epaper
Saturday, November 15, 2025
epaper

సీఎం చంద్రబాబు నేతృత్వంలో 52వ సీఆర్డీఏ అథార్టీ సమావేశం

కాకతీయ,అమరావతి: రాజధానిలో కీలక నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసేలా దృష్టి సారించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. మంగళవారం సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి నేతృత్వంలో 52వ సీఆర్డీఏ అథార్టీ సమావేశం జరిగింది. ఏడు అంశాలకు ఈ సమావేశంలో ఆమోదం లభించింది. రాజధాని పరిధిలో చేపట్టే కీలక ప్రాజెక్టులు కార్యరూపం దాల్చేలా స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు, ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు, స్మార్ట్ ఇండస్ట్రీస్, ఐకానిక్ బ్రిడ్జ్, స్పోర్ట్స్ సిటీ, రివర్ ఫ్రంట్, రోప్ వే, ఇన్నర్ రింగ్ రోడ్ వంటి ప్రాజెక్టుల నిమిత్తం స్పెషల్ పర్పస్ వెహికల్ దోహద పడుతుంది.

అయితే ఎస్పీవీ పరిధిలోకి బయో డిజైన్ ప్రాజెక్టును కూడా తీసుకురావాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. స్పోర్ట్స్ సిటీ తరహాలోనే హెల్త్ సిటీ కూడా అమరావతిలో ఏర్పాటు కానుందని.. దాని పరిధిలో బయో డిజైన్ ప్రాజెక్టు ఏర్పాటు చేయాలని సీఎం చెప్పారు. ప్రజారోగ్య సేవల నిమిత్తం బయో డిజైన్ ప్రాజెక్టులో భాగస్వాములుగా ఉండేందుకు ఏడు దేశాలకు చెందిన నిపుణులు, సంస్థలు సిద్దంగా ఉన్నాయని సీఎం తెలిపారు. ఎస్పీవీ పరిధిలోని ప్రాజెక్టుల డిజైన్, రెవెన్యూ జనరేషన్ మొదలు నిర్మాణం పూర్తి అయ్యేంత వరకు ఎస్పీవీనే పూర్తి బాధ్యత వహించనున్నట్టు అధికారులు సీఎంకు వివరించారు.

గవర్నమెంట్ కాంప్లెక్స్ కు మౌలిక సదుపాయాలపై ఫోకస్

అమరావతిలో ప్రభుత్వ భవనాల సముదాయం కోసం అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించిన టెండర్ కు సీఆర్డీఏ అథార్టీ ఆమోదించింది. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ భవనాలకు అనుసంధానంగా రోడ్లు, ఫుట్ పాత్ ల నిర్మాణానికి సంబంధించిన పనులు ఇకపై మొదలు కానున్నాయి. దీంట్లో భాగంగా 53.68 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణం చేపట్టనున్నారు. రోడ్ల నిర్మాణమే కాకుండా… ఏడేళ్ల పాటు రోడ్ల నిర్వహణ బాధ్యతను కూడా టెండర్ దక్కించుకున్న సంస్థే చేపట్టేలా నిబంధనలు పెట్టినట్టు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.

ఇక రాజధాని ప్రాంతంలో అర్బన్ డిజైన్లు, ఆర్కిటెక్చరల్ గైడ్ లైన్స్ కు సంబంధించిన నోటిఫికేషన్ జారీకి అథార్టీ ఆమోదించింది. డిజైన్లను ఆమోదించే సందర్భంలో జాగ్రత్తలు తీసుకోవాలని.. అమరావతి నగరం మొత్తంగా ఆకర్షణీయంగా కన్పించేలా ఉండాలని చంద్రబాబు సూచించారు. ప్రతి కట్టడమూ ప్రజలను ఆకర్షించేలా ఉండాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. సీఆర్డీఏ పరిధిలో చేపడుతున్న ప్రాజెక్టులతో కార్యాకలాపాలు పెరిగాయని అధికారులు చెప్పగా… ఈ మేరకు అవసరమైన సిబ్బందిని డిప్యుటేషన్, ఆన్ డ్యూటీ విధానంలో నియమించుకునేందుకు సీఎం అనుమతిచ్చారు.

