epaper
Monday, March 2, 2026
epaper

ఆకలికి‘అటల్’ చెక్‌

ఆకలికి‘అటల్’ చెక్‌
ఢిల్లీలో రూ.5కే భోజనం
వాజ్‌పేయి 101వ జయంతి సందర్భంగా ప్రారంభం
తొలి విడతలో 45 చోట్ల ప్రారంభమైన అటల్ కాంటీన్లు
రోజుకు రెండు పూటల భోజనం.. ఒక్కో కేంద్రంలో 500 మందికి సేవలు
డిజిటల్ టోకెన్, సీసీటీవీ నిఘాతో పారదర్శక పంపిణీ

కాక‌తీయ‌, నేష‌న‌ల్ డెస్క్ : ఆకలితో అలమటిస్తున్న పేదలు, కూలీలు, తక్కువ ఆదాయ వర్గాలకు భరోసా కల్పించేలా ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి 101వ జయంతి సందర్భంగా ‘అటల్ కాంటీన్’ పథకాన్ని ముఖ్యమంత్రి రేఖా గుప్తా ప్రారంభించారు. ఈ పథకం కింద పోషకాహారంతో కూడిన పూర్తి భోజనం కేవలం రూ.5కే అందించనున్నారు. ఈ సందర్భంగా సీఎం రేఖా గుప్తా మాట్లాడుతూ.. “అటల్ కాంటీన్ ఢిల్లీ ఆత్మగా మారుతుంది. ఎవ్వరూ ఆకలితో నిద్రపోకూడదు” అని పేర్కొన్నారు. పేదలకు గౌరవప్రదంగా భోజనం అందించడమే ఈ పథకం లక్ష్యమని వివరించారు.

తొలి దశలో 45 కేంద్రాలు

ప్రస్తుతం ఢిల్లీలో ఆర్కే పురం, జంగ్‌పురా, షాలిమార్ బాగ్, గ్రేటర్ కైలాస్, రాజౌరీ గార్డెన్, నరేలా, బవానా తదితర ప్రాంతాల్లో 45 అటల్ కాంటీన్లు ప్రారంభమయ్యాయి. మిగతా 55 కాంటీన్లను త్వరలో ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ కాంటీన్లలో రోజుకు రెండు పూటల భోజనం అందించనున్నారు. మధ్యాహ్న భోజనం: ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు
రాత్రి భోజనం: సాయంత్రం 6.30 నుంచి రాత్రి 9.30 గంటల వరకు ఒక్కో కేంద్రంలో సుమారు 500 మందికి భోజనం అందించనున్నారు. భోజనంలో బియ్యం, పప్పు, కూరగాయ, చపాతీ, పచ్చడి ఉంటాయి.

డిజిటల్ టోకెన్, సీసీటీవీ నిఘా
భోజన పంపిణీలో పారదర్శకత కోసం ప్రభుత్వం డిజిటల్ టోకెన్ విధానాన్ని అమలు చేస్తోంది. మాన్యువల్ కూపన్లకు బదులుగా ఈ విధానం ఉపయోగించనున్నారు. అలాగే అన్ని కాంటీన్లను డీయూఎస్‌ఐబీ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ద్వారా సీసీటీవీ కెమెరాలతో ప్రత్యక్ష పర్యవేక్షణ చేస్తారు. మొత్తంగా, పెరుగుతున్న జీవన వ్యయాల మధ్య పేదలకు కడుపు నింపే ఈ పథకం ఢిల్లీలో సామాజిక భద్రతకు కొత్త దిశ చూపిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రూ.1000 దాటితే యూపీఐపై ఛార్జీలు?.. ఎన్‌పీసీఐ క్లారిటీ

రూ.1000 దాటితే యూపీఐపై ఛార్జీలు?.. ఎన్‌పీసీఐ క్లారిటీ సాధారణ యూపీఐ లావాదేవీలపై ఎలాంటి...

బెంగళూరు ‘లేడీ డాన్’ యశస్వినీ గౌడ అరెస్ట్

బెంగళూరు ‘లేడీ డాన్’ యశస్వినీ గౌడ అరెస్ట్ రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్...

ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం

ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం వారంలోగా అమ‌ల్లోకి.. మూడునాలుగు రోజుల్లోనే సంతకాలు భారత్‌-అమెరికా సంయుక్త...

మీకు ఏది సరైనదనిపిస్తే అదే చేయండి

మీకు ఏది సరైనదనిపిస్తే అదే చేయండి కీలక ప్రశ్నలకు మోదీ సమాధానం ఇవ్వలేదు ప్ర‌ధాని...

మద్రాస్ హైకోర్టులో విజయ్‌కు షాక్‌

మద్రాస్ హైకోర్టులో విజయ్‌కు షాక్‌ రూ.1.50 కోట్ల పెనాల్టీ చెల్లించాల్సిందేన‌న్న న్యాయ‌స్థానం భారీ జరిమానాను...

పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి

పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి 31 మంది మృతి.. 170 మందికి గాయాలు క్ష‌త‌గాత్రుల్లో ప‌లువురి...

విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మృతి

విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మృతి ల్యాండ్ అవుతుండ‌గా రన్‌వేపై కుప్ప‌కూలిన చార్టర్డ్...

కర్తవ్యపథ్‌పై గర్వభారతం!

కర్తవ్యపథ్‌పై గర్వభారతం! డెబ్బై ఏడవ గణతంత్ర వేడుకలు ఘనంగా ప్రారంభం రాజ్యాంగ ఆత్మకు ప్రతీకగా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img