అంకిత భావంతో పనిచేయాలి
కాకతీయ, గీసుగొండ: విద్యార్థులు ప్రాథమిక అక్షరాస్యత, సంఖ్యాజ్ఞాన నైపుణ్యాలను సమగ్రంగా సాధించేలా ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ సత్య శారద సూచించారు. వరంగల్ మహానగర పాలక సంస్థ 16వ డివిజన్ ధర్మారంలోని ప్రాథమిక పాఠశాలను సందర్శించి, ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమంలో భాగంగా 2వ తరగతి విద్యార్థులకు నిర్వహిస్తున్న గణిత అంచనా పరీక్షను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థి అవసరమైన సబ్జెక్టు సామర్థ్యాలు పొందేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, బోధనలో నాణ్యతతో పాటు నిరంతర మూల్యాంకనానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. విద్యార్థుల అభ్యాస స్థాయిని తరచుగా సమీక్షిస్తూ లోపాలను గుర్తించి వెంటనే సరిదిద్దే చర్యలు చేపట్టాలని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రంగయ్య నాయుడు, ఏఎంఓ సృజన్ తేజ,ఎంఈఓ రవీందర్ పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.


