epaper
Sunday, March 1, 2026
epaper

ఖాకీ బుక్ కాంగ్రెస్‌కు చుట్టమైందా..?

ఖాకీ బుక్ కాంగ్రెస్‌కు చుట్టమైందా..?
అధికార పార్టీకి పోలీసులు కొమ్ము కాస్తున్నారు
ఎన్నికల్లో కాంగ్రెస్ నేత‌ల దౌర్జన్యం
అయినా పోలీసుల క‌ళ్ల‌కు ఈ దృశ్యాలు క‌నిపించ‌డం లేదు
బీఆర్ఎస్ కార్యకర్తల అరెస్టులు అక్రమం
అక్రమ కేసులకు పోలీసులే బాధ్యత వహించాలి
ప్రజా తీర్పు బీఆర్ఎస్ వైపే ఉంది
డీజీపీ తీరును త‌ప్పుబ‌డుతూ హరీష్‌రావు తీవ్ర విమర్శలు
రైతుబంధు వెంటనే జమ చేయాలని డిమాండ్
అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని స్పష్టం

కాకతీయ, సంగారెడ్డి : డీజీపీ శివధర్ రెడ్డి పేర్కొంటున్న “ఖాకీ బుక్” కాంగ్రెస్ పార్టీకి చుట్టంగా మారిపోయిందా అని మాజీ మంత్రి, అసెంబ్లీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ప్రశ్నించారు. సంగారెడ్డి జిల్లా జైలులో రిమాండ్‌లో ఉన్న 13 మంది బీఆర్ఎస్ కార్యకర్తలను పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పోలీసు వ్యవస్థ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన పోలీసులే అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నాయకులు దౌర్జన్యాలకు పాల్పడ్డారని, ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ ప్రచార గడువు ముగిసిన తర్వాత కూడా వార్డుల్లో తిరిగారని ఆరోపించారు. ఇలాంటి ఘటనలు బహిరంగంగా జరిగినప్పటికీ పోలీసులు పట్టించుకోలేదని విమర్శించారు. అధికార పార్టీ నాయకులు చేసిన తప్పులు పోలీసుల కళ్లకు కనిపించకపోవడం ఆశ్చర్యకరమని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేసి జైలుకు పంపించడం రాజకీయ కక్ష సాధింపులో భాగమని హరీష్ రావు ఆరోపించారు. ఘర్షణల సమయంలో కాంగ్రెస్ నాయకులు, వారి అనుచరులు దాడులకు పాల్పడ్డారని, ఆ దృశ్యాలకు సంబంధించిన వీడియో ఆధారాలు ఉన్నప్పటికీ పోలీసులు కేసులు నమోదు చేయలేదని పేర్కొన్నారు. కానీ ప్రశ్నించిన బీఆర్ఎస్ కార్యకర్తలపైనే తీవ్రమైన కేసులు నమోదు చేసి అరెస్టులు చేయడం అన్యాయమన్నారు.

పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం

పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించకుండా అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని హరీష్ రావు విమర్శించారు. డీజీపీ తరచూ చెప్పే “ఖాకీ బుక్” అందరికీ సమానమైతే కాంగ్రెస్ నాయకులపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులను అవమానించిన ఘటనల్లో కూడా చర్యలు తీసుకోలేదని, కానీ బీఆర్ఎస్ కార్యకర్తలపై మాత్రం కఠినంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. మౌఖిక ఆదేశాలతో అక్రమ కేసులు నమోదు చేస్తున్న పోలీసు అధికారులు భవిష్యత్తులో చట్టం ముందు జవాబుదారీ కావాల్సి వస్తుందని హెచ్చరించారు. ఎస్సీ వర్గానికి చెందిన కార్యకర్తలపై కూడా అట్రాసిటీ కేసులు నమోదు చేయడం ప్రభుత్వ దురుద్దేశాన్ని సూచిస్తోందని ఆరోపించారు. చట్టాన్ని రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించడం ప్రజాస్వామ్యానికి ముప్పుగా మారుతుందని అన్నారు.

