epaper
Thursday, January 15, 2026
epaper

డబుల్‌ ఇండ్ల స్థలాలు కుదరవు

డబుల్‌ ఇండ్ల స్థలాలు కుదరవు
డెస్క్‌ జర్నలిస్టులకూ అక్రిడిటేషన్లే ఇవ్వాలి
విచారణ అనంతరమే ఇండ్ల స్థలాలపై నిర్ణయం తీసుకోవాలి
టీడబ్ల్యూజేఎఫ్ ఖ‌మ్మం జిల్లా కమిటీ తీర్మానం
ఖమ్మం ప్రెస్‌క్లబ్ కమిటీ ఎన్నిక
అధ్యక్షుడిగా దగ్గుపాటి మాధవరావు
కార్యదర్శిగా కాకతీయ స్టాఫర్ నూకల రామచంద్ర మూర్తి

కాకతీయ, ఖమ్మం : జర్నలిస్టులకు డబుల్‌గా ఇండ్ల స్థలాలు కేటాయించే ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా కమిటీ స్పష్టంగా తీర్మానించింది. ఇప్పటికే ప్రభుత్వం ద్వారా ఒకసారి ఇండ్ల స్థలాలు పొందిన వారు రెండోసారి, మూడోసారి స్థలాలు కావాలంటూ ముందుకు వస్తే ఊరుకోబోమని, పూర్తి స్థాయి విచారణ చేసిన తర్వాతే అధికారులు తుది నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఇప్పటివరకు ప్రభుత్వ లబ్ధి పొందని జర్నలిస్టుల పక్షానే తాము నిలుస్తామని టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షుడు సయ్యద్ ఖదీర్, కార్యదర్శి కొత్తపల్లి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఖమ్మం గాంధీచౌక్‌లోని ఓ హోటల్‌లో బుధవారం నిర్వహించిన టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా కమిటీ సమావేశంలో ఈ మేరకు కీలక తీర్మానాలు చేశారు. టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా 4వ మహాసభలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇచ్చిన హామీ మేరకు 48 గంటల్లోనే అక్రిడిటేషన్లపై జీఓ జారీ కావడంపై హర్షం వ్యక్తం చేశారు. ఇదే తరహాలో జర్నలిస్టుల ఇండ్ల స్థలాల అంశంపై కూడా కొత్త సంవత్సరంలో ప్రభుత్వం తీపి కబురు అందిస్తుందన్న ఆశాభావాన్ని వారు వ్యక్తం చేశారు.

అర్హుల‌కు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే

ఖమ్మం జిల్లాలో ఇప్పటికే కొందరు జర్నలిస్టులు సొసైటీ, బీపీఎల్ కోటా, జీవో నంబర్ 58, 59 ద్వారా ఇండ్ల స్థలాలు పొందారని, అదే వ్యక్తులు మళ్లీ ముందు వరుసలో నిలవడం అన్యాయమని పేర్కొన్నారు. దశాబ్దాలుగా జర్నలిస్టులుగా పనిచేస్తూ ఇప్పటికీ ప్రభుత్వ లబ్ధికి నోచుకోని అనేక మంది ఉన్నారని, అర్హులైన వారిని గుర్తించి వారికి న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని తెలిపారు. అధికారులు క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయి విచారణ చేసి అర్హులను నిర్ణయించాలని డిమాండ్ చేశారు. అక్రిడిటేషన్ల విషయంలోనూ స్పష్టమైన డిమాండ్లు చేశారు. అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్లు ఇవ్వాలని, రిపోర్టర్లతో సమానంగా డెస్క్ జర్నలిస్టులకూ అక్రిడిటేషన్ కల్పించాలని తీర్మానించారు. డెస్క్ జర్నలిస్టులను వేరుచేసి అక్రిడిటేషన్ బదులు మీడియా కార్డులు మాత్రమే ఇవ్వాలన్న ప్రెస్ అకాడమీ ప్రయత్నాలను వెంటనే విరమించుకోవాలని కోరారు. జర్నలిస్టుల హక్కుల పరిరక్షణకు టీడబ్ల్యూజేఎఫ్ ఎల్లప్పుడూ ముందుంటుందని స్పష్టం చేశారు.

