epaper
Sunday, March 1, 2026
epaper

లేఔట్ అనుమతుల్లో నిబంధనలు తప్పనిసరి

లేఔట్ అనుమతుల్లో నిబంధనలు తప్పనిసరి
అప్రోచ్ రోడ్డు లేకుంటే లేఔట్‌కు అనుమతి లేదు
ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లలో అనుమతులు నిషేధం
పారదర్శకంగా దరఖాస్తుల పరిశీలన
కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి స్పష్టీక‌ర‌ణ‌
జిల్లా స్థాయి లేఔట్ కమిటీ సమావేశం

కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : లేఔట్ అనుమతుల జారీలో ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలను కట్టుదిట్టంగా పాటించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి స్పష్టం చేశారు. ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా నిబంధనల మేరకే అనుమతులు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ ప్రజ్ఞా సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా స్థాయి లేఔట్ కమిటీ సమావేశంలో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అభిషేక్ అగస్త్యతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. పెండింగ్‌లో ఉన్న లేఔట్ దరఖాస్తులపై సంబంధిత రెవెన్యూ, ఇరిగేషన్, ఇతర లైన్ డిపార్ట్మెంట్ అధికారులతో కలెక్టర్ సుదీర్ఘంగా చర్చించారు. ప్రతి దరఖాస్తుకు సంబంధించిన అభ్యంతరాలు, శాఖల రిమార్క్స్‌ను అడిగి తెలుసుకుని పలు కీలక సూచనలు చేశారు. అనుమతుల ప్రక్రియలో ఎలాంటి లోపాలు లేకుండా పారదర్శకంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఈ సమావేశంలో 12 డ్రాఫ్ట్ లేఔట్‌లు, 4 ఫైనల్ లేఔట్‌లను కమిటీ పరిశీలించిందని తెలిపారు. లేఔట్‌లకు అనుమతులు ఇచ్చే సమయంలో నీటి వనరులు, చెరువులు, వాగుల ఎఫ్‌టీఎల్ పరిధిలోకి రాకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.

ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లలో అనుమతులు వద్దు
లేఔట్ ప్రాంతాలు ఎట్టి పరిస్థితుల్లోనూ వాటర్ బాడీల ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ పరిధిలో ఉండకూడదని కలెక్టర్ స్పష్టంగా పేర్కొన్నారు. ఈ ప్రాంతాల్లో నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడం పూర్తిగా నిషేధమని తెలిపారు. నీటి ప్రవాహ మార్గాలు, సహజ జల వనరులకు ఆటంకం కలిగేలా ఎలాంటి అనుమతులు జారీ చేయరాదన్నారు. లేఔట్‌లో అప్రోచ్ రోడ్డు తప్పనిసరిగా 18 మీటర్ల వెడల్పుతో ఉండాలని స్పష్టం చేశారు. రోడ్డు నిర్మాణానికి అవసరమైన మేర భూమి కేటాయింపులు లేఔట్ ప్లాన్‌లో స్పష్టంగా చూపించాలన్నారు. ఈ అంశాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే అనుమతులు మంజూరు చేయాలని ఆదేశించారు.

సర్వే నివేదికలు తప్పనిసరి
ఏడీ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్, మండల సర్వేయర్లు, ఆర్డీవోలు సంయుక్తంగా లేఔట్ దరఖాస్తులను పరిశీలించి పూర్తి స్థాయి నివేదిక అందించాలని కలెక్టర్ సూచించారు. చుట్టుపక్కల సర్వే నంబర్లు, భూమి స్వరూపం, గతంలో అక్కడ నీటి వనరులు ఉన్నాయా లేదా అనే అంశాలను సాంకేతిక పద్ధతుల్లో పరిశీలించాలని ఆదేశించారు. లేఔట్ ప్రాంతాల్లో గతంలో చెరువులు, వాగులు లేదా నీటి నిల్వ ప్రాంతాలు ఉన్నాయా అనే విషయాన్ని ఆధునిక టెక్నాలజీ ఉపయోగించి నిర్ధారించాలని చెప్పారు. ఎలాంటి అనుమానాలు ఉన్నా పూర్తి స్థాయిలో ధృవీకరణ చేసిన తర్వాతే అనుమతులు మంజూరు చేయాలని స్పష్టం చేశారు. లేఔట్ అనుమతుల జారీ ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా ఉండాలని, నిబంధనలకు లోబడి మాత్రమే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. అనుమతి ఇచ్చిన తర్వాత కూడా అభివృద్ధి సమయంలో నిబంధనలు పాటిస్తున్నారా లేదా అన్నదానిపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని ఆదేశించారు. ప్రజా ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని పట్టణాభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలన్నారు. అక్రమ లేఔట్‌లు, నిబంధనలకు విరుద్ధమైన నిర్మాణాలను ఎట్టి పరిస్థితుల్లో ప్రోత్సహించరాదని స్పష్టం చేశారు. అధికారులు సమన్వయంతో పని చేస్తూ నాణ్యమైన పట్టణాభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఎస్‌డీసీ ఎం. రాజేశ్వరి, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ యాకోబు, పీఆర్ ఎస్‌ఈ వెంకట్ రెడ్డి, ఎన్పీడీసీఎల్ ఎస్‌ఈ శ్రీనివాసాచారి, జిల్లా టౌన్ ప్లానింగ్ అధికారి, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ రాజేందర్, ఏదులాపురం టౌన్ ప్లానింగ్ అధికారి, ఇరిగేషన్ ఈఈ శ్రీనివాస రెడ్డి, డీఈ రాజేష్, తహసీల్దార్లు రాంప్రసాద్, సైదులు, శ్వేత, అరుణ తదితర అధికారులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు

ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు సింగరేణిలో ఎమ్మార్పీఎస్ గద్దె వద్ద నివాళులు త్యాగాలు...

బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..!

బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..! మణుగూరు–బయ్యారం రహదారి ధ్వంసం దుమ్ము ధూళితో గిరిజన బిడ్డల అనారోగ్యం ప్రజల...

అదుపుతప్పిన ఇసుక ట్రాక్టర్ – డ్రైవర్ దుర్మరణం

అదుపుతప్పిన ఇసుక ట్రాక్టర్ – డ్రైవర్ దుర్మరణం నాగులవంచ వద్ద తెల్లవారుజామున ప్రమాదం ఓవర్‌టేక్...

వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే

వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే 21 మంది తహశీల్దార్లతో యుద్ధప్రాతిపదికన సర్వే ఖమ్మం జిల్లాకు...

వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ

వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో భోజనాల పంపిణీ కాకతీయ,...

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ కాకతీయ, ఖమ్మం : ఎస్సీ...

భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు

భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు పేదల పేరుతో రాద్ధాంతం చేశారు ఏజెంట్ల మోసాలపై బాధితులకు...

మోదీ పాలనలో దేశానికి ప్రమాదం

మోదీ పాలనలో దేశానికి ప్రమాదం కార్పొరేట్ల కోసమే కేంద్రం విధానాలు సీపీఐ (ఎం) పొలిట్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img