epaper
Monday, March 2, 2026
epaper

వామ్మో పెద్ద‌పులి

వామ్మో పెద్ద‌పులి
సిద్ధిపేట జిల్లాలో పెద్ద‌పులి క‌ల‌క‌లం
చంద్రునాయ‌క్ తండాలో ఐదు ప‌శువుల‌ను చంపిన పులి
కోహెడ మండ‌లం సింగరాయ గుట్టల్లోకి ప‌య‌నం
వ‌రుస దాడుల‌తో ఆందోళ‌న చెందుతున్న ప్ర‌జ‌లు
మూడు జిల్లాల ప్రజల్లో భయాందోళన
అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని అధికారుల సూచ‌న‌లు

కాకతీయ, హుస్నాబాద్ : యాదాద్రి భువనగిరి, జనగాం, సిద్ధిపేట జిల్లాల సరిహద్దు ప్రాంతాలు పులి సంచారంతో గడగడలాడుతున్నాయి. కోహెడ మండలం ఆరెపల్లి సమీపంలోని చంద్రునాయక్ తండాలో ఆదివారం తెల్లవారుజామున పులి దాడి చేసి ఐదు పశువులను చంపేయడం తీవ్ర కలకలం రేపింది. బానోతు రమేష్ నాయక్‌కు చెందిన ఆవులు, ఎద్దులపై జరిగిన ఈ దాడితో గ్రామస్తులు భయభ్రాంతులకు గురయ్యారు. ప్రస్తుతం కోహెడ మండలంలోని సింగరాయ గుట్టల అటవీ ప్రాంతంలో పులి తిరుగుతుండటంతో సమీప గ్రామాల ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మోయాతుమ్మెద వాగు పరిసరాల్లో పులి ఆనవాళ్లు కనిపించాయని స్థానికులు చెబుతున్నారు. తంగళ్లపల్లి–కూరెళ్ల గ్రామాల మధ్య గుట్టల్లో పులి అడుగుల ముద్రలు స్పష్టంగా కనిపించడంతో ప్రజలు మరింత భయపడుతున్నారు. రాత్రి వేళల్లో వినిపిస్తున్న గాండ్రింపు శబ్దాలు గ్రామస్తులను నిద్రపోనివ్వడం లేదు. సాయంత్రం కావడంతోనే గ్రామాలు నిశ్శబ్దంగా మారిపోతున్నాయి. పిల్లలు, మహిళలు బయటకు రావడానికే వెనుకంజ వేస్తున్నారు. రైతులు పొలాలకు వెళ్లేందుకు కూడా భయపడే పరిస్థితి నెలకొంది.

