epaper
Thursday, January 15, 2026
epaper

కేంద్ర మంత్రి గడ్కరీకి తుమ్మల లేఖ

కేంద్ర మంత్రి గడ్కరీకి తుమ్మల లేఖ
ఖమ్మం–అశ్వారావుపేట రోడ్డును వన్ టైం ఇంప్రూవ్మెంట్ (రెన్యువల్) చేయండి
కొణిజర్ల, కల్లూరు, పెనుబల్లి, దమ్మపేట జంక్షన్ల‌ను ఆధునీకరించండి
4 లైన్ల రహదారి, డివైడర్, సెంట్రల్ లైటింగ్ మరియు డ్రైన్లు మెరుగుపరచాలి
రీజనల్ ఆఫీసర్ మోర్తా కృష్ణ ప్రసాద్ కు సైతం లేఖ రాసిన మంత్రి
సానుకూలంగా స్పందించిన కేంద్రమంత్రి గడ్కరీ, రీజనల్ ఆఫీసర్

కాక‌తీయ‌, ఖ‌మ్మం ప్ర‌తినిధి : కేంద్ర రహదారి రవాణా మ‌రియు హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి మంగళవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మాత్యులు శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖ రాశారు. అనంతరం కేంద్రమంత్రి తో ఫోన్లో మాట్లాడిన ఆయన ఖమ్మం–అశ్వారావుపేట జాతీయ రహదారిపై అత్యవసరంగా వన్ టైం ఇంప్రూవ్మెంట్ (రెన్యువల్) పనులు తక్షణమే చేపట్టాలని కేంద్ర మంత్రిని కోరారు. ఇప్పటికే ఈ రహదారి నాలుగు లైన్లుగా విస్తరించేందుకు డిపిఆర్ సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆ పనులు ప్రారంభం కావాలంటే సంవత్సరం సమయం పడుతుందని లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ రోడ్డు వర్షాల కారణంగా గుంతలు ఏర్పడి అధ్వానంగా ఉందని ప్రయాణికులు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మంత్రి లేఖలో ప్రస్తావించారు. అంతరాష్ట్ర ప్రాధాన్యం కలిగిన ఖమ్మం–అశ్వారావుపేట రహదారి జాతీయ రహదారి 365BBలో భాగమై, రాబోయే NH–365BG గ్రీన్‌ఫీల్డ్ హైవే మార్గంలోనూ ఉండటంతో ఈ మార్గానికి వ్యూహాత్మక ప్రాధాన్యం పెరిగిందని మంత్రి తుమ్మల చెప్పారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ, వైజాగ్ పోర్టులకు వెళ్లే వాహనాలు మరియు హైదరాబాద్ నుంచి ఆంధ్రకు వెళ్లే వాహనాలు కూడా అధికంగా ఈ రహదారినే వినియోగిస్తున్నట్టు తెలిపారు. అయితే ప్రస్తుత రహదారి తీవ్రంగా దెబ్బతినడం, గుంతల వల్ల ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ రోడ్డుకు పునరుద్ధరణ పనులు చేయడం అత్యవసరమని మంత్రి పేర్కొన్నారు.

ప్రస్తుత పరిస్థితి అత్యవసర దశలో…

రహదారిని ఫోర్ లైన్ గా విస్తరించేందుకు డీపీఆర్ సిద్ధం చేసే పనులు ప్రారంభమైనప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా డీపీఆర్‌ సిద్ధం చేయడానికి మరింత సమయం పడుతుందని మంత్రి తుమ్మల లేఖలో స్పష్టం చేశారు. 4 లేన్ల రోడ్డు ప్రాజెక్టులు పూర్తికావడానికి సమయం పట్టే అవకాశం ఉన్నందున, ప్రస్తుత NH–365BB పై వన్ టైం ఇంప్రూవ్మెంట్ చేపట్టడం తప్పనిసరి అని మంత్రి తుమ్మల లేఖలో స్పష్టం చేశారు. జగ్గయ్యపేట–కొత్తగూడెం వయా వైరా జాతీయ రహదారిని మంజూరు చేయాలని గడ్కరీ ని తుమ్మల కోరారు. జాతీయ రహదారి 65 మీద ఉన్న జగ్గయ్యపేట నుంచి జాతీయ రహదారి 30 మీద ఉన్న కొత్తగూడెం వరకు కొత్త జాతీయ రహదారి ఆమోదం లభిస్తే రెండు ప్రధాన జాతీయ రహదారులు అనుసంధానం కావడంతో పాటు తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రజలకు వేగవంతమైన, సురక్షితమైన రవాణా సౌకర్యం అందుబాటులోకి వస్తుందని మంత్రి పేర్కొన్నారు. జగ్గయ్యపేట నుంచి బోనకల్, వైరా, తల్లాడ మీదుగా కొత్తగూడెం వరకు ఈ రహదారిని మంజూరు చేయాలని ఆయన కోరారు. ప్రస్తుతం ఈ మార్గం రాష్ట్ర రహదారిగా ఉన్నదని, దీనిని జాతీయ రహదారిగా అప్‌గ్రేడ్ చేసినట్లయితే భద్రాచలం దర్శనార్థం వచ్చే భక్తులకు కూడా మరింత సౌకర్యవంతమైన ప్రయాణాన్ని కల్పించవచ్చని మంత్రి తెలిపారు. అంతేకాకుండా, ఈ రహదారి అభివృద్ధి ద్వారా ప్రధాన పరిశ్రమల క్లస్టర్ల మధ్య కనెక్టివిటీ మెరుగుపడటంతో జగ్గయ్యపేట సిమెంట్ పరిశ్రమలు, అలాగే కొత్తగూడెం, పాల్వంచ, అశ్వపురం, మణుగూరు ప్రాంతాల్లోని పరిశ్రమలకు రవాణా సదుపాయాలు గణనీయంగా మెరుగుపడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

