ఆక్రమించిన ప్రభుత్వ భూమిని స్వాధీనం చేయాలి
* కొంగరి నారాయణ స్మారక విజ్ఞాన సేవా సంఘం ముస్త్యాల ట్రస్టు అధ్యక్షులు కొంగరి వెంకట
కాకతీయ, చేర్యాల: చేర్యాల మండలం ముస్త్యాల గ్రామ శివారులో గల సర్వే నంబర్ 1197 ప్రభుత్వ పంచరావి సుమారు 2 ఎకరాల భూమిని తన సొంత పట్టా భూమిలో కలుపుకొని అనుభవిస్తున్న గ్రామస్తుడు అతహర్ అహ్మద్ 10 గుంటల భూమిని ఆక్రమించి ఇందులో బెల్టు షాపు, లిక్కర్ వ్యాపారం, సిటింగ్స్ యదేచ్చగా నిర్వహిస్తున్న చింతల కిష్టయ్య లపై చర్యలు తీసుకోవాలని కామ్రేడ్ కొంగరి నారాయణ స్మారక విజ్ఞాన సేవా సంఘం ముస్త్యాల ట్రస్టు అధ్యక్షులు కొంగరి వెంకట మావో రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం మండల తహసిల్దార్ దిలీప్ నాయక్ ను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు.. ఈ సందర్భంగా కొంగరి వెంకట మావో మాట్లాడుతూ. 1197 సర్వేనెంబర్ లో పూర్వం నుండి గ్రామానికి ఆనుకొని ఉన్న ప్రభుత్వ పంచరావి భూములలో జడ్పీహెచ్ఎస్ హైస్కూలు, ప్రైమరీ స్కూలు, మోడల్ స్కూలు, గ్రామ పంచాయతీ భవనం, పోస్ట్ ఆఫీస్ భవనం, అంగన్వాడి కేంద్రం, ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, గ్రామస్తుల ఇండ్లు ఉన్నాయని దీనికి ఆనుకొని అతహర్ హమ్మద్ సొంత వ్యవసాయ భూములు ఉన్నందున ఈ పంచరావి భూమిని అందులో కలుపుకొని అక్రమంగా అనుభవిస్తున్నాడని దీనిని వెలికి తీయాలని గ్రామంలో ఇంటి స్థలాలు లేని పేదలు అనేకమంది ఉన్నారని వారికి ఇందులో ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకునేందుకు అవకాశం కల్పించాలని కోరారు.
చింతల కిష్టయ్య తను సిద్దిపేట జనగామ రహ దారి మెయిన్ రోడ్డు పక్కన దాదాపు 10 గుంటల భూమిని ఆక్రమించి బెల్టు షాపు లిక్కర్ గుడుంబా వ్యాపారం ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 వరకు సిట్టింగ్స్ ఇల్లీగల్ దందా నడుపుతూ.. గ్రామ ప్రజలను యువతను, కొన్ని కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తున్నాడని ఈ బెల్ట్ షాపు పక్కన ప్రభుత్వ ఆసుపత్రి, మోడల్ స్కూల్, గర్ల్స్ హాస్టల్ ఉన్నప్పటికీ ఇదేచ్ఛగా తన ఇల్లీగల్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాడని దీన్ని వెంటనే తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని వీరు ఆక్రమించిన పంచరావి ప్రభుత్వ భూమిని ప్రభుత్వం స్వాధీనపరచుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో రేపాక కుమార్, గుండ్ర రవీందర్, చింతకింది డానియల్, కర్రె సత్తయ్య, కొంగరి చంద్ర మజుందార్, తరిగొప్పుల సహదేవులు, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.


