epaper
Thursday, January 15, 2026
epaper

మీపై ఎందుకు చ‌ర్య‌లు తీసుకోకూడ‌దు..?!

మీపై ఎందుకు చ‌ర్య‌లు తీసుకోకూడ‌దు..?!
పార్టీ మారిన ఎమ్మెల్యేల‌కు స్పీక‌ర్ ప్ర‌సాద్ నోటీసులు
గ‌డువులోగా వివ‌ర‌ణ ఇవ్వాల‌ని ఐదుగురికి జారీ..త్వ‌ర‌లోనే మిగ‌తా వారికి జారీ
స్పీక‌ర్ చ‌ర్య‌ల‌పై ముందే చెప్పిన కాక‌తీయ‌
అక్ష‌ర స‌త్య‌మైన పొలిటిక‌ల్‌ క‌థ‌నం

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన 10 మంది ఎమ్మెల్యేల్లో శుక్ర‌వారం ఐదుగురికి అసెంబ్లీ స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ శుక్ర‌వారం నోటీసులు జారీ చేశారు. మిగ‌తా ఐదుగురికి త్వ‌ర‌లోనే నోటీసులు ఇవ్వ‌నున్న‌ట్లు స‌మాచారం. బీఆర్ ఎస్ పార్టీ నుంచి ఎందుకు కాంగ్రెస్ పార్టీలోకి మారారు…? పార్టీ మార‌డం ఫిరాయింపుల కింద వ‌స్తుంది కదా..! మీపై ఎందుకు చ‌ర్య‌లు తీసుకోకూడ‌దో తెలియ‌జేయాల‌ని కోరుతూ నోటీసుల్లో స్పీక‌ర్ పేర్కొన‌డం జ‌రిగిన‌ట్లు స‌మాచారం. గ‌డువులోగా ఈ విష‌యంపై వివ‌ర‌ణ ఇవ్వాల‌ని నోటీసుల్లో స్ప‌ష్టం చేసిన‌ట్లు స‌మాచారం. బీఆర్​ఎస్​కు చెందిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరారని, ఫిరాయింపు నిరోధక చట్టం కింద వారిని అనర్హులుగా ప్రకటించాలని దాఖలైన కేసులో 3 నెలల్లోగా స్పీకర్‌ నిర్ణయం తీసుకోవాలని గత నెల 31న సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దానిపై అడ్వొకేట్‌ జనరల్‌, సీనియర్‌ న్యాయవాదులతో స్పీకర్‌ చర్చించారని సమాచారం. ఆ తర్వాతే ఆ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది. కడియం శ్రీహరి, దానం నాగేందర్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, సంజయ్‌కుమార్, తెల్లం వెంకట్రావు, అరెకపూడి గాంధీ, కాలె యాదయ్య, ప్రకాశ్‌గౌడ్, కృష్ణమోహన్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డిలపై అనర్హత వేటు వేయాలని బీఆర్​ఎస్​ కోరింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వారందరికీ నోటీసులు ఇచ్చి, వివరణ తీసుకొన్న తర్వాత స్పీకర్‌ తుది నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. స్పీకర్‌ నోటీసులతో ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఏం చేస్తారనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది.

నేను పార్టీ మార‌లేదు..! బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వివ‌ర‌ణ‌

బీఆర్ఎస్ నుంచి గెలిచిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి కూడా స్పీక‌ర్ నోటీసులు జారీ చేయ‌గా… తాను బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నానని, పార్టీ మారలేదని ఫోన్‌లో వివ‌ర‌ణ ఇచ్చుకున్నారు. బీఆర్ఎస్ ఇచ్చిన ఫిర్యాదులపై వివరణ ఇస్తానని చెప్పారు. తనకు స్పీకర్ కార్యాలయం నుంచి నోటీసులు అందిన మాట వాస్తవమేనని, స్పీకర్ ను కలసి వివరణ ఇస్తానని చెప్పారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరలేదని, బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నానని, తన నియోజకవర్గంలో అభివృద్ధి పనుల కోసమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశానని బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తెలిపారు. అదే విషయాన్ని స్పీకర్‌కు రాత పూర్వ‌కంగా వివ‌రిస్తాన‌ని తెలిపారు.