జంక్షన్లు మున్సిపాలిటీ ల అభివృద్ధి

కొణిజర్ల ,కల్లూరు మున్సిపాలిటీ,పెనుబల్లి, దమ్మపేట (మందలపల్లి) జంక్షన్లలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నందున వాటిని ఆధునిక ప్రమాణాలతో అభివృద్ధి చేయాలని మంత్రి గడ్కరిని కోరారు. అలాగే ఈ ప్రాంతాల్లో కొత్తగా నాలుగు వరుసల రహదారి,సెంట్రల్ లైటింగ్, డివైడర్లు, డ్రైనేజీ వ్యవస్థ వంటి ఏర్పాట్లు అత్యవసరమని, కాబట్టి వీటిని వెంటనే మంజూరు చేయాలని మంత్రి తుమ్మల కోరారు. ఇదే అంశంపై మినిస్ట్రీ ఆఫ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ హైవే ల రిజినల్ ఆఫీసర్ కృష్ణ ప్రసాద్‌కూ వేరుగా లేఖ రాసినట్టు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ప్రమాదాల నియంత్రణ, రాకపోకల సౌలభ్యం, ఖమ్మం జిల్లాకు నిరంతర రహదారి అనుసంధానానికి ఈ పనులు అత్యంత కీలకమన్న మంత్రి తుమ్మల, అవసరమైన అనుమతులు, నిధులు వెంటనే మంజూరు చేసి తక్షణమే పనులు ప్రారంభించాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కోరారు. దీనికి స్పందించిన కేంద్రమంత్రి తక్షణమే పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖండాంతరాల్లో సిపిఐ శతాబ్ది సంబరం..!

ఖండాంతరాల్లో సిపిఐ శతాబ్ది సంబరం..! విదేశాల్లోనూ ఎగసిన వామపక్ష జెండా ఖమ్మం వామపక్ష కుటుంబాల...

రూ.15 లక్షల గంజాయి ద్రవం పట్టివేత.. ఇద్ద‌రి అరెస్టు..

రూ.15 లక్షల గంజాయి ద్రవం పట్టివేత.. ఇద్ద‌రి అరెస్టు.. ద్విచక్ర వాహనం, రెండు...

రిజర్వేషన్లకు ముందే టికెట్ల యుద్ధం

రిజర్వేషన్లకు ముందే టికెట్ల యుద్ధం * మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పొలిటికల్ హీట్ *...

చైనా మాంజాలపై ఉక్కుపాదం

చైనా మాంజాలపై ఉక్కుపాదం * విక్రయిస్తే కేసులు తప్పవు * వాహనదారులకు ప్రాణహాని * పక్షుల...

ప్రజావాణి కి అధికారుల డుమ్మా

ప్రజావాణి కి అధికారుల డుమ్మా * 11 దాటినా జాడలేని అధికారులు * 29...

భూసారం కాపాడుకోవడం రైతు బాధ్యత

భూసారం కాపాడుకోవడం రైతు బాధ్యత సాగు ఖర్చులు త‌గ్గితేనే ఆదాయం పెరుగుతుంది అవసరానికి మించి...

స్థానిక సమస్యలకు సీపీఐ(ఎం)తోనే పరిష్కారం

స్థానిక సమస్యలకు సీపీఐ(ఎం)తోనే పరిష్కారం సంస్కృతి–సంప్రదాయాలకు ప్రతీక రంగవల్లికలు సీపీఐ(ఎం) ఖమ్మం డివిజన్ కార్యదర్శి...

నేడు కాంగ్రెస్‌ ముత్యాల ముగ్గుల పోటీలు

నేడు కాంగ్రెస్‌ ముత్యాల ముగ్గుల పోటీలు కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో 3 గంటలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img