epaper
Thursday, January 15, 2026
epaper

రూ.15 లక్షల గంజాయి ద్రవం పట్టివేత.. ఇద్ద‌రి అరెస్టు..

రూ.15 లక్షల గంజాయి ద్రవం పట్టివేత.. ఇద్ద‌రి అరెస్టు..
ద్విచక్ర వాహనం, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం
టాస్క్‌ఫోర్స్–వన్‌టౌన్ పోలీసుల సంయుక్త ఆపరేషన్

కాకతీయ, కొత్తగూడెం రూరల్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పోలీసులు కఠిన చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలో రూ.15 లక్షల విలువైన నిషేధిత గంజాయి ద్రవాన్ని స్వాధీనం చేసుకుని ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ వెల్లడించారు. మంగళవారం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఆదేశాల మేరకు పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన కేసు వివరాలు తెలిపారు. నమ్మదగిన సమాచారం మేరకు మంగళవారం మధ్యాహ్నం కొత్తగూడెం వన్‌టౌన్ ఎస్సై ఆధ్వర్యంలో టాస్క్‌ఫోర్స్ సీఐ రమకాంత్, ఎస్సై ప్రవీణ్, వన్‌టౌన్ ఎస్సై రాజేష్‌లు పోస్ట్ ఆఫీస్ సెంటర్ సమీపంలో వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సమయంలో టీవీఎస్ జూపిటర్ ద్విచక్ర వాహనంపై అనుమానాస్పదంగా వెళ్తున్న ఇద్దరిని ఆపి తనిఖీ చేయగా వారి వద్ద నుంచి గంజాయితో తయారు చేసిన మూడు లీటర్ల నిషేధిత ద్రవం లభ్యమైంది.

రూ.15 లక్షల విలువైన నిషేధిత ద్రవం

పట్టుబడిన గంజాయి ద్రవం మార్కెట్ విలువ సుమారు రూ.15 లక్షలుగా ఉంటుందని డీఎస్పీ తెలిపారు. ఈ ద్రవాన్ని మత్తు పదార్థంగా వినియోగించేందుకు అక్రమంగా తరలిస్తున్నారని ప్రాథమిక విచారణలో తేలినట్లు చెప్పారు. నిందితుల వద్ద నుంచి టీవీఎస్ జూపిటర్ ద్విచక్ర వాహనం, రెండు సెల్‌ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ఈ కేసులో జగదల్పూర్ గ్రామం, బస్తార్ జిల్లా (ఛత్తీస్‌గఢ్)కు చెందిన తిమితి బేల, మల్కాజ్‌గిరి జిల్లాకు చెందిన ఇంతంగి మీనలును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరినీ రిమాండ్‌కు తరలిస్తున్నట్లు డీఎస్పీ స్పష్టం చేశారు. ఈ విలేకరుల సమావేశంలో త్రీటౌన్ సీఐ శివప్రసాద్, వన్‌టౌన్ ఎస్సై రాజేష్‌తో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

గంజాయి రహిత జిల్లానే లక్ష్యం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను గంజాయి, మత్తు పదార్థాల నుంచి పూర్తిస్థాయిలో విముక్తం చేయడమే పోలీస్ శాఖ లక్ష్యమని డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ తెలిపారు. గంజాయి మత్తుకు బానిసై యువత తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదాన్ని అరికట్టేందుకు టాస్క్‌ఫోర్స్ సహకారంతో కఠిన చర్యలతో పాటు అవగాహన కార్యక్రమాలు కూడా విస్తృతంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. మత్తు పదార్థాలపై ఎలాంటి సడలింపు ఉండదని, అక్రమ రవాణాకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ హెచ్చరించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖండాంతరాల్లో సిపిఐ శతాబ్ది సంబరం..!

ఖండాంతరాల్లో సిపిఐ శతాబ్ది సంబరం..! విదేశాల్లోనూ ఎగసిన వామపక్ష జెండా ఖమ్మం వామపక్ష కుటుంబాల...

రిజర్వేషన్లకు ముందే టికెట్ల యుద్ధం

రిజర్వేషన్లకు ముందే టికెట్ల యుద్ధం * మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పొలిటికల్ హీట్ *...

చైనా మాంజాలపై ఉక్కుపాదం

చైనా మాంజాలపై ఉక్కుపాదం * విక్రయిస్తే కేసులు తప్పవు * వాహనదారులకు ప్రాణహాని * పక్షుల...

ప్రజావాణి కి అధికారుల డుమ్మా

ప్రజావాణి కి అధికారుల డుమ్మా * 11 దాటినా జాడలేని అధికారులు * 29...

భూసారం కాపాడుకోవడం రైతు బాధ్యత

భూసారం కాపాడుకోవడం రైతు బాధ్యత సాగు ఖర్చులు త‌గ్గితేనే ఆదాయం పెరుగుతుంది అవసరానికి మించి...

స్థానిక సమస్యలకు సీపీఐ(ఎం)తోనే పరిష్కారం

స్థానిక సమస్యలకు సీపీఐ(ఎం)తోనే పరిష్కారం సంస్కృతి–సంప్రదాయాలకు ప్రతీక రంగవల్లికలు సీపీఐ(ఎం) ఖమ్మం డివిజన్ కార్యదర్శి...

నేడు కాంగ్రెస్‌ ముత్యాల ముగ్గుల పోటీలు

నేడు కాంగ్రెస్‌ ముత్యాల ముగ్గుల పోటీలు కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో 3 గంటలకు...

టెట్‌ ప్రశాంతం!

టెట్‌ ప్రశాంతం! ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేవు రెండు సెషన్లలో సజావుగా నిర్వహణ జిల్లా కలెక్టర్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img