epaper
Thursday, January 15, 2026
epaper

ఇక ఖ‌మ్మంలో రాజ‌కీయ పోరాట‌మే

ఇక ఖ‌మ్మంలో రాజ‌కీయ పోరాట‌మే
ప‌రిపాల‌న‌లో కాంగ్రెస్ పూర్తిగా వైఫ‌ల్యం
నీళ్ల కుట్రలపై ప్రజాక్షేత్రంలో ఎండగడుతాం
సీతారామ ప్రాజెక్టుపై కాంగ్రెస్ అజాగ్రత్త
యూరియా బ‌స్తాలంద‌క రైతుల‌ కష్టాలు కొన‌సాగుతున్నాయి
అధినేత‌ కేసీఆర్ హెచ్చరికలు నిజమ‌వుతున్నాయి
మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : ఈ నూతన సంవత్సరం తెలంగాణ రాజకీయాల్లో పోరాటాల నామసంవత్సరంగా నిలవనుందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు. ఒక్క రోజు కేసీఆర్ ప్రెస్ నోట్ విడుదల చేయగానే కాంగ్రెస్ నాయకుల్లో భయం మొదలవడం వారి వైఫల్య పాలనకు నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్ పాలనలో తెలంగాణలో ప్రతి ఇంచుకు నీళ్లు అందించిన చరిత్ర ఉందని, అదే స్థాయిలో పాలన చేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికి చేతకావడం లేదని విమర్శించారు. రానున్న అన్ని ఎన్నికల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల మాదిరిగానే బీఆర్ఎస్ ఘన విజయాలు సాధిస్తుందన్న ధీమా వ్యక్తం చేశారు.

ప్రాజెక్టుల్లో కాంగ్రెస్ కుట్ర‌ల‌పై బీఆర్ఎస్ పోరాటం

పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు పేరుతో తెలంగాణ ప్రయోజనాలను నిర్వీర్యం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని అజయ్ కుమార్ ఆరోపించారు. కేసీఆర్ పూర్తి చేసిన పనులపై పంపులను ఆన్ చేసి సీతారామ ప్రాజెక్టు నీళ్లను రాజకీయ ప్రచారానికి వాడుకుంటూ, తదుపరి పనులను మాత్రం ముందుకు సాగనీయకపోవడం కాంగ్రెస్ నిర్లక్ష్యానికి పరాకాష్ట అన్నారు. సీతారామ ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అజాగ్రత్త త్వరలోనే నీళ్ల ఉద్యమంగా మారడం ఖాయమని హెచ్చరించారు.
ఖమ్మం నియోజవర్గంలో ఎన్నికల సమయంలో “సీతారామ నీళ్లతో కడుగుతా” అని హామీ ఇచ్చి గెలిచిన కాంగ్రెస్ నాయకుడు ఇప్పటికైనా ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రైతులు యూరియా కోసం పడుతున్న ఇబ్బందులు చూస్తుంటే, కాంగ్రెస్ పాలనపై కేసీఆర్ ముందే చేసిన హెచ్చరికలు అక్షరాలా నిజమవుతున్నాయని అన్నారు. కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ పాలనే తెలంగాణకు శ్రీరామరక్ష అని ప్రతి తెలంగాణ బిడ్డకు ఇప్పుడు అర్థమవుతోందన్నారు.

కేటీఆర్‌ పర్యటన విజయవంతం చేయాలి

బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ మద్దతుతో గెలిచిన సర్పంచులు, వార్డు మెంబర్లను సత్కరిస్తూ జిల్లా పర్యటనలు చేస్తున్నారని అజయ్ కుమార్ తెలిపారు. ఆ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 7వ తేదీ ఉదయం 10 గంటలకు కేటీఆర్ ఖమ్మం జిల్లాకు రానున్నారని, జిల్లా పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్‌లో ఉమ్మడి జిల్లా సర్పంచులు, వార్డు మెంబర్లను ఘనంగా సత్కరిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖండాంతరాల్లో సిపిఐ శతాబ్ది సంబరం..!

ఖండాంతరాల్లో సిపిఐ శతాబ్ది సంబరం..! విదేశాల్లోనూ ఎగసిన వామపక్ష జెండా ఖమ్మం వామపక్ష కుటుంబాల...

రూ.15 లక్షల గంజాయి ద్రవం పట్టివేత.. ఇద్ద‌రి అరెస్టు..

రూ.15 లక్షల గంజాయి ద్రవం పట్టివేత.. ఇద్ద‌రి అరెస్టు.. ద్విచక్ర వాహనం, రెండు...

రిజర్వేషన్లకు ముందే టికెట్ల యుద్ధం

రిజర్వేషన్లకు ముందే టికెట్ల యుద్ధం * మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పొలిటికల్ హీట్ *...

చైనా మాంజాలపై ఉక్కుపాదం

చైనా మాంజాలపై ఉక్కుపాదం * విక్రయిస్తే కేసులు తప్పవు * వాహనదారులకు ప్రాణహాని * పక్షుల...

ప్రజావాణి కి అధికారుల డుమ్మా

ప్రజావాణి కి అధికారుల డుమ్మా * 11 దాటినా జాడలేని అధికారులు * 29...

భూసారం కాపాడుకోవడం రైతు బాధ్యత

భూసారం కాపాడుకోవడం రైతు బాధ్యత సాగు ఖర్చులు త‌గ్గితేనే ఆదాయం పెరుగుతుంది అవసరానికి మించి...

స్థానిక సమస్యలకు సీపీఐ(ఎం)తోనే పరిష్కారం

స్థానిక సమస్యలకు సీపీఐ(ఎం)తోనే పరిష్కారం సంస్కృతి–సంప్రదాయాలకు ప్రతీక రంగవల్లికలు సీపీఐ(ఎం) ఖమ్మం డివిజన్ కార్యదర్శి...

నేడు కాంగ్రెస్‌ ముత్యాల ముగ్గుల పోటీలు

నేడు కాంగ్రెస్‌ ముత్యాల ముగ్గుల పోటీలు కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో 3 గంటలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img