epaper
Monday, March 2, 2026
epaper

కాంగ్రెస్–బీఆర్ఎస్ దొందూ దొందే!

కాంగ్రెస్–బీఆర్ఎస్ దొందూ దొందే!
రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన రెండు పార్టీలు
420 హామీలతో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్
మున్సిపాలిటీలకు నిధుల్లేక అభివృద్ధి కుంటుపడింది
అసలైన అభివృద్ధి మోదీతోనే సాధ్యం
బీజేపీ జాతీయ నాయకులు మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి

కాకతీయ, కూసుమంచి : తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల పాలన వల్ల రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, అభివృద్ధి పూర్తిగా అటకెక్కిందని బీజేపీ జాతీయ నాయకులు, కర్ణాటక–తమిళనాడు రాష్ట్రాల సహ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఖమ్మం జిల్లా వైరా, ఎదులాపురం మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించి బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం ఓటర్లను కోరారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ, గత బీఆర్ఎస్ ప్రభుత్వం మున్సిపాలిటీల ఏర్పాటు విషయంలో అస్తవ్యస్త నిర్ణయాలు తీసుకుందని ఆరోపించారు. గ్రామాలను మున్సిపాలిటీలుగా మార్చారే తప్ప, వాటికి అవసరమైన నిధులు, మౌలిక సదుపాయాలు కల్పించలేదన్నారు. డ్రైనేజీలు, రోడ్లు, తాగునీటి వ్యవస్థ లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలన రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చితే, ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ కూడా అదే దారిలో “అప్పుల పరిపాలన” కొనసాగిస్తోందని మండిపడ్డారు.

420 హామీలు ఏమయ్యాయి?

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు 420 హామీలు, ఆరు గ్యారంటీలు ప్రకటించి అధికారంలోకి వచ్చాక వాటిని పూర్తిగా విస్మరించిందని పొంగులేటి ధ్వజమెత్తారు. నిరుద్యోగ భృతి లేదు, వృద్ధాప్య పెన్షన్ల పెంపు లేదు, కల్యాణలక్ష్మి నిధులు లేవు, తులం బంగారం మాటే మరిచిపోయారని విమర్శించారు. రైతు రుణమాఫీని పూర్తిస్థాయిలో అమలు చేయక, అరకొర చర్యలతో ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. క్షేత్రస్థాయిలో పాలన లేకపోయినా, పత్రికల్లో మాత్రం కోట్ల రూపాయల ప్రకటనలతో ప్రజల సొమ్ము వృథా చేస్తున్నారని మండిపడ్డారు. గ్రామ పంచాయతీలైనా, మున్సిపాలిటీలైనా నడవాలంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులే ప్రధాన ఆధారమని పొంగులేటి స్పష్టం చేశారు. జల్ జీవన్ మిషన్ లాంటి పథకాలతో ఇంటింటికీ తాగునీరు అందడం పూర్తిగా కేంద్ర నిధుల వల్లే సాధ్యమైందని గుర్తుచేశారు. దేశవ్యాప్తంగా 22 రాష్ట్రాల్లో బీజేపీ, ఎన్డీయే కూటమి పాలన సాగుతోందని, డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలతోనే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రెండూ ప్రజలకు చేసిందేమీ లేదని, అవి కేవలం ఓట్ల రాజకీయాలకే పరిమితమయ్యాయని విమర్శించారు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు చైతన్యవంతులై అవినీతి పార్టీలకు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. వైరా, ఎదులాపురం మున్సిపాలిటీల సమగ్ర అభివృద్ధి జరగాలంటే బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు, నాయకులు రంగా కిరణ్, దొంగల సత్యనారాయణ, గోంగూర వెంకటేశ్వర్లు, బండారు నరేష్, నున్న రవికుమార్, రజినీ రెడ్డి, ఆర్‌వీఎస్ యాదవ్, అల్లిక అంజయ్య, బోయల వెంకట్, మనుబోలు వెంకటకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు

ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు సింగరేణిలో ఎమ్మార్పీఎస్ గద్దె వద్ద నివాళులు త్యాగాలు...

బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..!

బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..! మణుగూరు–బయ్యారం రహదారి ధ్వంసం దుమ్ము ధూళితో గిరిజన బిడ్డల అనారోగ్యం ప్రజల...

అదుపుతప్పిన ఇసుక ట్రాక్టర్ – డ్రైవర్ దుర్మరణం

అదుపుతప్పిన ఇసుక ట్రాక్టర్ – డ్రైవర్ దుర్మరణం నాగులవంచ వద్ద తెల్లవారుజామున ప్రమాదం ఓవర్‌టేక్...

వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే

వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే 21 మంది తహశీల్దార్లతో యుద్ధప్రాతిపదికన సర్వే ఖమ్మం జిల్లాకు...

వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ

వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో భోజనాల పంపిణీ కాకతీయ,...

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ కాకతీయ, ఖమ్మం : ఎస్సీ...

భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు

భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు పేదల పేరుతో రాద్ధాంతం చేశారు ఏజెంట్ల మోసాలపై బాధితులకు...

మోదీ పాలనలో దేశానికి ప్రమాదం

మోదీ పాలనలో దేశానికి ప్రమాదం కార్పొరేట్ల కోసమే కేంద్రం విధానాలు సీపీఐ (ఎం) పొలిట్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img