epaper
Monday, March 2, 2026
epaper

స్వేచ్ఛాయుత ఎన్నికలే లక్ష్యం

స్వేచ్ఛాయుత ఎన్నికలే లక్ష్యం
◆ నియమావళి ఉల్లంఘనకు తావులేదు
◆ 1100 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు
◆ విధివిధానాలపై ప్రత్యేక అవగాహన
◆ ఘర్షణలకు అవకాశం లేకుండా చర్యలు:
పోలీస్ కమిషనర్ సునీల్ దత్

కాకతీయ, ఖమ్మం బ్యూరో: జిల్లాలో స్వేచ్ఛాయుత వాతావరణంలో, నిష్పక్షపాతంగా మున్సిపల్ ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా పోలీసు సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు. ఎన్నికల బందోబస్తు విధులకు సిద్ధమవుతున్న పోలీస్ సిబ్బందికి ఎన్నికల విధులు, విధివిధానాలు, ప్రవర్తన నియమావళి, శాంతిభద్రతల పరిరక్షణ అంశాలపై అవగాహన కల్పించేందుకు ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ఎన్నికల సంఘం నియంత్రణలో పూర్తి క్రమశిక్షణతో విధులు నిర్వహించాలన్నారు. ఎన్నికల నియమావళిపై ప్రతి పోలీస్ సిబ్బంది సమగ్ర అవగాహన కలిగి ఉండాలని, ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియ ముగిసేంత వరకు ప్రవర్తన నియమావళి అమల్లో ఉంటుందని, అత్యవసర సమయాల్లో వెంటనే స్పందించాల్సిన బాధ్యత పోలీసులపై ఉంటుందని తెలిపారు.

కఠినంగా శాంతిభద్రతల పరిరక్షణ

శాంతిభద్రతల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని కమిషనర్ స్పష్టం చేశారు. అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని, పోలింగ్ కేంద్రాలను ఎట్టి పరిస్థితుల్లో వదిలి వెళ్లరాదని ఆదేశించారు. ఎన్నికల్లో డబ్బు, మద్యం ప్రభావాన్ని అడ్డుకునేందుకు ఎన్నికల సంఘం కఠిన చర్యలు తీసుకుంటోందని, ఈ అంశంలో పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్, ఫ్లయింగ్ స్క్వాడ్స్, చెక్‌పోస్టులు, రూట్ మొబైల్ పార్టీలు నిర్వహించే విధులపై సిబ్బందికి పూర్తి అవగాహన ఉండాలని సూచించారు. ఎన్నికల ముందు, పోలింగ్ రోజు, ఓట్ల లెక్కింపు సమయంలో చేపట్టాల్సిన విధులపై స్పష్టతతో పనిచేయాలన్నారు.

అవాంఛనీయ ఘటనలకు తావివ్వొద్దు

పోలింగ్ అనంతరం ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఆదేశించారు. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలలో మొత్తం 11 వందల మంది పోలీస్ సిబ్బందితో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఎక్కడా ఘర్షణ వాతావరణం ఏర్పడకుండా పోలీస్ పెట్రోలింగ్ ముమ్మరంగా కొనసాగించాలని స్పష్టం చేశారు.
బందోబస్తు విధుల్లో 4 మంది అడిషనల్ డీసీపీలు, 8 మంది ఏసీపీలు, 25 మంది సీఐలు, 80 మంది ఎస్సైలు, 975 మంది పోలీస్ సిబ్బందిని నియమించినట్లు కమిషనర్ వివరించారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ (ఏఆర్) కుమారస్వామి, ఏసీపీలు తిరుపతి రెడ్డి, నర్సయ్యతో పాటు రూరల్ డివిజన్ సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు. జిల్లాలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటోందని, ప్రజలు కూడా సహకరించాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ విజ్ఞప్తి చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు

ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు సింగరేణిలో ఎమ్మార్పీఎస్ గద్దె వద్ద నివాళులు త్యాగాలు...

బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..!

బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..! మణుగూరు–బయ్యారం రహదారి ధ్వంసం దుమ్ము ధూళితో గిరిజన బిడ్డల అనారోగ్యం ప్రజల...

అదుపుతప్పిన ఇసుక ట్రాక్టర్ – డ్రైవర్ దుర్మరణం

అదుపుతప్పిన ఇసుక ట్రాక్టర్ – డ్రైవర్ దుర్మరణం నాగులవంచ వద్ద తెల్లవారుజామున ప్రమాదం ఓవర్‌టేక్...

వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే

వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే 21 మంది తహశీల్దార్లతో యుద్ధప్రాతిపదికన సర్వే ఖమ్మం జిల్లాకు...

వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ

వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో భోజనాల పంపిణీ కాకతీయ,...

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ కాకతీయ, ఖమ్మం : ఎస్సీ...

భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు

భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు పేదల పేరుతో రాద్ధాంతం చేశారు ఏజెంట్ల మోసాలపై బాధితులకు...

మోదీ పాలనలో దేశానికి ప్రమాదం

మోదీ పాలనలో దేశానికి ప్రమాదం కార్పొరేట్ల కోసమే కేంద్రం విధానాలు సీపీఐ (ఎం) పొలిట్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img