epaper
Thursday, March 26, 2026
epaper

రెండేళ్ల పాలనలో అభివృద్ధి శూన్యం

రెండేళ్ల పాలనలో అభివృద్ధి శూన్యం
గంగుల కమలాకర్

కాకతీయ, కరీంనగర్ : గత రెండేళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రానికి, కరీంనగర్ నగరానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూపాయి కూడా తీసుకురాలేదని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ విమర్శించారు. అభివృద్ధి చేయని ప్రభుత్వాలు రానున్న మూడేళ్లలో ఏమి చేస్తాయని ప్రజలు ప్రశ్నించాలని అన్నారు.
గురువారం 47వ, 21వ డివిజన్ల బీఆర్‌ఎస్ అభ్యర్థులు చల్ల స్వరూప రాణి, చల్ల హరిశంకర్‌ల నామినేషన్ కార్యక్రమానికి గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా రాంనగర్‌లోని రమా సహిత సత్యనారాయణ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం డప్పు చప్పుళ్ల మధ్య భారీ ర్యాలీగా నామినేషన్ కేంద్రానికి వెళ్లి నామినేషన్లు దాఖలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ రెండేళ్లలో పొన్నం ప్రభాకర్ గానీ, బండి సంజయ్ గానీ నగర అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో రూ.1650 కోట్లతో కరీంనగర్ నగరాన్ని సమగ్రంగా అభివృద్ధి చేశామని తెలిపారు.ఎన్నికల సమయంలో మాత్రమే కనిపించే నాయకుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు పాలనలో పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్‌కు భవిష్యత్ లేదని, బీజేపీ పార్టీ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయలేదని స్పష్టం చేశారు.తెలంగాణ ప్రజల సంక్షేమం కోసమే ఏర్పడిన పార్టీ టీఆర్‌ఎస్ అని, రాబోయే రోజుల్లో మళ్లీ టీఆర్‌ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి రానుందని ధీమా వ్యక్తం చేశారు.డిప్యూటీ మేయర్‌గా చల్ల స్వరూప రాణి, చల్ల హరిశంకర్‌లు డివిజన్ల అభివృద్ధికి నిరంతరం కృషి చేశారని తెలిపారు. ప్రజల ఇంటి బిడ్డలుగా సంక్షేమం కోసం పనిచేశారని పేర్కొంటూ, వారిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. డిప్యూటీ మేయర్‌గా ఉన్నప్పుడే అభివృద్ధి సాధించారని, మళ్లీ బీఆర్‌ఎస్ మేయర్ అయితే నగరాన్ని మరింత ముందుకు తీసుకెళ్తారని అన్నారు.ఈ కార్యక్రమంలో గంగుల సుధాకర్‌తో పాటు బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, డివిజన్ ప్రజలు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

పెద్దపాపయ్యపల్లె గ్రామసభలో ఉద్రిక్తత

పెద్దపాపయ్యపల్లె గ్రామసభలో ఉద్రిక్తత కాకతీయ, హుజూరాబాద్ : పెద్దపాపయ్యపల్లె గ్రామంలో గురువారం జరిగిన...

నీటి సమస్యల పరిష్కారమే ప్రాధాన్యం

నీటి సమస్యల పరిష్కారమే ప్రాధాన్యం జ‌మ్మికుంట మునిసిప‌ల్ పాల‌క‌వ‌ర్గం స‌మావేశంలో కీల‌క నిర్ణ‌యం కాకతీయ,...

ఏప్రిల్ 1 నుంచి మన ఇసుక వాహనంతో సరఫరా

ఏప్రిల్ 1 నుంచి మన ఇసుక వాహనంతో సరఫరా ఆన్లైన్‌లో దరఖాస్తు తప్పనిసరి ఇందిరమ్మ...

కేశవపట్నం వారసంత వేలం రూ.4.14,000/- ముగింపు

కేశవపట్నం వారసంత వేలం రూ.4.14,000/- ముగింపు -బాలయ్యకు దక్కిన హక్కులు -వారసంత రోడ్డుపై నిర్వహణపై...

విషాద కుటుంబాలకు ఈటల రాజేందర్ పరామర్శ

విషాద కుటుంబాలకు ఈటల రాజేందర్ పరామర్శ కాకతీయ, హుజురాబాద్ : ప్రాంతంలో జరిగిన...

సైన్స్ ఎగ్జిబిషన్‌లో విద్యార్థినుల ప్రతిభ

సైన్స్ ఎగ్జిబిషన్‌లో విద్యార్థినుల ప్రతిభ కాకతీయ, జమ్మికుంట : ప్రభుత్వ బాలికల పాఠశాలలో...

హైవే పనుల్లో గందరగోళం

హైవే పనుల్లో గందరగోళం గట్టుదుద్దెనపల్లిలో ఏరియాలో ప‌నుల్లో నాణ్య‌త లేమి సైడ్ డ్రైనేజీ నిర్మాణా...

శవాన్ని తీసుకెళ్లాలంటే

శవాన్ని తీసుకెళ్లాలంటే అంబులెన్స్‌ను తోయాల్సిందే! ప్రభుత్వ ఆసుపత్రి అంబులెన్స్ దుస్థితి స్టార్ట్ కాక మొరాయించిన వాహనం…...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img