epaper
Monday, March 2, 2026
epaper

నువ్వు అంత మోగొనివా..!

నువ్వు అంత మోగొనివా..!
నువ్వు సినిమా హీరో అనుకుంటున్నావా?
ఏయ్ సీఐ.. నిన్ను వ‌దిలిపెట్ట‌ను
పోలీసులపై సీనియ‌ర్ కాంగ్రెస్ నేత‌ జగ్గారెడ్డి బూతు పురాణం

కాకతీయ, సంగారెడ్డి : సంగారెడ్డి మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా 34వ వార్డు పోలింగ్ కేంద్రం వద్ద బుధవారం ఉదయం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలింగ్ కేంద్రంలో రిగ్గింగ్ జరుగుతోందంటూ కాంగ్రెస్ అభ్యర్థి అభ్యంతరం వ్యక్తం చేయడంతో మొదలైన వివాదం, చివరకు పోలీసులతో ఘర్షణాత్మక వాతావరణానికి దారి తీసింది. సమాచారం అందుకున్న కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జగ్గారెడ్డి హుటాహుటిన పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. అక్కడ విధుల్లో ఉన్న సీఐ శివకుమార్ వ్యవహారశైలిపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ జగ్గారెడ్డి ఘాటుగా స్పందించారు. ఈ క్రమంలో పోలీసు అధికారులపై తీవ్ర పదజాలంతో మండిపడ్డారు. పోలింగ్ కేంద్రంలో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ జగ్గారెడ్డి లోపలికి వెళ్లే ప్రయత్నం చేయగా, పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చెలరేగింది. పరిస్థితి అదుపు తప్పి కొద్దిసేపు తోపులాటకు దారి తీసింది. డీఎస్పీ సత్తయ్య గౌడ్ సహా ఇతర పోలీసు సిబ్బంది జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.

పోలింగ్ కేంద్రంలో హైడ్రామా

పోలింగ్ కేంద్రం వద్ద జగ్గారెడ్డి మాట్లాడుతూ, సంబంధిత సీఐ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని తీవ్రంగా ఆరోపించారు. “పోలీసులు ప్రజాస్వామ్యబద్ధంగా కాకుండా అధికార పార్టీకి మద్దతుగా పనిచేస్తున్నారు” అంటూ విమర్శించారు. వెంటనే సంబంధిత సీఐను సస్పెండ్ చేయాలని, లేకపోతే ఎన్నికలను బహిష్కరిస్తామని హెచ్చరించారు. అలాగే 34వ వార్డులో జరుగుతున్న పోలింగ్‌ను తక్షణమే రద్దు చేసి తిరిగి ఎన్నిక నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనతో పోలింగ్ కేంద్రం వద్ద కొద్దిసేపు గందరగోళ వాతావరణం నెలకొంది. అదనపు పోలీసు బలగాలను రంగంలోకి దించి భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఎన్నికల ప్రక్రియకు ఆటంకం కలగకుండా అధికారులు తగిన చర్యలు తీసుకున్నారు.

చట్టపరమైన చర్యలకు సన్నాహాలు

ఇదిలా ఉండగా, ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు సంబంధించి ఫిబ్రవరి 10న సదాశివపేటలో డబ్బులు పంపిణీ చేశారన్న ఆరోపణలపై జగ్గారెడ్డిపై ఇప్పటికే కేసు నమోదైనట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. తాజాగా పోలింగ్ కేంద్రం వద్ద జరిగిన ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వాటి ఆధారంగా చట్టపరమైన చర్యలు తీసుకునే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. పోలీసులపై దురుసు ప్రవర్తన, విధి నిర్వహణలో ఉన్న అధికారులను బెదిరించిన తీరు పట్ల సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల వేళ ఇలాంటి సంఘటనలు ప్రజాస్వామ్య ప్రక్రియకు విఘాతం కలిగిస్తాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటనపై జిల్లా ఎన్నికల అధికారులు పూర్తి నివేదిక కోరినట్లు సమాచారం. నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకునే అవకాశముందని అధికారులు తెలిపారు. అదనపు బందోబస్తు మధ్య పోలింగ్ ప్రక్రియ యథావిధిగా కొనసాగుతోంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

విద్యుత మీటరు రీడర్ల సమస్యను పరిష్కరించండి

విద్యుత మీటరు రీడర్ల సమస్యను పరిష్కరించండి * మార్చు 1 నుంచి మీటర్...

ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు సన్మానం

ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు సన్మానం కాకతీయ, చేర్యాల: చేర్యాల మున్సిపాలిటీతో...

రాంపూర్ లో ఘనంగా మల్లన్న పట్నాలు

రాంపూర్ లో ఘనంగా మల్లన్న పట్నాలు కాకతీయ,చేర్యాల: మండలంలోని రాంపూర్ గ్రామానికి చెందిన...

తెలంగాణ అగ్రి ఎంప్లాయిస్ యూనియన్‌ అధ్యక్షుడిగా పురం ఆంజనేయులు

తెలంగాణ అగ్రి ఎంప్లాయిస్ యూనియన్‌ అధ్యక్షుడిగా *పురం ఆంజనేయులు ఏకగ్రీవం సభ్యుల సమస్యలను పరిష్కరించేందుకు...

గజ్వేల్ శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో ఘనంగా సైన్స్ ఎక్స్‌పో

గజ్వేల్ శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో ఘనంగా సైన్స్ ఎక్స్‌పో -...

విద్యార్థులు సైన్స్‌ పట్ల ఆసక్తిని పెంచుకోవాలని

విద్యార్థులు సైన్స్‌ పట్ల ఆసక్తిని పెంచుకోవాలని * ప్రధానోపాధ్యాయులు సుదర్శన్ రెడ్డి * సైన్స్...

ఆర్అండ్‌ఆర్ కాలనీలో ఉచిత బీపీ, షుగర్ పరీక్షలు

ఆర్అండ్‌ఆర్ కాలనీలో ఉచిత బీపీ, షుగర్ పరీక్షలు - బాలాజీ న్యూరో సూపర్...

ప్రజలు అప్పగించిన బాధ్యతను సాకారం చేయాలి

ప్రజలు అప్పగించిన బాధ్యతను సాకారం చేయాలి *భువనగిరి పార్లమెంటు సభ్యులు చామల కిరణ్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img