కన్వెన్షన్ సెంటర్లకు భూములు

రాజధాని పరిధిలో కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణం కోసం కొన్ని ప్రముఖ హోటళ్లు ముందుకు వచ్చాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. రాజధాని పరిధిలో ఇప్పటికే కొన్ని ప్రముఖ హోటళ్లకు భూములు కేటాయించామని.. వాటికి అనుబంధంగా కొందరు కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణం చేపట్టాలని భావిస్తున్నారని… అయితే అందుకు భూములు ఇవ్వాలని ప్రతిపాదించాయని చెప్పారు. నిర్మాణాలు ప్రపంచ ప్రమాణాలకు ధీటుగా ఉండాలని సూచిస్తూ… ముందుకొచ్చిన సంస్థలకు కన్వెన్షన్ సెంటర్ల నిమిత్తం భూములు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి అంగీకరించారు.

మాస్టర్ ప్లాన్ అవసరాలకు అనుగుణంగా ఏమైనా భూ సేకరణ చేపట్టాలంటే రైతులతో మాట్లాడి ఆ ప్రక్రియ చేపట్టనున్నట్టు అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. రైతులతో మాట్లాడి… వారికి ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా ప్రక్రియను చేపట్టాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అధికారులు ఇచ్చారు. కృష్ణా నదిలోని ద్వీపాలను అభివృద్ధి చేసి టూరిజాన్ని ఆకర్షించేలా చూడాలని సీఎం సూచించారు. ఈ సమావేశంలో మంత్రి నారాయణ, మున్సిపల్, సీఆర్డీఏ, ఏడీసీ సహా వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కళ్యాణదుర్గంలో లోకేష్ ప్రజాదర్బార్

కళ్యాణదుర్గంలో లోకేష్ ప్రజాదర్బార్ ప్రజల‌ నుంచి వినతులు స్వీకరించిన మంత్రి అన్ని విధాల అండగా...

గుంత‌లు లేని దారులే మా ప్ర‌భుత్వ ల‌క్ష్యం

ప్రజల చేతిలో పల్లె రహదారుల సమాచారం త్వరలో అందుబాటులోకి ‘జియో...

శ్రీ చరణికి రూ.2.5 కోట్ల నజరానా

ఇంటి నిర్మాణానికి 1000 చ.గ. స్థలం గ్రూప్ 1 ఉద్యోగం...

జ‌గ‌న్ ప్ర‌భుత్వంలోనే ఎస్సీ, ఎస్టీల‌కు న్యాయం

కోట మండ‌ల వైసీపీ అధ్య‌క్షులు రాయంకుల‌ కాక‌తీయ. ఏలూరు ప్ర‌తినిధి :...

గిరిజన ‘గూడెం’లో తొలిసారి విద్యుత్ కాంతులు

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో గూడెంకు వెలుగులు కేంద్ర...

కృష్ణా నదిపై హై లెవెల్ వంతెన

దీవుల్లోని గ్రామాలకు అనుసంధానం రాష్ట్ర నిధులతోపాటు, సాస్కీ పథకం నిధులు...

దైవ‌ద‌ర్శ‌నంలో మృత్యుఘోష‌

దైవ‌ద‌ర్శ‌నంలో మృత్యుఘోష‌ శ్రీకాకుళం జిల్లా కాశిబుగ్గ ఆలయంలో తొక్కిసలాట 9 మంది భ‌క్తులు మృతి మృతుల్లో...

ఆలయంలో తొక్కిసలాట

9 మంది భ‌క్తులు మృతి మృతుల్లో బాలుడు.. ఎనిమిది మంది...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img