పోలీస్ స్టేషన ను ఆకస్మికంగా సందర్శించిన ఎస్పీ రోహిత్ రాజు
రోడ్డు ప్రమాదాలు,సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహనా కల్పించాలి
కాకతీయ, జూలూరుపాడు: స్థానిక పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ఆకస్మికంగా సందర్శించారు.ఈ సందర్శనలో భాగంగా పోలీస్ స్టేషన్ ను,స్టేషన్ పరిసరాలను పరిశీలించారు.పోలీస్ స్టేషన్ పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని,వివిధ సమస్యలతో పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులకు న్యాయం చేకూర్చే విధంగా బాధ్యతగా మెలగాలని,పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన పలు కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.పోలీస్ స్టేషన్ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని,రోడ్డు ప్రమాదాలు,సైబర్ నేరాలపై నిత్యం పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాలలో లోని ప్రజలకు అవగాహనా కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని సూచించారు.పోలీస్ స్టేషన్లో పనిచేసే అధికారులు,సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు అనంతరం పోలీస్ స్టేషన్ అధికారులకు మరియు సిబ్బందికి పలు సూచనలు చేశారు .ఈ కార్యక్రమంలో జూలూరుపాడు సీఐ శ్రీ లక్ష్మీ,ఎస్సై రవి మరియు సిబ్బంది పాల్గొన్నారు.



