విద్యుత్ ఉద్యోగుల రాష్ట్ర స్థాయి క్రీడలు విజయవంతం
ఖమ్మంలో ఘనంగా ముగిసిన క్రీడా, సాంస్కృతిక పోటీలు
విజేతలకు బహుమతుల ప్రదానం, నిర్వాహకులకు అభినందనలు
కాకతీయ, ఖమ్మం : విద్యుత్ శాఖ ఉద్యోగుల రాష్ట్రస్థాయి క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాలు ఖమ్మం భక్త రామదాసు కళాక్షేత్రంలో ఘనంగా ముగిశాయి. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఈ పోటీలలో వివిధ విభాగాల్లో ప్రతిభ కనబర్చిన విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా జనరల్ సెక్రటరీ బాబు నాయక్, సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీరింగ్ వి.రాంబాబు, శ్రీనివాస చారి, రాష్ట్ర స్పోర్ట్స్ ఆఫీసర్ ఎన్. జగన్నాథం మాట్లాడుతూ క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఉద్యోగుల్లో స్ఫూర్తి, ఐక్యతను పెంపొందిస్తాయని తెలిపారు. ఉద్యోగులు తమ విధులతో పాటు క్రీడల్లోనూ ప్రతిభ కనబర్చడం అభినందనీయమన్నారు. పురుషులు, మహిళా ఉద్యోగులు క్రీడా, సాంస్కృతిక విభాగాల్లో ప్రతిభ కనబర్చగా, విజేతలను సత్కరించి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి న్యాయనిర్ణేతలుగా అద్దేపల్లి వెంకట శివరామకృష్ణ శాస్త్రి, సురభి కొండలరావు, సింధూరి కంబాల శ్రీనివాసరావు వ్యవహరించారు. కార్యక్రమంలో అవుట్డోర్ సెక్రటరీ పి.వి. అప్పారావు, ఇండోర్ సెక్రటరీ అశోక్, సాంస్కృతిక సెక్రటరీ డి. సాంబశివరావు, మహిళా ప్రతినిధి జి. కవిత, టోర్నమెంట్ ఇంచార్జ్ గుడిమెట్ల మధు, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


