్నారు. పశువులను అడవిలో మేపేందుకు కూడా కుటుంబాలు వెనుకంజ వేస్తున్నాయి. “ఒకవేళ ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిది?” అని పశువుల కాపరులు ప్రశ్నిస్తున్నారు.

ఆళ్లపల్లి నుంచి మైలారం దాకా?

ఇటీవల ఆళ్లపల్లి అటవీ ప్రాంతంలో సంచరించిన పులి ప్రస్తుతం రేగళ్ల, మైలారం, గట్టు మల్ల ప్రాంతాలవైపు కదిలిందని అటవీశాఖ ప్రచారం చేస్తోంది. నీటి వనరులు ఉన్న ప్రాంతాలకు వేసవిలో వన్యప్రాణులు రావడం సహజమేనని అధికారులు చెబుతున్నారు. అయితే గ్రామస్తులు మాత్రం పులి నిజంగానే ఉందా? లేక అప్రమత్తం కోసం హెచ్చరికలా? అన్న సందేహంలో ఉన్నారు.

“ప్రజలను అలెర్ట్ చేస్తున్నాం”

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఏజెన్సీ గ్రామాల్లో పులి సంచరిస్తోందన్న సమాచారంతో అప్రమత్త చర్యలు చేపట్టామని అటవీశాఖ బీట్ ఆఫీసర్ రమేష్ తెలిపారు. “గ్రామస్తులు ఒంటరిగా అడవికి వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశాం. అనుమానిత ప్రాంతాల్లో సిబ్బంది పర్యటిస్తూ పాదముద్రల కోసం పరిశీలిస్తున్నారు. అవసరమైన చోట్ల హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశాం” అని వివరించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు

ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు సింగరేణిలో ఎమ్మార్పీఎస్ గద్దె వద్ద నివాళులు త్యాగాలు...

బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..!

బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..! మణుగూరు–బయ్యారం రహదారి ధ్వంసం దుమ్ము ధూళితో గిరిజన బిడ్డల అనారోగ్యం ప్రజల...

అదుపుతప్పిన ఇసుక ట్రాక్టర్ – డ్రైవర్ దుర్మరణం

అదుపుతప్పిన ఇసుక ట్రాక్టర్ – డ్రైవర్ దుర్మరణం నాగులవంచ వద్ద తెల్లవారుజామున ప్రమాదం ఓవర్‌టేక్...

వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే

వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే 21 మంది తహశీల్దార్లతో యుద్ధప్రాతిపదికన సర్వే ఖమ్మం జిల్లాకు...

వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ

వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో భోజనాల పంపిణీ కాకతీయ,...

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ కాకతీయ, ఖమ్మం : ఎస్సీ...

భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు

భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు పేదల పేరుతో రాద్ధాంతం చేశారు ఏజెంట్ల మోసాలపై బాధితులకు...

మోదీ పాలనలో దేశానికి ప్రమాదం

మోదీ పాలనలో దేశానికి ప్రమాదం కార్పొరేట్ల కోసమే కేంద్రం విధానాలు సీపీఐ (ఎం) పొలిట్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img