epaper
Saturday, March 7, 2026
epaper

మహిళల రక్షణ సామాజిక‌ బాధ్యత

మహిళల రక్షణ సామాజిక‌ బాధ్యత
యువత మహిళా రక్షణకు బ్రాండ్ అంబాసిడర్ కావాలి
మహిళలకు బాధ్యతలు అప్పగించడంలో కాంగ్రెస్ ముందు
మహిళలకు ఆర్థిక, సామాజిక భరోసా కల్పిస్తున్నాం
అన్ని రంగాల్లో రాణించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం
“స్టాండ్ విత్ హర్” కార్యక్రమంలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి

కాకతీయ, హైదరాబాద్ : అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవడంతోనే మన బాధ్యత పూర్తికాదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మహిళల గౌరవం, భద్రతను కాపాడటం సమాజం మొత్తం బాధ్యతగా తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. “స్టాండ్ విత్ హర్” కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి మహిళల భద్రత, సాధికారతపై ప్రభుత్వ దృక్పథాన్ని వివరించారు. దేశానికి రాష్ట్రపతిగా, ప్రధానమంత్రిగా, లోక్ సభ స్పీకర్‌గా, ముఖ్యమంత్రులుగా మహిళలకు అవకాశం కల్పించిన పార్టీ కాంగ్రెస్ అని ఆయన గుర్తు చేశారు. మహిళల సామర్థ్యాన్ని గుర్తించి వారికి బాధ్యతలు అప్పగించడంలో కాంగ్రెస్ ఎప్పుడూ ముందుంటుందని తెలిపారు. తెలంగాణలో కూడా మహిళల సాధికారతకు ప్రాధాన్యం ఇస్తున్నామని పేర్కొన్నారు. మహిళను మనం శక్తితో పోలుస్తామని, అలాంటి మహిళకు రక్షణ కల్పించలేకపోతే ఏ రాష్ట్రానికైనా గౌరవం ఉండదని ఆయన అన్నారు. గతంలో మహిళలపై వేధింపులు కొంతవరకే పరిమితమయ్యేవని, కానీ ఇప్పుడు సాంకేతిక అభివృద్ధితో సోషల్ మీడియాలో కూడా వేధింపులు పెరిగిపోయాయని వ్యాఖ్యానించారు.

సామాజిక బాధ్యతగా చూడాలి..!

మహిళల రక్షణ కోసం చట్టాలు చేయడం, పోలీసులు పర్యవేక్షించడం మాత్రమే సరిపోదని ముఖ్యమంత్రి అన్నారు. సమాజం మొత్తం బాధ్యతగా భావించి ముందుకు వస్తేనే మహిళలపై జరుగుతున్న వేధింపులను అరికట్టగలమని చెప్పారు. మన ఇంటి ఆడబిడ్డలకు ఎలాంటి గౌరవం ఇస్తామో, సమాజంలో ఉన్న ప్రతి ఆడబిడ్డను కూడా అదే గౌరవంతో చూడాలని ఆయన సూచించారు. ప్రతి యువకుడు మహిళా రక్షణకు బ్రాండ్ అంబాసిడర్‌లా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలలో మహిళలకు ప్రాధాన్యం ఇస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు మహిళల పేరుతోనే అందిస్తున్నామని చెప్పారు. స్వయం సహాయక సంఘాలకు రుణాలు అందించి వారికి వ్యాపార అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. శిల్పారామం వద్ద దుకాణ సముదాయాలు కేటాయించి మహిళలు స్వయం ఉపాధితో ఎదిగేలా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. సోలార్ విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తూ మహిళలు పెద్ద పారిశ్రామిక వేత్తలతో పోటీ పడే స్థాయికి ఎదగాలని ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని అన్నారు. మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో పాటు వెయ్యి బస్సులకు మహిళలను యజమానులుగా చేసే కార్యక్రమం కూడా చేపట్టామని తెలిపారు. మహిళా యూనివర్సిటీకి వీరనారి చాకలి ఐలమ్మ పేరు పెట్టడం ద్వారా మహిళా శక్తికి గౌరవం తెలిపామని చెప్పారు. మహిళా శక్తిపై రాష్ట్ర ప్రభుత్వానికి సంపూర్ణ విశ్వాసం ఉందని ఆయన అన్నారు. దేశంలోనే తెలంగాణను మహిళలకు అత్యంత భద్రత కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో “స్టాండ్ విత్ హర్” కార్యక్రమాన్ని చేపట్టామని ముఖ్యమంత్రి తెలిపారు. మహిళలు వంటింటికే పరిమితం కాకుండా అన్ని రంగాల్లో రాణించాలన్నదే ప్రభుత్వ ఆకాంక్ష అని చెప్పారు. సోషల్ మీడియా పెరుగుతున్న నేపథ్యంలో సైబర్ నేరాలు కూడా పెరుగుతున్నాయని, మహిళలపై అన్యాయం జరిగితే ప్రతి ఒక్కరూ “స్టాండ్ విత్ హర్” అంటూ ముందుకు రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

జీహెచ్‌ఎంసీలో క‌మిష‌న‌ర్ ఆక‌స్మిక త‌నిఖీలు

జీహెచ్‌ఎంసీలో క‌మిష‌న‌ర్ ఆక‌స్మిక త‌నిఖీలు ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా క్షేత్రస్థాయి పర్యటన బంజారాహిల్స్‌,...

ఏసీబీకి చిక్కిన జీహెచ్ఎంసీ అధికారి

ఏసీబీకి చిక్కిన జీహెచ్ఎంసీ అధికారి పింఛన్ ప్రాసెస్ కోసం డబ్బులు డిమాండ్ రూ.35 వేల...

ఇక రవీంద్రభారతిలో ఆన్‌లైన్ బుకింగ్‌లు

ఇక రవీంద్రభారతిలో ఆన్‌లైన్ బుకింగ్‌లు నూతన వెబ్‌సైట్‌ను ఆవిష్కరించిన మంత్రి జూపల్లి కృష్ణారావు ఇంటి...

కుమ్మెర ఘటనపై డీజీపీని కలిసిన జాగృతి ప్రతినిధులు

కుమ్మెర ఘటనపై డీజీపీని కలిసిన జాగృతి ప్రతినిధులు చిన్నారి మరణానికి కారణమైన వారిపై...

కుమ్మెర జాతరలో పసికందు మృతి… బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి

కుమ్మెర జాతరలో పసికందు మృతి… బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి డీజీపీకి వినతిపత్రం...

కొత్త మీడియా అక్రిడిటేషన్ కార్డుల జారీ ప్రారంభం

కొత్త మీడియా అక్రిడిటేషన్ కార్డుల జారీ ప్రారంభం జీవో 252 ప్రకారం అమలు…...

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ మాదాపూర్ ఎస్‌ఐ

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ మాదాపూర్ ఎస్‌ఐ రూ.50 వేలు డిమాండ్‌… ఏసీబీ ట్రాప్‌లో...

ఎన్నికలకు పకడ్బందీ బందోబస్తు

ఎన్నికలకు పకడ్బందీ బందోబస్తు ఓటర్లు నిర్భయంగా ఓటు వేయాలి 8,203 పోలింగ్ కేంద్రాల్లో భద్రత...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img