epaper
Thursday, January 15, 2026
epaper

కదం తొక్కుతూ కదలి రండి!

కదం తొక్కుతూ కదలి రండి!
సీపీఐ శతాబ్ది ఉత్సవాలకు త‌ర‌లిరావాలి
జనవరి 18న భారీ బహిరంగ సభ
సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి జమ్ముల జితేందర్‌రెడ్డి

కాకతీయ, ఖమ్మం : భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) శతాబ్ది ఉత్సవాల ముగింపు సభను జనవరి 18న ఖమ్మంలో నిర్వహించనున్న నేపథ్యంలో నగరంలో ప్రచారం హోరెత్తింది. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా వందేళ్లుగా సీపీఐ పనిచేస్తోందని, అధికార యావ లేకుండా ప్రజల పక్షాన నిలిచిన ఏకైక పార్టీ కమ్యూనిస్టు పార్టీనేనని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి జమ్ముల జితేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. శతాబ్ది ఉత్సవాల బహిరంగ సభకు వేలాది మంది కదం తొక్కుతూ తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. బుధవారం ఖమ్మం నగరంలో నిర్వహించిన జీపుజాతాలో భాగంగా ఎన్టీఆర్ సర్కిల్, గ్రెయిన్ మార్కెట్, పాత బస్టాండ్, ముస్తఫానగర్, రోటరీ నగర్, రామన్నపేట, కొత్తగూడెం తదితర ప్రాంతాల్లో విస్తృత ప్రచారం చేపట్టారు. ఆయా ప్రాంతాల్లో జరిగిన సభల్లో సీపీఐ నేతలు ప్రసంగిస్తూ శతాబ్ది ఉత్సవాల ప్రాధాన్యతను వివరించారు. ఈ సందర్భంగా జమ్ముల జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం జరిగిన ఆ మహోద్యమం తెలంగాణ ప్రజల జీవితాల్లో చైతన్యాన్ని నింపిందని చెప్పారు. భూ సంస్కరణల చట్టం, దున్నేవాడికే భూమి నినాదం, బ్యాంకుల జాతీయకరణ, జాతీయ ఉపాధి హామీ పథకం, సమాచార హక్కు చట్టం వంటి అనేక విజయాలు కమ్యూనిస్టు ఉద్యమం సాధించిందని జితేందర్‌రెడ్డి గుర్తుచేశారు. 2024 డిసెంబర్ 26 నుంచి దేశవ్యాప్తంగా శతాబ్ది ఉత్సవాలు జరుగుతున్నాయని, వాటి ముగింపు సభ ఖమ్మంలో జరగడం గర్వకారణమన్నారు. ఖమ్మం నగరం ఉద్యమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిందని, దశాబ్దాలుగా వామపక్ష పార్టీలను ప్రజలు ఆదరిస్తున్నారని సీపీఐ నేతలు పేర్కొన్నారు. ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ జనవరి 18న జరిగే శతాబ్ది ఉత్సవాల బహిరంగ సభను జయప్రదం చేయాలని నగర ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ కార్యవర్గ సభ్యులు శింగు నర్సింహారావు, రాష్ట్ర సమితి సభ్యులు ఎస్.కె.జానిమియా, మహ్మద్ సలాం, కొండపర్తి గోవిందరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు పోటు కళావతి, సిహెచ్.సీతామహలక్ష్మి, పగడాల మల్లేష్, ఏనుగు గాంధీ, యానాలి సాంబశివరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆరెంపుల సతీష్, పల్లెసుద్దుల శ్రీను, మనోజ్, చందర్రావు, శ్రీకాంత్, శాంతి, మృతేష్ తదితర కళాకారులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖండాంతరాల్లో సిపిఐ శతాబ్ది సంబరం..!

ఖండాంతరాల్లో సిపిఐ శతాబ్ది సంబరం..! విదేశాల్లోనూ ఎగసిన వామపక్ష జెండా ఖమ్మం వామపక్ష కుటుంబాల...

రూ.15 లక్షల గంజాయి ద్రవం పట్టివేత.. ఇద్ద‌రి అరెస్టు..

రూ.15 లక్షల గంజాయి ద్రవం పట్టివేత.. ఇద్ద‌రి అరెస్టు.. ద్విచక్ర వాహనం, రెండు...

రిజర్వేషన్లకు ముందే టికెట్ల యుద్ధం

రిజర్వేషన్లకు ముందే టికెట్ల యుద్ధం * మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పొలిటికల్ హీట్ *...

చైనా మాంజాలపై ఉక్కుపాదం

చైనా మాంజాలపై ఉక్కుపాదం * విక్రయిస్తే కేసులు తప్పవు * వాహనదారులకు ప్రాణహాని * పక్షుల...

ప్రజావాణి కి అధికారుల డుమ్మా

ప్రజావాణి కి అధికారుల డుమ్మా * 11 దాటినా జాడలేని అధికారులు * 29...

భూసారం కాపాడుకోవడం రైతు బాధ్యత

భూసారం కాపాడుకోవడం రైతు బాధ్యత సాగు ఖర్చులు త‌గ్గితేనే ఆదాయం పెరుగుతుంది అవసరానికి మించి...

స్థానిక సమస్యలకు సీపీఐ(ఎం)తోనే పరిష్కారం

స్థానిక సమస్యలకు సీపీఐ(ఎం)తోనే పరిష్కారం సంస్కృతి–సంప్రదాయాలకు ప్రతీక రంగవల్లికలు సీపీఐ(ఎం) ఖమ్మం డివిజన్ కార్యదర్శి...

నేడు కాంగ్రెస్‌ ముత్యాల ముగ్గుల పోటీలు

నేడు కాంగ్రెస్‌ ముత్యాల ముగ్గుల పోటీలు కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో 3 గంటలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img