epaper
Friday, January 16, 2026
epaper

విక్ర‌యానికి 7 రోజుల ప‌సికందు

విక్ర‌యానికి 7 రోజుల ప‌సికందు
డ‌య‌ల్ 100 స‌మాచారంతో పోలీస్‌ల మెరుపుదాడి
త‌ల్లీ, మ‌ధ్య‌వ‌ర్తులు అరెస్ట్‌

కాక‌తీయ‌, క‌రీంన‌గ‌ర్ బ్యూరో : కేవలం 7 రోజుల వయసున్న పసికందును విక్రయించడానికి యత్నించిన ముఠాను ఒక్క ఫోన్ కాల్ స‌మాచారంతో కరీంనగర్ టూ టౌన్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. భర్త వదిలేసాడు పేదరికంతో బిడ్డను పోషించలేనని కన్నతల్లి చెప్పడంతో ఆమెను ఉపయోగించుకుంటూ మధ్యవర్తులు డీల్‌కు సిద్ధమైనట్టు పోలీసులు గుర్తించారు.

ప్ర‌లోభ పెట్టి విక్ర‌యానికి

వైజాగ్‌కు చెందిన 22 ఏళ్ల శీలం సాయి శ్రీ భర్తతో విబేధాలు రావడంతో గర్భిణీ స్థితిలోనే హైదరాబాద్‌కు వచ్చి తన స్నేహితులు అభినవ్, హీనా వద్ద ఆశ్రయం తీసుకుంది. నవంబర్ 14న ఆమె గాంధీ ఆసుపత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ సమయంలో సాయిశ్రీ ఆర్థిక పరిస్థితిని దుర్వినియోగం చేసిన అభినవ్, హీనా బిడ్డను పోషించడం కష్టమని అమ్మేస్తే పెద్ద మొత్తంలో డబ్బు వస్తుందని ఆమెను ప్రలోభపెట్టారు. దీనికి సాయిశ్రీ అంగీకరించడంతో హీనా తనకు తెలిసిన పల్లవి, భవాని అనే మధ్యవర్తుల ద్వారా కరీంనగర్‌లో కొనుగోలుదారులను ఏర్పాటుచేసింది. ఈ క్ర‌మంలో ఒప్పందం రూ. 5 లక్షలకు ఖరారు కావడంతో నవంబర్ 20న ముఠా సభ్యులు అశోక్ అనే డ్రైవర్‌తో కలిసి కారులో కరీంనగర్ చేరుకున్నారు. భవాని సూచన మేరకు ఆర్య ఆసుపత్రి వద్ద కొనుగోలు దారులకు పసికందును చూపించారు. ఈ ప్రక్రియలో డబ్బుల విషయంలో మాటలు కఠినతరం కావడం సంశయాస్పదంగా వ్యవహరించడం గమనించిన ఓ ఆటో డ్రైవర్ వెంటనే డయల్ 100కు సమాచారం ఇచ్చాడు. ఆటో డ్రైవ‌ర్ సమాచారంతో అప్రమత్తమైన పోలీసులు కదిలేలోపే భయపడిన ముఠా అక్కడినుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించింది. తర్వాత కిసాన్ నగర్ ప్రాంతంలో భవాని రూ. 5 లక్షలు తీసుకుంటున్న సమయంలో కరీంనగర్ టూ టౌన్ పోలీసుల ఏస్సై జె. అరుణ్ బృందం దాడి చేసి నిందితులందరినీ పట్టుకుంది. ఈ ఘటనతో 7 రోజుల పసికందును విక్రయం చేసేందుకు చేసిన ప్రయత్నం వెలుగులోకి రావడంతో నగరంలో కలకలం రేగింది. ఈ దాడిలో పసికందును రక్షించిన పోలీసులు నిందితుల వ‌ద్ద నుండి విక్ర‌యానికి తీసుకున్న న‌గ‌దు రూ.5 ల‌క్ష‌లు, కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. త‌ల్లీ సాయిశ్రీ, మ‌ధ్య‌వ‌ర్తులు హీనా, అభిన‌వ్‌, భ‌వాని, కారు డ్రైవ‌ర్ అశోక్ త‌దిత‌రుల‌పై కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు కొన‌సాగిస్తున్న‌ట్లు పోలీసులు తెలిపారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

మారిన ప్రాధాన్యాలు..మార‌నున్న రాజ‌కీయం

మారిన ప్రాధాన్యాలు..మార‌నున్న రాజ‌కీయం 2020తో పోలిస్తే 2026లో రిజర్వేషన్ల కేటాయింపుల్లో మార్పు కార్పొరేషన్‌తో పాటు...

మినీ థియేటర్లలో రోడ్డు భద్రత సందేశం

మినీ థియేటర్లలో రోడ్డు భద్రత సందేశం సినిమాల మధ్యే ట్రాఫిక్ అవగాహన హెల్మెట్, సీట్‌బెల్ట్‌పై...

మైనారిటీ గురుకులాల్లో అడ్మిషన్లకు గ్రీన్‌సిగ్నల్

మైనారిటీ గురుకులాల్లో అడ్మిషన్లకు గ్రీన్‌సిగ్నల్ ▪️ అడ్మిషన్ పోస్టర్ ఆవిష్కరించిన అదనపు కలెక్టర్...

శిశుమందిర్ అభివృద్ధికి రూ.1.16 లక్షల విరాళం

శిశుమందిర్ అభివృద్ధికి రూ.1.16 లక్షల విరాళం ఆచార్యుడిగా పనిచేసిన నాయిని చంద్రయ్య ఉదార‌త‌ కాకతీయ,...

వృద్ధురాలిని నట్టేట ముంచారు..!

వృద్ధురాలిని నట్టేట ముంచారు..! విలువైన భూముల అక్రమ రిజిస్ట్రేషన్లు మీడియా ముందుకు వచ్చిన శంభునిపల్లి...

జర్నలిస్టుల అరెస్టులు అన్యాయం

జర్నలిస్టుల అరెస్టులు అన్యాయం అక్రమ అరెస్టులను ఖండించిన టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కో కన్వీనర్ కే....

పురాభివృద్ధే నా లక్ష్యం..!

పురాభివృద్ధే నా లక్ష్యం..! ఎన్నికల హామీల అమలే ప్రాధాన్యం క్యాతన్‌పల్లిలో అభివృద్ధి పనులకు శ్రీకారం సీసీ...

వావిలాలలో వైభవంగా గోదాదేవి కల్యాణం

వావిలాలలో వైభవంగా గోదాదేవి కల్యాణం కాకతీయ, జమ్మికుంట : ధనుర్మాస ఉత్సవాల ముగింపు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img