epaper
Friday, November 21, 2025
epaper

సామినేని హంతకులను అరెస్టు చేయాలి

సామినేని హంతకులను అరెస్టు చేయాలి
ఖమ్మం సీపీకి అఖిలపక్షం నేతల వినతి పత్రం

కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : సీపీఐ (ఎం) రాష్ట్ర నాయకులు సామినేని రామారావు హంతకులను తక్షణమే అరెస్టు చేసి, చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని అఖిలపక్షాల నేతలు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ కు శుక్రవారం వినతి పత్రం సమర్పించారు. అక్టోబర్ 31వ తేదీ ఉదయం 5.30 గంటల ప్రాంతంలో చింతకాని మండలం పాతర్లపాడు గ్రామానికి చెందిన సీపీఐ (ఎం) నాయకులు సామినేని రామారావును ఆయన ఇంటి వద్దనే కొట్టంలో హత్య చేశారని తెలిపారు. అదే గ్రామానికి చెందిన బొర్రా ప్రసాద్‌, కంచుమర్తి రామకృష్ణ, మద్దినేని నాగేశ్వరరావు, కండ్రా పిచ్చయ్య, కొత్తపల్లి వెంకటేశ్వర్లుతో పాటు మరికొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో పొడిచి అతి దారుణంగా హత్య చేశారని రామారావు భార్య స్వరాజ్యం ఫిర్యాదు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. రామారావు ఉన్నంత కాలం గ్రామంలో సీపీఐ (ఎం) ను ఓడించటం సాధ్యం కాదని, రాజకీయ కక్షతో ఆ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు కుట్ర పన్ని కిరాతకంగా హత్య చేశారని ఆరోపించారు. రామారావు హత్య జరిగి ఇప్పటికీ 21 రోజులు అవుతున్నా.. ఆయన సతీమణి స్వరాజ్యం హంతకులను స్వయంగా చూశానని చెబుతున్నా… వారి పేర్లతో సహా పిటిషన్ ఇచ్చినా ఇప్పటివరకు నిందితులను అరెస్టు చేయకపోవడం శోచనీయమని పేర్కొన్నారు. రామారావు నిస్వార్ధ ప్రజానాయకులు, పాతర్లపాడు గ్రామానికి రెండుసార్లూ ఏకగ్రీవ సర్పంచ్‌ గా పని చేశారని వివరించారు. ఆయన సతీమణి సైతం ఒకసారి సర్పంచ్ గా పనిచేసిన విషయాన్ని గుర్తు చేశారు. పేదలకు సొంత భూములు పంచిన చరిత్ర వారికి ఉందన్నారు. రైతు సంఘం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శిగా.. సుమారు 50 ఏళ్లపాటు సీపీఐ (ఎం) నాయకునిగా ఆయన కొనసాగిన విషయాన్ని ప్రస్తావించారు. ప్రస్తుతం తన స్వగ్రామంలో ఉంటూ గ్రామాభివృద్ధికి పాటుపడుతున్న రామారావును అన్యాయంగా హతమార్చారని తెలిపారు. హంతకులతో పాటు హత్యకు కుట్ర దాల్చిన వారిని అరెస్టు చేసి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సీపీని కలిసి వినతి పత్రం సమర్పించిన అఖిలపక్ష నేతల్లో సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు, బీఆర్ ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి జమ్ముల జితేందర్ రెడ్డి, సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ జిల్లా నాయకులు ఆవుల అశోక్, న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి కోలా లక్ష్మీనారాయణ, సీపీఐ (ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు మాచర్ల భారతి, బండి రమేష్, వై. విక్రం తదితరులు ఉన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సింగరేణి ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలి

అధికారులకు ప‌ర్స‌న‌ల్ డిపార్ట్‌మెంట్ జీఎం కవిత నాయుడు సూచన కాకతీయ, కొత్తగూడెం...

సీఎం పర్యటన ఏర్పాట్ట‌పై క‌లెక్ట‌ర్ ప‌రిశీల‌న‌

కాకతీయ, కొత్తగూడెం : డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎట్ సైన్స్ యూనివర్సిటీ...

ప్ర‌ధాన రోడ్ల‌పై ఫుట్ పాత్‌లు త‌ప్ప‌నిస‌రి

ఫుట్ పాత్ పై ప్లాంటేషన్, స్ట్రీట్ లైటింగ్ సైకిల్ ట్రాక్...

ఖమ్మం సైన్స్ మ్యూజియం తెర‌వాలి

సర్కార్ నిధులు, సీఎస్‌ఆర్ ఫండ్స్ వృథా పీడీఎస్‌యూ డిమాండ్ ఖమ్మం...

శాపంగా మారిన నిర్లక్ష్యం

శాపంగా మారిన నిర్లక్ష్యం నిరుద్యోగుడిని వెంటాడిన దురదృష్టం గ్రామీణ పోస్టల్ శాఖ సిబ్బంది నిర్లక్ష్యం యువకుడు...

ఛాంబర్ కార్యవర్గాన్ని అభినందించిన..మంత్రి తుమ్మల

ఛాంబర్ కార్యవర్గాన్ని అభినందించిన..మంత్రి తుమ్మల కాకతీయ, ఖమ్మం ప్రతినిధి: ఛాంబర్ ఆఫ్ కామర్స్...

సజావుగా పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సన్నద్ధంగా ఉండాలి

సజావుగా పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సన్నద్ధంగా ఉండాలి రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్...

నిబంధనలు పాటిస్తేనే ధాన్యం కేటాయింపు

నిబంధనలు పాటిస్తేనే ధాన్యం కేటాయింపు మిల్ల‌ర్ల‌కు అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి హెచ్చ‌రిక‌ రైస్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img