epaper
Sunday, March 1, 2026
epaper

ఖమ్మంలో కుళ్లిపోయిన మటన్ కలకలం!

ఖమ్మంలో కుళ్లిపోయిన మటన్ కలకలం!
స్థానికుల ఫిర్యాదుతో బయటపడిన గుట్టు
రంగంలోకి దిగిన మున్సిపల్ అధికారులు
30 కేజీల చెడిపోయిన మటన్ స్వాధీనం
జైలు, హోటళ్లకు సరఫరా చేస్తున్నట్టు గుర్తింపు

కాకతీయ, ఖమ్మం బ్యూరో: ఖమ్మం నగరంలో కుళ్లిపోయిన మటన్ అమ్మకాలు జరగడం తీవ్ర కలకలం రేపింది. మూడో పట్టణ ప్రాంతంలోని మూడు బొమ్మల సెంటర్ వద్ద ఉన్న మస్తాన్ అనే వ్యక్తి నిర్వహిస్తున్న మటన్ షాపులో ఈ అక్రమ దందా బయటపడింది. స్థానికుల సమాచారం మేరకు మున్సిపల్ అధికారులు తనిఖీలు నిర్వహించడంతో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. దుకాణంలో డీప్ ఫ్రిజ్‌లో దాచిపెట్టిన సుమారు 30 కేజీల కుళ్లిపోయిన మటన్‌ను అధికారులు గుర్తించారు. ఫ్రిజ్ తలుపు తెరవగానే భరించలేని దుర్వాసన రావడంతో ఆ మాంసం పూర్తిగా పాడైపోయినట్లు స్పష్టమైంది. అయినప్పటికీ ఎవరికి అనుమానం రాకుండా విక్రయాలు సాగిస్తున్నట్టు తేలింది. స్థానికుల కథనం ప్రకారం ఈ షాపు యజమాని గత కొన్ని ఏళ్లుగా ఇదే విధంగా వ్యాపారం నిర్వహిస్తున్నాడు. అంతేకాక జిల్లా జైలుకు వారానికి ఒకసారి మటన్ సరఫరా చేసే కాంట్రాక్టర్‌గా కూడా వ్యవహరిస్తున్నట్టు సమాచారం. నగరంలోని పలు పెద్ద హోటళ్లకు కూడా ఇక్కడి నుంచే మాంసం సరఫరా అవుతుండటంతో ఈ వ్యవహారం మరింత సంచలనంగా మారింది.

అధికారుల తనిఖీలతో అసలు విషయం బహిర్గతం

ప్రాంతవాసుల ఫిర్యాదు మేరకు మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ కె.శ్రీనివాస్, అసిస్టెంట్ కమిషనర్ అనిల్ నేతృత్వంలో ప్రత్యేక బృందం దుకాణాన్ని తనిఖీ చేసింది. తనిఖీల్లో చెడిపోయిన మటన్ నిల్వలను గుర్తించి వెంటనే స్వాధీనం చేసుకున్నారు. అధికారులు వచ్చారన్న విషయం తెలిసి నిర్వాహకుడు ముందుగానే మాంసాన్ని తొలగించే ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది. అయితే అక్కడే ఉన్న మహిళా జవాన్ అప్రమత్తంగా వ్యవహరించి అతని ప్రయత్నాన్ని అడ్డుకోవడంతో అక్రమ వ్యవహారం పూర్తిగా బయటపడింది.

రోగాల బారిన గొర్రెలు కూడా స్వాధీనం

తనిఖీలు కొనసాగుతున్న సమయంలోనే నిర్వాహకుడికి సంబంధించిన మరో అక్రమం బయటపడింది. రోగాల బారిన పడిన మూడు గొర్రెలను ఆటోలో తీసుకువస్తుండగా అధికారులు గుర్తించి వాటిని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ గొర్రెలను కూడా మాంసంగా మార్చి విక్రయించే యత్నం చేస్తున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి నాసిరకం, కుళ్లిపోయిన మాంసం విక్రయించడం వల్ల ప్రజల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటుందని మండిపడ్డారు. నిర్వాహకుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో స్థానికులు తోళ్ల రాకేష్, బొమ్మ ఉదయ్, దుర్గ తదితరులు కీలకంగా వ్యవహరించి అధికారులకు సమాచారం అందించారు. వారి చొరవతోనే ఈ అక్రమ దందా బయటపడిందని అధికారులు తెలిపారు. నగరంలో మరికొన్ని చోట్ల కూడా ఇలాంటి అమ్మకాలు జరుగుతున్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆహార భద్రత నిబంధనలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ అధికారులు  స్పష్టం చేశారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు

ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు సింగరేణిలో ఎమ్మార్పీఎస్ గద్దె వద్ద నివాళులు త్యాగాలు...

బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..!

బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..! మణుగూరు–బయ్యారం రహదారి ధ్వంసం దుమ్ము ధూళితో గిరిజన బిడ్డల అనారోగ్యం ప్రజల...

అదుపుతప్పిన ఇసుక ట్రాక్టర్ – డ్రైవర్ దుర్మరణం

అదుపుతప్పిన ఇసుక ట్రాక్టర్ – డ్రైవర్ దుర్మరణం నాగులవంచ వద్ద తెల్లవారుజామున ప్రమాదం ఓవర్‌టేక్...

వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే

వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే 21 మంది తహశీల్దార్లతో యుద్ధప్రాతిపదికన సర్వే ఖమ్మం జిల్లాకు...

వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ

వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో భోజనాల పంపిణీ కాకతీయ,...

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ కాకతీయ, ఖమ్మం : ఎస్సీ...

భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు

భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు పేదల పేరుతో రాద్ధాంతం చేశారు ఏజెంట్ల మోసాలపై బాధితులకు...

మోదీ పాలనలో దేశానికి ప్రమాదం

మోదీ పాలనలో దేశానికి ప్రమాదం కార్పొరేట్ల కోసమే కేంద్రం విధానాలు సీపీఐ (ఎం) పొలిట్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img