కాలువలో యువకుడి మృతదేహం…హత్యా? ప్రమాదమా?
తిమ్మాపూర్ మండలంలో అనుమానాస్పద ఘటన
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని మల్లాపూర్ కాలువలో బనక చంద్ అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.మంగళవారం ఇంటి నుంచి బయటకు వెళ్లిన చంద్ తిరిగి ఇంటికి చేరుకోలేదు.బుధవారం మల్లాపూర్ కాలువలో ఒక యువకుడి మృతదేహం తేలుతున్నట్లు గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీశారు.అనంతరం అది బనక చంద్దిగా గుర్తించారు. మృతుడి శరీరంపై గాయాలు కనిపించడంతో ఇది హత్య కావచ్చని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


