epaper
Sunday, March 1, 2026
epaper

కాంగ్రెస్ మోసపూరిత హామీలకు ప్రజలు విసిగిపోయారు

కాంగ్రెస్ మోసపూరిత హామీలకు ప్రజలు విసిగిపోయారు
మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరాలి
బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు పిలుపు

కాకతీయ, కొత్తగూడెం : పాల్వంచ పట్టణ సమగ్రాభివృద్ధి బీఆర్‌ఎస్ పాలనతోనే సాధ్యమని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్‌ఎస్ అధ్యక్షుడు, మాజీ ప్రభుత్వ విప్ రేగా కాంతారావు స్పష్టం చేశారు. శుక్రవారం పాల్వంచ మున్సిపాలిటీ 37వ వార్డు బీఆర్‌ఎస్ అభ్యర్థి మల్లెల స్వప్న కుమారి విజయాన్ని కాంక్షిస్తూ ఆయన ముమ్మర ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వార్డులో ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లను నేరుగా కలిసిన రేగా కాంతారావు, “పాల్వంచ–కొత్తగూడెం ప్రాంత అభివృద్ధి కేసీఆర్ నాయకత్వంలోనే వేగంగా జరిగింది. భవిష్యత్తులోనూ పట్టణానికి ప్రగతి దిశ చూపగల శక్తి బీఆర్‌ఎస్‌కే ఉంది” అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన ఆయన, ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. రైతుబంధు, మహిళలకు రూ.2500 ఆర్థిక సహాయం, తులం బంగారం, వృద్ధులకు రూ.4000 పెన్షన్, విద్యార్థులకు స్కూటీలు వంటి హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేదని మండిపడ్డారు. “రెండేళ్లలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చి పూర్తిగా విఫలమైంది” అని విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు తగిన గుణపాఠం చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. పాల్వంచ కార్పొరేషన్‌పై మరోసారి గులాబీ జెండా ఎగరడం ద్వారానే పట్టణ అభివృద్ధి కొనసాగుతుందని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో కేసీఆర్, కేటీఆర్ నేతృత్వంలో తిరిగి ప్రజాప్రభుత్వం ఏర్పడటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

గెలిపిస్తే వార్డును మోడల్‌గా తీర్చిదిద్దుతా – స్వప్న కుమారి

ఈ సందర్భంగా 37వ వార్డు బీఆర్‌ఎస్ అభ్యర్థి మల్లెల స్వప్న కుమారి మాట్లాడుతూ, తనను గెలిపించే బాధ్యత ప్రజలదైతే, వార్డును అభివృద్ధి చేసే బాధ్యత తనదని హామీ ఇచ్చారు. “అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తా. రోడ్లు, డ్రైనేజీలు, తాగునీరు వంటి మౌలిక వసతులను మెరుగుపరచడమే నా ప్రధాన లక్ష్యం. ఒక్క అవకాశం ఇవ్వండి – వార్డును ఆదర్శంగా నిలబెడతా” అని ఆమె ఓటర్లను కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో స్థానిక బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళా నేతలు, యువజన విభాగం సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు

ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు సింగరేణిలో ఎమ్మార్పీఎస్ గద్దె వద్ద నివాళులు త్యాగాలు...

బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..!

బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..! మణుగూరు–బయ్యారం రహదారి ధ్వంసం దుమ్ము ధూళితో గిరిజన బిడ్డల అనారోగ్యం ప్రజల...

అదుపుతప్పిన ఇసుక ట్రాక్టర్ – డ్రైవర్ దుర్మరణం

అదుపుతప్పిన ఇసుక ట్రాక్టర్ – డ్రైవర్ దుర్మరణం నాగులవంచ వద్ద తెల్లవారుజామున ప్రమాదం ఓవర్‌టేక్...

వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే

వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే 21 మంది తహశీల్దార్లతో యుద్ధప్రాతిపదికన సర్వే ఖమ్మం జిల్లాకు...

వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ

వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో భోజనాల పంపిణీ కాకతీయ,...

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ కాకతీయ, ఖమ్మం : ఎస్సీ...

భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు

భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు పేదల పేరుతో రాద్ధాంతం చేశారు ఏజెంట్ల మోసాలపై బాధితులకు...

మోదీ పాలనలో దేశానికి ప్రమాదం

మోదీ పాలనలో దేశానికి ప్రమాదం కార్పొరేట్ల కోసమే కేంద్రం విధానాలు సీపీఐ (ఎం) పొలిట్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img