epaper
Sunday, March 1, 2026
epaper

గౌడ్‌ల‌ను మోసం చేస్తున్న కాంగ్రెస్‌

గౌడ్‌ల‌ను మోసం చేస్తున్న కాంగ్రెస్‌
కామారెడ్డి స‌భ‌లో ఇచ్చిన హామీల అమ‌లేది..?
మ‌ద్యం టెండ‌ర్ల‌లో 25శాతం వాటా ఇస్తామ‌ని మాట‌త‌ప్పింది
కేటాయింపు చేసేలా వెంట‌నే చ‌ర్య‌లు చేప‌ట్టాలి
లేదంటే మ‌ద్యం టెండ‌ర్ల ప్ర‌క్రియ‌ను అడ్డుకుంటాం
తెలంగాణ జాగృతి రాష్ట్ర అధికార ప్రతినిధి నలమాస శ్రీకాంత్ గౌడ్

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : ఎన్నిక‌ల స‌మ‌యంలో కాంగ్రెస్ పార్టీ గౌడ సామాజిక వ‌ర్గానికి ఇచ్చిన హామీల‌ను తుంగ‌లొ తొక్కేస్తోంద‌ని తెలంగాణ జాగృతి రాష్ట్ర అధికార ప్ర‌తినిధి న‌ల‌మాస శ్రీకాంత్ గౌడ్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌ను అమ‌లు చేయ‌కుండా దాట‌వేత విధానాల‌ను అవ‌లంభిస్తోంద‌న్నారు. బీసీలకు42% రిజర్వేషన్లు క‌ల్పిస్తామ‌ని బిల్లు చేసి చేతులు దులుపుకునే ప్ర‌య‌త్నం చేస్తోంద‌న్నారు. రిజర్వేషన్స్ మా పరిధిలో లేవ‌ని న్యాయ స్థానాల పరిధిలో, కేంద్రం పరిధిలో ఉన్నాయ‌ని చెబుతూ త‌ప్పించుకునే ప్ర‌య‌త్నం చేస్తోంద‌ని అన్నారు. కామారెడ్డి డిక్లరేషన్ లో గౌడ సామాజిక వ‌ర్గానికి ఇచ్చిన హామీ మేర‌కు మ‌ద్యం టెండ‌ర్ల‌లో 25% వాటా ఇవ్వాల్సిందేన‌ని అన్నారు. అయితే రాష్ట్ర ప్ర‌భుత్వం ఈ హామీపై క‌నీసం ఊసే ఎత్త‌కుండా మ‌ద్యం టెండ‌ర్ల‌ను ఆహ్వానించింద‌ని అన్నారు. శుక్ర‌వారం హైద‌రాబాద్‌లో విలేక‌రుల‌తో మాట్లాడుతూ గౌడ్‌ల‌ను ఓటు బ్యాంకుగా కాంగ్రెస్ పార్టీ వాడుకుంటోంద‌ని ఆరోపించారు.

ఎక్స్‌గ్రేషియా ఇవ్వ‌డం లేదు

గీత కార్మికులు ప్రమాదవ‌శాత్తు మరణిస్తే రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా ఎక్క‌డా ఇవ్వ‌డం లేద‌ని శ్రీకాంత్ గౌడ్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాకా ప్ర‌మాద‌వ‌శాత్తు మ‌ర‌ణించిన కార్మికుల్లో ఎంత‌మందికి ఎక్స్‌గ్రేషియో చెల్లించారో ద‌మ్ముంటే ప్ర‌భుత్వం అధికారికంగా వెల్ల‌డించాల‌ని అన్నారు. ఊరురా, ప్రతి గ్రామ పంచాయితీ కి 5 ఎకరాల స్థలం గీత కార్మికుల‌కు కేటాయించి ఈత, తాటి వనాలను పెడతామ‌ని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చి రెండేళ్లు కావొస్తున్న హామీపై దృష్టి పెట్టడం లేద‌న్నారు. గౌడ్‌ల‌కు ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీల‌న్నింటిని రేవంత్ రెడ్డి స‌ర్కారు అమ‌లు చేయాల‌ని, లేని ప‌క్షంలో త‌ప్ప‌కుండా త‌గు స‌మ‌యంలో బుద్ధి చెబుతారని స్ప‌ష్టం చేశారు. మద్యం టెండర్ల గౌడ సామాజిక వ‌ర్గానికి 25శాతం వాటాను వెంట‌నే రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించాల‌ని, లేని పక్షంలో టెండ‌ర్ల ప్ర‌క్రియ‌ను అడ్డుకుంటామ‌ని అన్నారు.

