అధికార పార్టీతోనే అభివృద్ధి
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపించాలి
కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్
వైరా మున్సిపాలిటీలో జోరుగా ప్రచారం
కాకతీయ, ఖమ్మం: అధికార పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని, మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈమేరకు శనివారం వైరా మున్సిపాలిటీలో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపును కాంక్షిస్తూ ఐయన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు కొత్తా సీతారాములు, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు వేజెండ్ల సాయి కుమార్, జిల్లా సేవాదళ్ అధ్యక్షుడు సయ్యద్ గౌస్, జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు మొక్క శేఖర్ గౌడ్, జిల్లా కేకేసీ అధ్యక్షుడు విప్లవ కుమార్, ఖమ్మం నగర ఐఎన్టీయూసీ అధ్యక్షుడు నరాల నరేష్ నాయుడు, సైదులు, మున్నాతో కలిసి విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతి సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ… గత పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ సామాన్యునికి చేసింది ఏమీ లేదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తర్వాత ప్రభుత్వం ప్రజా పాలన గావిస్తూ రాష్ట్రం ప్రగతి బాటలో నడుస్తున్నదని అన్నారు. గత పాలకులు వరివేస్తే ఊరేనని భయపెట్టారని, వైరా రిజర్వాయర్ కు సీతమ్మ సాగర్ లింక్ కెనాల్ ద్వారా నీటిని తరిస్తున్నామని, వరి క్వింటాలుకు 500 బోనస్ ఇచ్చి రైతులను ఆర్థికంగా ఆదుకొంటున్నారని, ప్రతి నియోజకవర్గానికి 200 కోట్లు మంజూరు చేసి అధునాతన సౌకర్యాలతో ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను యుద్ధప్రాతిపదికన ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. పేదలకు రేషన్ కార్డులు తద్వారా సన్నబియ్యం పంపిణీ, మహిళలకు వడ్డీలేని రుణాలు అనేక అభివృద్ధి పనులను చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో కొంటెముక్కల నాగేశ్వరరావు, కొంగర సంగయ్య, రాములు, పందిరాజు గౌడ్, లక్ష్మీ , పుష్ప, మంగ, రమ, ప్రగతి తదితర నాయకులు పాల్గొన్నారు.



