epaper
Thursday, January 15, 2026
epaper

ఖమ్మం మున్సిపల్ కౌన్సిల్ తీర్మానాలకు విలువేదీ?

ఖమ్మం మున్సిపల్ కౌన్సిల్ తీర్మానాలకు విలువేదీ?
రెండుసార్లు సరెండర్ చేసిన అధికారికి మళ్లీ విధులా?
సీడీఎంఏ ఆదేశాలపై కార్పొరేటర్ల మండిపాటు
అధికార–ప్రతిపక్షాల ఆగ్రహం
కమిషనర్ మౌనం వెనుక మర్మమేంటి?

కాక‌తీయ‌, ఖమ్మం ప్రతినిధి : ఖమ్మం నగరపాలక సంస్థ కౌన్సిల్ నిర్ణయాలకు విలువ ఉందా లేదా అన్న ప్రశ్న మరోసారి తెరపైకి వచ్చింది. రెవెన్యూ విభాగంలో పనిచేస్తున్న ఆర్వో సుధాకర్‌పై గతంలో తీవ్ర ఆరోపణలు రావడంతో కౌన్సిల్ రెండుసార్లు తీర్మానం చేసి అతడిని సీడీఎంఏకు సరెండర్ చేసింది. అయినప్పటికీ, అదే అధికారి మళ్లీ విధుల్లోకి చేరడం నగర రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది.
కౌన్సిల్‌లో మేయర్‌తో పాటు సభ్యులందరి ఆమోదంతో తీసుకున్న తీర్మానాలను పక్కనపెట్టి తిరిగి విధుల్లోకి తీసుకోవాలని సీడీఎంఏ ఆదేశాలు జారీ చేయడంపై అధికార, ప్రతిపక్ష కార్పొరేటర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కౌన్సిల్ తీర్మానాలకే విలువ లేకపోతే ప్రజాస్వామ్య వ్యవస్థ అర్థం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు.

కౌన్సిల్ తీర్మానాలే శాసనాలు కావా?

గతంలో కమిషనర్లు సందీప్ జూ, అనురాగ్ జయంతులు కౌన్సిల్ తీర్మానాలను గౌరవిస్తూ ఆర్వో సుధాకర్‌ను సీడీఎంఏకు సరెండర్ చేసిన విషయం తెలిసిందే. అలాంటప్పుడు, అదే సీడీఎంఏ అతడిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఆదేశించడం వెనుక కారణాలేమిటన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఒకసారి తీర్మానం జరిగాక మళ్లీ అదే అంశం పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కమిషనర్‌దేనని కార్పొరేటర్లు పేర్కొంటున్నారు.

అవినీతి ఆరోపణలపై ఎందుకీ జాప్యం?

ఈ అధికారి నగరపాలక సంస్థలో ఏళ్ల తరబడి పనిచేస్తూ నిత్యం అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయని కార్పొరేటర్లు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా మద్యం దుకాణాల అసెస్‌మెంట్ కేటాయింపుల విషయంలో లక్షల రూపాయలు వసూలు చేశారనే ఆరోపణలు వెల్లువెత్తినా ఇప్పటివరకు స్పష్టమైన చర్యలు లేకపోవడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ మొత్తం వ్యవహారంపై కమిషనర్ మౌనం వహించడం వెనుక అసలు కారణం ఏమిటో స్పష్టత ఇవ్వాలని అధికార, ప్రతిపక్ష సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. కౌన్సిల్ నిర్ణయాలను పట్టించుకోకుండా ఉన్నతాధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తే నగరపాలక సంస్థ పరిపాలనపై ప్రజల్లో నమ్మకం దెబ్బతింటుందని కార్పొరేటర్లు హెచ్చరిస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖండాంతరాల్లో సిపిఐ శతాబ్ది సంబరం..!

ఖండాంతరాల్లో సిపిఐ శతాబ్ది సంబరం..! విదేశాల్లోనూ ఎగసిన వామపక్ష జెండా ఖమ్మం వామపక్ష కుటుంబాల...

రూ.15 లక్షల గంజాయి ద్రవం పట్టివేత.. ఇద్ద‌రి అరెస్టు..

రూ.15 లక్షల గంజాయి ద్రవం పట్టివేత.. ఇద్ద‌రి అరెస్టు.. ద్విచక్ర వాహనం, రెండు...

రిజర్వేషన్లకు ముందే టికెట్ల యుద్ధం

రిజర్వేషన్లకు ముందే టికెట్ల యుద్ధం * మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పొలిటికల్ హీట్ *...

చైనా మాంజాలపై ఉక్కుపాదం

చైనా మాంజాలపై ఉక్కుపాదం * విక్రయిస్తే కేసులు తప్పవు * వాహనదారులకు ప్రాణహాని * పక్షుల...

ప్రజావాణి కి అధికారుల డుమ్మా

ప్రజావాణి కి అధికారుల డుమ్మా * 11 దాటినా జాడలేని అధికారులు * 29...

భూసారం కాపాడుకోవడం రైతు బాధ్యత

భూసారం కాపాడుకోవడం రైతు బాధ్యత సాగు ఖర్చులు త‌గ్గితేనే ఆదాయం పెరుగుతుంది అవసరానికి మించి...

స్థానిక సమస్యలకు సీపీఐ(ఎం)తోనే పరిష్కారం

స్థానిక సమస్యలకు సీపీఐ(ఎం)తోనే పరిష్కారం సంస్కృతి–సంప్రదాయాలకు ప్రతీక రంగవల్లికలు సీపీఐ(ఎం) ఖమ్మం డివిజన్ కార్యదర్శి...

నేడు కాంగ్రెస్‌ ముత్యాల ముగ్గుల పోటీలు

నేడు కాంగ్రెస్‌ ముత్యాల ముగ్గుల పోటీలు కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో 3 గంటలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img