రెండేళ్ల పాలనలో అభివృద్ధి శూన్యం
గంగుల కమలాకర్
కాకతీయ, కరీంనగర్ : గత రెండేళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రానికి, కరీంనగర్ నగరానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూపాయి కూడా తీసుకురాలేదని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ విమర్శించారు. అభివృద్ధి చేయని ప్రభుత్వాలు రానున్న మూడేళ్లలో ఏమి చేస్తాయని ప్రజలు ప్రశ్నించాలని అన్నారు.
గురువారం 47వ, 21వ డివిజన్ల బీఆర్ఎస్ అభ్యర్థులు చల్ల స్వరూప రాణి, చల్ల హరిశంకర్ల నామినేషన్ కార్యక్రమానికి గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా రాంనగర్లోని రమా సహిత సత్యనారాయణ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం డప్పు చప్పుళ్ల మధ్య భారీ ర్యాలీగా నామినేషన్ కేంద్రానికి వెళ్లి నామినేషన్లు దాఖలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ రెండేళ్లలో పొన్నం ప్రభాకర్ గానీ, బండి సంజయ్ గానీ నగర అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రూ.1650 కోట్లతో కరీంనగర్ నగరాన్ని సమగ్రంగా అభివృద్ధి చేశామని తెలిపారు.ఎన్నికల సమయంలో మాత్రమే కనిపించే నాయకుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు పాలనలో పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్కు భవిష్యత్ లేదని, బీజేపీ పార్టీ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయలేదని స్పష్టం చేశారు.తెలంగాణ ప్రజల సంక్షేమం కోసమే ఏర్పడిన పార్టీ టీఆర్ఎస్ అని, రాబోయే రోజుల్లో మళ్లీ టీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి రానుందని ధీమా వ్యక్తం చేశారు.డిప్యూటీ మేయర్గా చల్ల స్వరూప రాణి, చల్ల హరిశంకర్లు డివిజన్ల అభివృద్ధికి నిరంతరం కృషి చేశారని తెలిపారు. ప్రజల ఇంటి బిడ్డలుగా సంక్షేమం కోసం పనిచేశారని పేర్కొంటూ, వారిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. డిప్యూటీ మేయర్గా ఉన్నప్పుడే అభివృద్ధి సాధించారని, మళ్లీ బీఆర్ఎస్ మేయర్ అయితే నగరాన్ని మరింత ముందుకు తీసుకెళ్తారని అన్నారు.ఈ కార్యక్రమంలో గంగుల సుధాకర్తో పాటు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, డివిజన్ ప్రజలు పాల్గొన్నారు.