పశువులపై దాడితో పెరిగిన భయం

చంద్రునాయక్ తండా పరిధిలో జరిగిన పశువులపై దాడి ఘటన ప్రజలను తీవ్రంగా కలవరపెట్టింది. పొలాల వద్ద మిగిలిన అవశేషాలను చూసి గ్రామస్తులు వణికిపోయారు. రాత్రివేళల్లో పశువుల అరుపులు, పులి గాండ్రింపులు కలిసి వినిపించడంతో ప్రజలు ఇళ్లలోనే తలుపులు మూసుకుని ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. “పులి చాలా దగ్గరలోనే తిరుగుతోంది” అన్న సమాచారం వ్యాపించడంతో చుట్టుపక్కల గ్రామాలన్నీ అప్రమత్తమయ్యాయి. ఎప్పుడు ఎటు నుంచి ప్రమాదం ముంచుకొస్తుందో తెలియక ప్రజలు ఆందోళనతో గడుపుతున్నారు. పరిస్థితి తీవ్రతను గుర్తించిన అటవీ, పోలీసు శాఖ అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. హుస్నాబాద్ అటవీ రేంజర్ సిద్ధార్థ్ రెడ్డి, సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, కోహెడ సబ్ ఇన్‌స్పెక్టర్ అభిలాష్ గ్రామాలను సందర్శించి ప్రజలకు భద్రతా సూచనలు ఇచ్చారు. దండోరా వేయించి ప్రజలను అప్రమత్తం చేశారు. పులి ఎక్కువగా మట్టి రోడ్లపై సంచరిస్తోందని అధికారులు గుర్తించారు. అలాంటి ప్రాంతాల్లో అలజడి కనిపిస్తే వెంటనే అక్కడి నుంచి దూరంగా వెళ్లి అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. రాత్రివేళల్లో ఒంటరిగా బయట తిరగవద్దని, గుంపులుగా మాత్రమే వెళ్లాలని హెచ్చరించారు. పశువులను పొలాల వద్ద వదిలేయకుండా గ్రామాల్లోకి తీసుకురావాలని, రాత్రి వేళల్లో జాగ్రత్తలు పాటించాలని చెప్పారు. పులి కనిపిస్తే ఫోటోలు, వీడియోలు తీయడానికి ప్రయత్నించవద్దని, అలా చేయడం ప్రాణాలకు ప్రమాదకరమని స్పష్టం చేశారు. పులిని రెచ్చగొట్టే చర్యలు చేస్తే దాడి చేసే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని, అటవీ శాఖ పెట్రోలింగ్ బృందాలు నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నాయని అధికారులు తెలిపారు. పులి కదలికలు గమనించిన వెంటనే అటవీ శాఖకు సమాచారం ఇవ్వాలని గ్రామస్తులకు సూచించారు. ప్రస్తుతం గ్రామాల్లో భయాందోళన వాతావరణం కొనసాగుతోంది. పిల్లలను బయటకు పంపేందుకు తల్లిదండ్రులు భయపడుతున్నారు. రైతులు పొలాలకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. అటవీ శాఖ పులిని గుర్తించి పట్టుకునేందుకు చర్యలు తీసుకుంటున్నప్పటికీ, సంచారం ఆగకపోవడంతో ప్రజల్లో ఆందోళన ఇంకా తగ్గడం లేదు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వేములవాడ ఏఎస్పీకి ఆకస్మిక బదిలీ..!

వేములవాడ ఏఎస్పీకి ఆకస్మిక బదిలీ..! రెండు నెలల్లోనే రుత్విక్ సాయి ట్రాన్స్‌ఫర్ డీఎస్పీగా శ్రీనివాసులు...

సర్కారు భూముల కబ్జాలపై కఠిన చర్యలు

సర్కారు భూముల కబ్జాలపై కఠిన చర్యలు ఆక్రమణలు తొలగించి పేదలకు పంపిణీ ధర్మారంలో క్రీడా...

ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రజక సంఘాల ఆగ్రహం

ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రజక సంఘాల ఆగ్రహం కరీంనగర్‌లో వీర్లపల్లి శంకర్ దిష్టిబొమ్మ దహనం బాధిత...

లక్ష్మీనరసింహస్వామి కళ్యాణంలో కలెక్టర్ దంపతులు

లక్ష్మీనరసింహస్వామి కళ్యాణంలో కలెక్టర్ దంపతులు పట్టు వస్త్రాలు సమర్పణ కాక‌తీయ‌, జగిత్యాల : ధర్మపురి...

హుజూరాబాద్‌లో బీఆర్‌ఎస్ భూస్థాపితం ఖాయం

హుజూరాబాద్‌లో బీఆర్‌ఎస్ భూస్థాపితం ఖాయం కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి ప్రణవ్ కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు,...

బండి సంజయ్ ధర్మం తప్పుతున్నారు

బండి సంజయ్ ధర్మం తప్పుతున్నారు బీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ రెబల్స్ చేరిక,...

50వ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా

50వ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా కార్పొరేటర్ బోయినపల్లి ప్రవీణ్ రావు కాక‌తీయ‌, కరీంనగర్ :...

సైన్స్‌పై మ‌క్కువ పెంచుకోవాలి

సైన్స్‌పై మ‌క్కువ పెంచుకోవాలి ప్రశ్నించేత‌త్వం అల‌వ‌ర్చుకోవాలి రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కాకతీయ, రుద్రంగి:...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img