- జూనియర్ సివిల్ జడ్జి సాయి కిరణ్
కాకతీయ, లక్షెట్టిపేట : నేటి బాలలే రేపటి పౌరులు అని జూనియర్ సివిల్ జడ్జి సాయి కిరణ్ కాసమల్ల అన్నారు. మంగళవారం లక్షేటిపేట పట్టణంలోని వైష్ణవి మహిళ డిగ్రీ కళాశాలలో ఏర్పాటుచేసిన అంతర్జాతీయ బాలికల దినోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. మహిళలు సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకొని నిలబడాలని సూచించారు. ఉన్నత చదువులు చదువుకొని టాప్ పొజిషన్లో ఉన్నతమైన స్థానాల్లో ఎదగాలని బాలికలు గోల్ కొట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో లక్షెట్టిపేట బార్ అసోసియేషన్ అధ్యక్షులు కొమిరెడ్డి సత్తన్న, న్యాయవాది గడికొప్పుల కిరణ్ , రహమతుల్లా ,రవీందర్ చాతరాజు శివ శంకర్, కళాశాల ప్రిన్సిపాల్ ఆకుల కిరణ్ కుమార్ విద్యార్థినిలు తదితరులు పాల్గొన్నారు.006


