అప్పుల బాధతో మహిళ ఆత్మహత్య
కాకతీయ, శంకరపట్నం: మండలంలోని కొత్తగట్టు గ్రామానికి చెందిన తణుకు స్వప్న(42) శుక్రవారం ఉదయం ఉరివేసుకుని మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మృతురాలికి ఇద్దరు కూతుర్లు ఉన్నారు. మృతురాలి భర్త సురేష్ ఫిర్యాదు ప్రకారం, తమకు ఉన్న రైస్ మిల్కు సంబంధించిన సీఎంఆర్ కింద 2021–22 సంవత్సరంలో తీసుకున్న వడ్లు తడిచిపోవడం వల్ల తిరిగి ఇవ్వలేకపోవడం, అలాగే బ్యాంకు అప్పులు చెల్లించలేకపోవడం వలన మృతురాలు మనస్తాపానికి గురైనట్లు తెలిపాడు. ఉదయం 7 గంటల సమయంలో ఇంటిలో ఉరివేసుకుని మృతి చెందినట్లు తెలిపారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనైనదని ఎస్ఐ శేఖర్ రెడ్డి తెలిపారు.


