epaper
Thursday, January 15, 2026
epaper

వృద్ధురాలిని నట్టేట ముంచారు..!

వృద్ధురాలిని నట్టేట ముంచారు..!
విలువైన భూముల అక్రమ రిజిస్ట్రేషన్లు
మీడియా ముందుకు వచ్చిన శంభునిపల్లి వృద్ధురాలు
కుటుంబ సభ్యులే మోసం చేసినట్టు ఆరోపణలు
న్యాయం చేయాలని అధికారులకు వేడుకోలు

కాకతీయ, జమ్మికుంట : జమ్మికుంట మండలం శంభునిపల్లి గ్రామానికి చెందిన వృద్ధురాలు మాధరెడ్డి ఈశ్వరమ్మ తన కుటుంబ సభ్యులే తనను మోసం చేసి విలువైన భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆరోపించారు. ఈ మేరకు ఆమె మీడియా ముందుకు వచ్చి తనకు న్యాయం చేయాలని సంబంధిత అధికారులను వేడుకున్నారు.
ఈశ్వరమ్మ తెలిపిన వివరాల ప్రకారం.. తనకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారని, అందరికీ వివాహాలు జరిగాయని చెప్పారు. భర్త మాధరెడ్డి తిరుపతి రెడ్డి అనారోగ్యంతో 2020లో మృతి చెందినట్లు తెలిపారు.

తెలియకుండా రిజిస్ట్రేషన్..!

భర్త జీవించి ఉన్న సమయంలోనే 2016లో తనకు తెలియకుండా కుమారుడు, చిన్న కుమార్తె కలిసి భర్తను హనుమకొండకు తీసుకెళ్లి శంభునిపల్లి గ్రామ శివారులోని సర్వే నెం.238/1/1/2/1/1/1లో ఉన్న 2 ఎకరాలు 14 గుంటల భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆరోపించారు. అందులో 1 ఎకరం 7 గుంటలు మనవరాలు స్వాతి పేరుపై, మిగిలిన 1 ఎకరం 7 గుంటలు కుమారుడి పేరుపై రిజిస్ట్రేషన్ చేసినట్లు తెలిపారు.
అలాగే భర్త మరణించిన అనంతరం పింఛన్ ఇప్పిస్తానని నమ్మించి స్పెషల్ జీపీఏ తీసుకొని సర్వే నెంబర్లు 293/ఎ (1 ఎకరం 3 గుంటలు), 293/ఓ (3.5 గుంటలు), 293/బి (1 ఎకరం 35 గుంటలు) కలిపి మొత్తం 5 ఎకరాలు 22 గుంటల భూమిని కోడలు మాధరెడ్డి సుభాషిణి పేరుపై అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారని వృద్ధురాలు వాపోయారు.
ఈ విషయమై ప్రశ్నించగా తనపై దాడి జరిగిందని, అందులో కాలు విరిగి ఆసుపత్రిలో చికిత్స పొందినట్లు తెలిపారు. ప్రస్తుతం ఇద్దరు పెద్ద మనవరాళ్లే తన బాగోగులు చూసుకుంటున్నారని చెప్పారు. కుమారుడు, కోడలు, చిన్న మనవరాలు తనకు మందులు, భోజనం, ఆసుపత్రి ఖర్చులు కూడా పెట్టడం లేదని కన్నీటితో ఆవేదన వ్యక్తం చేశారు.
తన భూములు తిరిగి తనకు ఇప్పించి న్యాయం చేయాలని, తనను మోసం చేసిన కుటుంబ సభ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వృద్ధురాలు సంబంధిత అధికారులను వేడుకున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

జర్నలిస్టుల అరెస్టులు అన్యాయం

జర్నలిస్టుల అరెస్టులు అన్యాయం అక్రమ అరెస్టులను ఖండించిన టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కో కన్వీనర్ కే....

పురాభివృద్ధే నా లక్ష్యం..!

పురాభివృద్ధే నా లక్ష్యం..! ఎన్నికల హామీల అమలే ప్రాధాన్యం క్యాతన్‌పల్లిలో అభివృద్ధి పనులకు శ్రీకారం సీసీ...

వావిలాలలో వైభవంగా గోదాదేవి కల్యాణం

వావిలాలలో వైభవంగా గోదాదేవి కల్యాణం కాకతీయ, జమ్మికుంట : ధనుర్మాస ఉత్సవాల ముగింపు...

వలపు వల… లక్షల లూటీ

వలపు వల… లక్షల లూటీ ఇన్‌స్టాగ్రామ్ ముసుగులో సెక్స్ ట్రాప్ నగ్న వీడియోలతో...

వాస్తవాల‌కు వేదికగా కాకతీయ

వాస్తవాల‌కు వేదికగా కాకతీయ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ కంచె వేణు కాకతీయ, హుజురాబాద్ : ప్రజా...

నో కాంప్రమైజ్.. ఆన్ డ్యూటీ..!

నో కాంప్రమైజ్.. ఆన్ డ్యూటీ..! ఎస్సైపై వేటు నిలిపివేయాల‌ని ఎమ్మెల్యే హుకుం..!! వెన‌క్కి త‌గ్గ‌ని...

సీఏం రేవంత్ రెడ్డి మాటల మాంత్రికుడు

సీఏం రేవంత్ రెడ్డి మాటల మాంత్రికుడు 6 డీఏలు పెండింగ్ అంటే రాష్ట్రం...

ప్రజాస్వరానికి ప్రతిబింబంగా కాకతీయ దినపత్రిక

ప్రజాస్వరానికి ప్రతిబింబంగా కాకతీయ దినపత్రిక క్యాలెండర్ ఆవిష్కరణలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కాకతీయ,...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img