epaper
Thursday, January 15, 2026
epaper

గిరిజనుల జామాయిల్ పంటపై దాడి

గిరిజనుల జామాయిల్ పంటపై దాడి
ధ్వంసానికి పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోండి
తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా
ఎస్సీ–ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి
సీపీఐ (ఎంఎల్) మాస్‌లైన్ డిమాండ్

కాకతీయ, కొత్తగూడెం రూరల్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం గట్టుమల్ల గ్రామంలో గిరిజనులు పండించిన జామాయిల్ పంటను అక్రమంగా ధ్వంసం చేసిన ఘటనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సీపీఐ (ఎంఎల్) మాస్‌లైన్ ఆధ్వర్యంలో గురువారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. ధర్నాలో పాల్గొన్న నేతలు మాట్లాడుతూ, గట్టుమల్ల గ్రామ పరిధిలోని సర్వే నంబర్లు 112, 113, 114, 115, 116లలోని ప్రభుత్వ సీలింగ్ భూములను 1974లో సమగ్ర సర్వే నిర్వహించి, 1976లో అప్పటి ప్రభుత్వం 18 మంది గిరిజనులకు 54 ఎకరాల భూమిని (ప్రతి ఒక్కరికి 3 ఎకరాలు చొప్పున) పట్టాలుగా కేటాయించిందని తెలిపారు. అప్పటి నుంచి గిరిజనులు ప్రభుత్వ పట్టాలతోనే వ్యవసాయం చేస్తూ, బ్యాంకు రుణాలు, ప్రభుత్వ పథకాలు పొందుతూ జీవనం సాగిస్తున్నారని పేర్కొన్నారు.

పంట ధ్వంసం.. బెదిరింపులు..
ఈ భూముల్లో గిరిజనులు జామాయిల్ పంట వేసుకొని మొదటి క్రాప్ కోత పూర్తిచేసిన తర్వాత, రెండో క్రాప్‌కు సిద్ధమవుతున్న సమయంలో స్థానిక గిరిజనేతర వ్యక్తి చెరుకుమల్ల వెంకట నరసయ్య నేతృత్వంలో వచ్చిన వ్యక్తులు ఈ నెల 6వ తేదీ మధ్యాహ్నం అక్రమంగా సుమారు ఒక ఎకరం జామాయిల్ పంటను నరికివేసి ధ్వంసం చేశారని ఆరోపించారు. దీనిని ప్రశ్నించిన గిరిజనులను చంపుతామని బెదిరించడం అప్రజాస్వామిక చర్యగా వారు తీవ్రంగా ఖండించారు. గిరిజనుల పంటలను ధ్వంసం చేసిన వారిపై ఎస్సీ–ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాకు గిరిజన సంఘాలు, రైతు సంఘాలు, ప్రజా సంఘాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి.

వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ ఉన్నా రక్షణ కరువు
ఏజెన్సీ ప్రాంతంలో వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ అమల్లో ఉన్నప్పటికీ గిరిజన భూములకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. గట్టుమల్ల గ్రామ ఘటన ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. ఇప్పటికైనా రెవెన్యూ, పోలీస్ అధికారులు సమగ్ర భూ సర్వే నిర్వహించి, పట్టాదారులైన గిరిజనులకు పూర్తి రక్షణ కల్పించాలని కోరారు. గిరిజన ప్రాంతంలో గిరిజనేతరులకు పట్టాలు ఎలా వచ్చాయో విచారణ చేయాలని, అధికారుల నిర్లక్ష్యం వల్లే అక్రమ పట్టాలు జారీ అయ్యాయని ఆరోపించారు. ఆ అక్రమ పట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

న్యాయం జరగకపోతే ఆందోళన తీవ్రత
గిరిజనులకు న్యాయం చేయకపోతే నిరవధిక నిరాహార దీక్షతో పాటు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని నేతలు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జాటోత్ కృష్ణ, పూనం నాగేశ్వరరావు, బానోతు ధర్మ, వాంగ్డోత్ సురేష్ తదితర నాయకులు, గిరిజన రైతులు కుంజా లక్ష్మయ్య, పడిగ సీతయ్య, బండా వెంకటేశ్వర్లు, పడిగా రాజారావు, శెట్టిపల్లి భాగ్యమ్మ, వాసం సావిత్రి, బట్టు వీరబాబు, బట్టు బాబు తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖండాంతరాల్లో సిపిఐ శతాబ్ది సంబరం..!

ఖండాంతరాల్లో సిపిఐ శతాబ్ది సంబరం..! విదేశాల్లోనూ ఎగసిన వామపక్ష జెండా ఖమ్మం వామపక్ష కుటుంబాల...

రూ.15 లక్షల గంజాయి ద్రవం పట్టివేత.. ఇద్ద‌రి అరెస్టు..

రూ.15 లక్షల గంజాయి ద్రవం పట్టివేత.. ఇద్ద‌రి అరెస్టు.. ద్విచక్ర వాహనం, రెండు...

రిజర్వేషన్లకు ముందే టికెట్ల యుద్ధం

రిజర్వేషన్లకు ముందే టికెట్ల యుద్ధం * మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పొలిటికల్ హీట్ *...

చైనా మాంజాలపై ఉక్కుపాదం

చైనా మాంజాలపై ఉక్కుపాదం * విక్రయిస్తే కేసులు తప్పవు * వాహనదారులకు ప్రాణహాని * పక్షుల...

ప్రజావాణి కి అధికారుల డుమ్మా

ప్రజావాణి కి అధికారుల డుమ్మా * 11 దాటినా జాడలేని అధికారులు * 29...

భూసారం కాపాడుకోవడం రైతు బాధ్యత

భూసారం కాపాడుకోవడం రైతు బాధ్యత సాగు ఖర్చులు త‌గ్గితేనే ఆదాయం పెరుగుతుంది అవసరానికి మించి...

స్థానిక సమస్యలకు సీపీఐ(ఎం)తోనే పరిష్కారం

స్థానిక సమస్యలకు సీపీఐ(ఎం)తోనే పరిష్కారం సంస్కృతి–సంప్రదాయాలకు ప్రతీక రంగవల్లికలు సీపీఐ(ఎం) ఖమ్మం డివిజన్ కార్యదర్శి...

నేడు కాంగ్రెస్‌ ముత్యాల ముగ్గుల పోటీలు

నేడు కాంగ్రెస్‌ ముత్యాల ముగ్గుల పోటీలు కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో 3 గంటలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img