యూరియా కోసం రైతుల అరిగోస‌..!

కేసీఆర్ పదేళ్ల పాలనలో రైతన్నలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా యూరియా సరఫరా చేస్తే… కాంగ్రెస్ పాలనలో యూరియా కోసం రైతన్న అరిగోస పడుతున్నార‌ని శ్రీకాంత్ గౌడ్ అన్నారు. రాష్ట్రంలో రైతాంగాన్ని రేవంత్ రెడ్డి స‌ర్కారు ఆగం చేసింద‌న్నారు. రాష్ట్రంలో వ్య‌వ‌సాయంపై, సాగు, ఎరువుల అవ‌స‌రాల‌పై ప్ర‌ణాళిక లేని వైఖ‌రితో ఉండ‌టంతో ఈ రోజు అన్న‌దాత‌లు రోడ్డెక్కాల్సి వ‌చ్చింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. రాష్ట్ర ప్ర‌భుత్వం గుడెద్దు వైఖ‌రిని నిర‌సిస్తూ త్వ‌ర‌లోనే రైతుల‌తో క‌లిసి పోరాటానికి సిద్ధ‌మ‌వుతామ‌ని అన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..?

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..? ప‌నిచేస్తున్న‌ట్టా..? చేయ‌డం లేద‌న్న‌ట్టా..?! త్రిశంకు స్వ‌ర్గంలో భూ భార‌తి స‌ర్వేయ‌ర్లు వ‌ర్క ఆర్డ‌ర్...

భూ భారతి కాదు…భూ దోపిడీ!

భూ భారతి కాదు…భూ దోపిడీ! కాంగ్రెస్ నేతలు, అధికారుల జేబులు నింపడానికే కొత్త...

నియో పోలీస్‌కు నీటి భరోసా!

నియో పోలీస్‌కు నీటి భరోసా! జలమండలికి 3.95 ఎకరాల భూమి కేటాయింపు గ్రావిటీ విధానంలో...

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల ఆసరా

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల ఆసరా ఒక రోజు పెన్షన్‌తో...

పేదల ఇండ్లు కూల్చడం అమానుషం

పేదల ఇండ్లు కూల్చడం అమానుషం కాంగ్రెస్ పాలనలో క‌క్షపూరిత విధానాలు కొనసాగుతున్నాయి మాజీ మంత్రి...

జీపీలకు రూ.389 కోట్లు.. ఉద్యోగులకు రూ.745 కోట్లు విడుదల

జీపీలకు రూ.389 కోట్లు.. ఉద్యోగులకు రూ.745 కోట్లు విడుదల పెండింగ్ బిల్లుల చెల్లింపుకు...

విద్యా కమిషన్‌లో విద్యావేత్తలే లేరా?

విద్యా కమిషన్‌లో విద్యావేత్తలే లేరా? పీహెచ్‌డీలు లేకుండా విద్యా విధానం ఎలా? అర్హతలేని కమిటీతో...

“విద్యార్థుల నుంచి అధికారుల వరకూ… ఇది మీ త్యాగాల ఫలితం”

“విద్యార్థుల నుంచి అధికారుల వరకూ… ఇది మీ త్యాగాల ఫలితం” ప్రజలు ఆకలిని...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img