epaper
Monday, December 1, 2025
epaper

కేసీఆర్ దీక్షతోనే తెలంగాణ

కేసీఆర్ దీక్షతోనే తెలంగాణ
రాష్ట్ర సాధనలో సింగరేణి కార్మికుల పాత్ర మరువలేనిది
బీసీల‌కు అండగా బీఆర్ఎస్
దమ్ముంటే పార్లమెంట్ లో బీసీ బిల్లు పెట్టండి
దీక్ష దివస్ లో రాజ్యసభ సభ్యుడు : వద్ది రాజు రవిచంద్ర

కాకతీయ, కొత్తగూడెం : కేసీఆర్ పోరాటంతోనే తెలంగాణ రాష్ట్ర వచ్చిందని ఈ విషయాన్ని కాంగ్రెస్ పెద్దలు గ్రహించాలని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని శనివారం బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ లో నిర్వహించిన దీక్ష దివస్ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు రేగా కాంతారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా ప్రగతి మైదానంలో అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సాధనలో సింగరేణి కార్మికులు కూడా కీలక పాత్ర పోషించారని అన్నారు. నాడు కేసీఆర్ తెచ్చిన తెలంగాణ వల్లే నేడు ఎంతో మంది నాయకులు ప్రజా ప్రతినిధులుగా పదవులు అనుభవిస్తున్నారని అది కాంగ్రెస్ నాయకులు తెలుసుకోవాలని అన్నారు. కేసీఆర్ లేని తెలంగాణ ఎవరు చూడలేరని అన్నారు. మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని అన్నారు. బీసీలను మోసం చేసి రిజర్వేషన్లకి అడ్డుపడ్డారని దమ్ముంటే ఎంపీటీసీ ఎన్నికల కైనా బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టాలని అన్నారు. స్థానిక సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చూపెడతామని అందుకు కార్యకర్తలంతా సిద్ధంగా ఉండాలని అన్నారు. జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు మాట్లాడుతూ కేసీఆర్ చేసిన అంకుటిత దీక్ష వల్లనే మనకు తెలంగాణ వచ్చిందని ఎంతోమంది నాయకులు తెలంగాణ కోసం కష్టపడిన చివరికి సాధించలేకపోయారని కానీ అది కేసీఆర్ వల్లే సాధ్యమైందని అన్నారు. కేసీఆర్ తెలంగాణ తీసుకురావడం వల్లనే ఈరోజు ముఖ్యమంత్రి స్థానంలో రేవంత్ రెడ్డి ఉన్నారని లేకుంటే ఇలాంటి పదవులు వచ్చాయా అని ప్రశ్నించారు. మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యేలు మెచ్చ నాగేశ్వరావు, హరిప్రియ, తెలంగాణ ఉద్యమకారుడు ఉమ్మడి ఖమ్మం జిల్లా మాజీ అధ్యక్షుడు దిండిగల రాజేందర్ లు ఈ సమావేశంలో కేసీఆర్ ఉద్యమం గురించి తెలంగాణ సాధన గురించి మాట్లాడారు. స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చూపెడతామని అన్నారు. అనంతరం కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం ఇంచార్జ్ రావులపల్లి రాంప్రసాద్, పాల్వంచ నాయకులు మంతపురి రాజు గౌడ్, కొట్టి వెంకటేశ్వర్లు, కాంపెల్లి కనకేష్, సింధు తపస్వి, సంకు బాపన అనుదీప్, బత్తుల వీరయ్య, రాజశేఖర్, నవతన్, మాజీ ఎంపీపీలు సోనా, శాంతి, అరుణ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ట్రస్ట్ ఆధ్వర్యంలో పలు గ్రామాలకు రగ్గుల పంపిణీ

ట్రస్ట్ ఆధ్వర్యంలో పలు గ్రామాలకు రగ్గుల పంపిణీ కాకతీయ, కొత్తగూడెం రూరల్ :...

విద్యార్థుల లక్ష్యాలకు వేదికగా “ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ”

విద్యార్థుల లక్ష్యాలకు వేదికగా "ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ" ప్రారంభానికి సమగ్ర ఏర్పాట్లు చేయాలి అధికారులు...

సింగరేణిలో ఖాళీ పోస్టులకు రాత పరీక్ష

సింగరేణిలో ఖాళీ పోస్టులకు రాత పరీక్ష కాకతీయ, కొత్తగూడెం : సింగరేణి కాలరీస్...

మద్దెల ఆధ్వర్యంలో తోట దేవి ప్రసన్నకు సన్మానం

మద్దెల ఆధ్వర్యంలో తోట దేవి ప్రసన్నకు సన్మానం కాకతీయ, కొత్తగూడెం : భద్రాద్రి...

సంఘంపై ఆరోపణలను ఖండిస్తున్నాం

సంఘంపై ఆరోపణలను ఖండిస్తున్నాం రాష్ట్ర నేషనల్ మజ్దూర్ యూనియన్ రీజినల్ సెక్రెటరీ ఎల్....

క్రీడలతో సంపూర్ణ ఆరోగ్యం

క్రీడలతో సంపూర్ణ ఆరోగ్యం క్రీడారంగానికి అధిక ప్రాధాన్యత సింగరేణి చైర్మన్ బలరాం గెలుపొందిన విజేతలకు బహుమతులు విజయవంతంగా...

కోల్ ఇండియా కబడ్డీ విజేత డబ్ల్యూ సీఎల్ జట్టు

కోల్ ఇండియా కబడ్డీ విజేత డబ్ల్యూ సీఎల్ జట్టు ముగిసిన కోల్ ఇండియా...

జూలూరుపాడు పంచాయతీ ఎన్నికలు నిలుపుదల

జూలూరుపాడు పంచాయతీ ఎన్నికలు నిలుపుదల కాకతీయ, జూలూరుపాడు : జూలూరుపాడు గ్రామపంచాయతీ ఎన్నిక...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img