ఖమ్మం ప్రెస్‌క్లబ్ కమిటీ ఎన్నిక

సమావేశంలో భాగంగా ఖమ్మం ప్రెస్‌క్లబ్ కమిటీ ఎన్నికలను ఏకగ్రీవంగా నిర్వహించారు. అధ్యక్షుడిగా దగ్గుపాటి మాధవరావు, కార్యదర్శిగా కాకతీయ పత్రిక ఖమ్మం స్టాఫర్ నూకల రామచంద్ర మూర్తి,
కోశాధికారిగా ధనాలకోట రవికుమార్‌ల‌ను నియ‌మించారు. ఈసంద‌ర్భంగా సీనియర్ జర్నలిస్టులు ప్రసేన్, పారుపల్లి కృష్ణారావు, ఫ్రీలాన్స్ జర్నలిస్టు నాదెళ్ల శ్రీనివాస్‌లను జిల్లా, ఖమ్మం నియోజకవర్గ కమిటీలు ఘనంగా సన్మానించాయి. కార్యక్రమంలో టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా కోశాధికారి తేనె వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షుడు దువ్వా సాగర్, సహాయ కార్యదర్శి జక్కంపూడి కృష్ణ, టీబీజేఏ జిల్లా అధ్యక్షుడు ఆవుల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి మానుకొండ రవికిరణ్, స్టేట్ కౌన్సిల్ సభ్యులు నలుబోల మధుశ్రీ, బాలకృష్ణతో పాటు వివిధ నియోజకవర్గాల అధ్యక్షులు, కార్యదర్శులు, ఫొటో & వీడియో గ్రాఫర్స్ సంఘ నాయకులు, జిల్లా కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖండాంతరాల్లో సిపిఐ శతాబ్ది సంబరం..!

ఖండాంతరాల్లో సిపిఐ శతాబ్ది సంబరం..! విదేశాల్లోనూ ఎగసిన వామపక్ష జెండా ఖమ్మం వామపక్ష కుటుంబాల...

రూ.15 లక్షల గంజాయి ద్రవం పట్టివేత.. ఇద్ద‌రి అరెస్టు..

రూ.15 లక్షల గంజాయి ద్రవం పట్టివేత.. ఇద్ద‌రి అరెస్టు.. ద్విచక్ర వాహనం, రెండు...

రిజర్వేషన్లకు ముందే టికెట్ల యుద్ధం

రిజర్వేషన్లకు ముందే టికెట్ల యుద్ధం * మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పొలిటికల్ హీట్ *...

చైనా మాంజాలపై ఉక్కుపాదం

చైనా మాంజాలపై ఉక్కుపాదం * విక్రయిస్తే కేసులు తప్పవు * వాహనదారులకు ప్రాణహాని * పక్షుల...

ప్రజావాణి కి అధికారుల డుమ్మా

ప్రజావాణి కి అధికారుల డుమ్మా * 11 దాటినా జాడలేని అధికారులు * 29...

భూసారం కాపాడుకోవడం రైతు బాధ్యత

భూసారం కాపాడుకోవడం రైతు బాధ్యత సాగు ఖర్చులు త‌గ్గితేనే ఆదాయం పెరుగుతుంది అవసరానికి మించి...

స్థానిక సమస్యలకు సీపీఐ(ఎం)తోనే పరిష్కారం

స్థానిక సమస్యలకు సీపీఐ(ఎం)తోనే పరిష్కారం సంస్కృతి–సంప్రదాయాలకు ప్రతీక రంగవల్లికలు సీపీఐ(ఎం) ఖమ్మం డివిజన్ కార్యదర్శి...

నేడు కాంగ్రెస్‌ ముత్యాల ముగ్గుల పోటీలు

నేడు కాంగ్రెస్‌ ముత్యాల ముగ్గుల పోటీలు కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో 3 గంటలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img