ప్రజా తీర్పు బీఆర్ఎస్ వైపే ఉంది

అన్ని అవరోధాలు, అక్రమ కేసులు, అధికార దుర్వినియోగం జరిగినప్పటికీ ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చారని హరీష్ రావు పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సుమారు 800 కౌన్సిలర్ స్థానాలు, 20 చైర్మన్ పదవులు గెలుచుకోవడం ప్రజా విశ్వాసానికి నిదర్శనమన్నారు. ప్రజల మద్దతుతోనే పార్టీ బలంగా నిలిచిందని తెలిపారు. అధికార పార్టీ పోలీసు వ్యవస్థను ఉపయోగించి కొన్ని స్థానాల్లో విజయం సాధించిందని ఆరోపించారు. అయినప్పటికీ ప్రజల తీర్పు స్పష్టంగా బీఆర్ఎస్ వైపే ఉందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోతుందని వ్యాఖ్యానించారు. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని రైతుబంధు నిధులను వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ఎన్నికల కోడ్ ముగిసిన నేపథ్యంలో నిధుల విడుదలలో ఆలస్యం చేయడం సరికాదన్నారు. రైతుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు.
రైతుబంధు నిధులను వెంటనే విడుదల చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. అవసరమైతే ముఖ్యమంత్రి కార్యాలయం, వ్యవసాయ శాఖ కార్యాలయాలను ముట్టడిస్తామని తెలిపారు. రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు బీఆర్ఎస్ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. పోలీసుల అక్రమ చర్యలు, కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో గట్టిగా ప్రశ్నిస్తామని హరీష్ రావు తెలిపారు. డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా ప్రభుత్వాన్ని నిలదీస్తామని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు అన్ని విధాలుగా పోరాడతామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన వెంట ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, మాణిక్ రావు, మాజీ ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్ రెడ్డి, పట్టోళ్ల శశిధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

విద్యుత మీటరు రీడర్ల సమస్యను పరిష్కరించండి

విద్యుత మీటరు రీడర్ల సమస్యను పరిష్కరించండి * మార్చు 1 నుంచి మీటర్...

ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు సన్మానం

ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు సన్మానం కాకతీయ, చేర్యాల: చేర్యాల మున్సిపాలిటీతో...

రాంపూర్ లో ఘనంగా మల్లన్న పట్నాలు

రాంపూర్ లో ఘనంగా మల్లన్న పట్నాలు కాకతీయ,చేర్యాల: మండలంలోని రాంపూర్ గ్రామానికి చెందిన...

తెలంగాణ అగ్రి ఎంప్లాయిస్ యూనియన్‌ అధ్యక్షుడిగా పురం ఆంజనేయులు

తెలంగాణ అగ్రి ఎంప్లాయిస్ యూనియన్‌ అధ్యక్షుడిగా *పురం ఆంజనేయులు ఏకగ్రీవం సభ్యుల సమస్యలను పరిష్కరించేందుకు...

గజ్వేల్ శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో ఘనంగా సైన్స్ ఎక్స్‌పో

గజ్వేల్ శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో ఘనంగా సైన్స్ ఎక్స్‌పో -...

విద్యార్థులు సైన్స్‌ పట్ల ఆసక్తిని పెంచుకోవాలని

విద్యార్థులు సైన్స్‌ పట్ల ఆసక్తిని పెంచుకోవాలని * ప్రధానోపాధ్యాయులు సుదర్శన్ రెడ్డి * సైన్స్...

ఆర్అండ్‌ఆర్ కాలనీలో ఉచిత బీపీ, షుగర్ పరీక్షలు

ఆర్అండ్‌ఆర్ కాలనీలో ఉచిత బీపీ, షుగర్ పరీక్షలు - బాలాజీ న్యూరో సూపర్...

ప్రజలు అప్పగించిన బాధ్యతను సాకారం చేయాలి

ప్రజలు అప్పగించిన బాధ్యతను సాకారం చేయాలి *భువనగిరి పార్లమెంటు సభ్యులు చామల కిరణ్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img