epaper
Sunday, March 1, 2026
epaper

కాంగ్రెస్–బీజేపీ పాలనలో అభివృద్ధి శూన్యం

కాంగ్రెస్–బీజేపీ పాలనలో అభివృద్ధి శూన్యం
తెలంగాణను నిలబెట్టింది కేసీఆర్ ప్రభుత్వమే
హుజూరాబాద్‌లో ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ధ్వజం

కాకతీయ, హుజూరాబాద్ : గ్రామాలు, పట్టణాలకు నిజమైన అభివృద్ధి తీసుకొచ్చింది కేసీఆర్ ప్రభుత్వం మాత్రమేనని, కాంగ్రెస్–బీజేపీ పాలనల్లో ప్రజలకు ఉపయోగపడే ఒక్క పని కూడా జరగలేదని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఘాటుగా విమర్శించారు. గురువారం మున్సిపల్ పరిధిలోని బోర్నపల్లి 12, 14, 24 వార్డుల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయనకు స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయలేకపోయిన కాంగ్రెస్ ప్రభుత్వం, వాటి గురించి ప్రశ్నిస్తే తనపై కేసులు పెట్టి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందని కౌశిక్‌రెడ్డి ఆరోపించారు. వీణవంక జాతరకు వెళ్లినప్పుడు పోలీసులు తనను అడ్డుకున్నారని, తనను అడ్డుకోవడం వరకు పరవాలేదని, కానీ భార్యా బిడ్డలను అడ్డుకోవడం మాత్రం అన్యాయమని మండిపడ్డారు. ప్రజల కోసం పోరాడే విషయంలో తాను ఎవరికీ భయపడబోనని స్పష్టం చేశారు.

కేసీఆర్ పాలనలోనే మౌలిక వసతులు

ఇళ్ల ముందు రోడ్లు, డ్రైనేజీలు, వీధి దీపాలు సహా అన్ని మౌలిక సదుపాయాలు కేసీఆర్ హయాంలోనే ఏర్పడ్డాయని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుబంధు, రైతుబీమా, 24 గంటల కరెంట్, పింఛన్లు, కల్యాణ లక్ష్మి, కంటి వెలుగు వంటి కీలక పథకాలను నిలిపివేసిందని తీవ్రంగా విమర్శించారు. మహిళలకు నెలకు రూ.2,500, పింఛన్ల పెంపు, ధాన్యానికి బోనస్, విద్యార్థులకు స్కూటీలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి హామీల్లో ఒక్కదాన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదన్నారు. ఇందుకు నిదర్శనంగా ప్రజల ముందు బాకీ కార్డులను ప్రదర్శించారు. ప్రస్తుతం యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కాంగ్రెస్–బీజేపీ అభ్యర్థులు డబ్బులతో ఓట్లు కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించిన కౌశిక్‌రెడ్డి, ప్రజలు మాత్రం ఆ ప్రలోభాలకు లొంగకూడదని పిలుపునిచ్చారు. డబ్బులు తీసుకున్నా సరే కారు గుర్తుకే ఓటు వేయాలని సూచించారు. కారు గుర్తు అభ్యర్థులను గెలిపిస్తేనే ప్రభుత్వాన్ని ప్రశ్నించే బలం వస్తుందని అన్నారు. ప్రజలకు అవసరం వచ్చిన ప్రతిసారీ తాను అండగా నిలుస్తానని ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి భరోసా ఇచ్చారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వేములవాడ ఏఎస్పీకి ఆకస్మిక బదిలీ..!

వేములవాడ ఏఎస్పీకి ఆకస్మిక బదిలీ..! రెండు నెలల్లోనే రుత్విక్ సాయి ట్రాన్స్‌ఫర్ డీఎస్పీగా శ్రీనివాసులు...

సర్కారు భూముల కబ్జాలపై కఠిన చర్యలు

సర్కారు భూముల కబ్జాలపై కఠిన చర్యలు ఆక్రమణలు తొలగించి పేదలకు పంపిణీ ధర్మారంలో క్రీడా...

ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రజక సంఘాల ఆగ్రహం

ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రజక సంఘాల ఆగ్రహం కరీంనగర్‌లో వీర్లపల్లి శంకర్ దిష్టిబొమ్మ దహనం బాధిత...

లక్ష్మీనరసింహస్వామి కళ్యాణంలో కలెక్టర్ దంపతులు

లక్ష్మీనరసింహస్వామి కళ్యాణంలో కలెక్టర్ దంపతులు పట్టు వస్త్రాలు సమర్పణ కాక‌తీయ‌, జగిత్యాల : ధర్మపురి...

హుజూరాబాద్‌లో బీఆర్‌ఎస్ భూస్థాపితం ఖాయం

హుజూరాబాద్‌లో బీఆర్‌ఎస్ భూస్థాపితం ఖాయం కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి ప్రణవ్ కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు,...

బండి సంజయ్ ధర్మం తప్పుతున్నారు

బండి సంజయ్ ధర్మం తప్పుతున్నారు బీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ రెబల్స్ చేరిక,...

50వ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా

50వ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా కార్పొరేటర్ బోయినపల్లి ప్రవీణ్ రావు కాక‌తీయ‌, కరీంనగర్ :...

సైన్స్‌పై మ‌క్కువ పెంచుకోవాలి

సైన్స్‌పై మ‌క్కువ పెంచుకోవాలి ప్రశ్నించేత‌త్వం అల‌వ‌ర్చుకోవాలి రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కాకతీయ, రుద్రంగి:...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img