ముందే చెప్పిన కాక‌తీయ‌..! అక్ష‌ర స‌త్య‌మైన క‌థ‌నం..

బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి మారిన ఎమ్మెల్యేల‌కు అసెంబ్లీ స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ నోటీసులు ఇచ్చేందుకు సిద్ధ‌మైన విష‌యాన్ని కాక‌తీయ శుక్ర‌వారంఉద‌యం వెబ్సైట్‌లో క‌థ‌నం ప్ర‌చురించిన విష‌యం పాఠ‌కుల‌కు విదిత‌మే. కాక‌తీయ క‌థ‌నం అక్ష‌ర స‌త్య‌మైంది. సుప్రీంకోర్టు ఆదేశాల అనంత‌రం స్పీక‌ర్ న్యాయ నిపుణుల స‌ల‌హాలు తీసుకున్న విష‌యాన్ని క‌థ‌నంలో పేర్కొన్న విష‌యం తెలిసిందే. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు స్పీక‌ర్ నోటీసులు జారీచేయ‌డంతో రాష్ట్రంలో ఒక్క‌సారిగా రాజ‌కీయ వాతావ‌ర‌ణం వేడెక్కింది. ఎమ్మెల్యేలు ఎలా స్పందిస్తారు..? స్పీక‌ర్‌కు ఎలాంటి స‌మాధానంతెలియ‌జేస్తారు.? కాంగ్రెస్‌, బీఆర్ ఎస్ పార్టీ అధినాయ‌క‌త్వ‌లా వైఖ‌రి ఎలా ఉండ‌బోతోంద‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖమ్మం బీఆర్‌ఎస్‌కు బిగ్ షాక్‌

ఖమ్మం బీఆర్‌ఎస్‌కు బిగ్ షాక్‌ మంత్రి తుమ్మల నాయకత్వానికి జై కొట్టిన మహిళా...

మేడ్చల్ డీసీసీపై కసరత్తు షురూ

మేడ్చల్ డీసీసీపై కసరత్తు షురూ రంగంలోకి టీపీసీసీ పరిశీలకులు జనవరి 1 వరకు క్షేత్రస్థాయిలో...

గాంధీ పేరే బీజేపీకి భయం!

గాంధీ పేరే బీజేపీకి భయం! ఉపాధి హామీ నుంచి పేరు తొలగింపు అప్రజాస్వామికం లౌకిక...

బీజేపీలోకి పేరం గోపికృష్ణ‌.. రాష్ట్ర అధ్యక్షుడు రాంచంద‌ర్‌రావు స‌మక్షంలో చేరిక‌

బీజేపీలోకి పేరం గోపికృష్ణ‌ రాష్ట్ర అధ్యక్షుడు రాంచంద‌ర్‌రావు స‌మక్షంలో చేరిక‌ ఉన్న‌త విద్యావంతుడు పార్టీలోకి...

ప‌ల్లె పోరు షూరు

ప‌ల్లె పోరు షూరు పంచాయ‌తీ ఎన్నిక‌ల‌తో రాజ‌కీయ వేఢీ ఉమ్మ‌డి కరీంన‌గ‌ర్ జిల్లాలో 1224...

కాంగ్రెస్ అరాచకాలపై ‘విద్యార్థి రణభేరి’

కాంగ్రెస్ అరాచకాలపై ‘విద్యార్థి రణభేరి’ ఫీజు రీయింబర్స్‌మెంట్, గురుకుల సమస్యలపై పోరుబాట వచ్చే నెల...

తెలంగాణలో డివిజన్ పాలిటిక్స్ చెల్ల‌వు

తెలంగాణలో డివిజన్ పాలిటిక్స్ చెల్ల‌వు కులం, మతం ప్రాతిపదికన రాజకీయాలు నిలబడలేవు గ‌తంలో డిపాజిట్లు...

బిగ్ బ్రేకింగ్ న్యూస్‌..!

బిగ్ బ్రేకింగ్ న్యూస్‌..! డిసెంబ‌ర్‌లో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు నిర్ణ‌యం తీసుకున్న తెలంగాణ కేబినేట్‌ కాక‌తీయ‌,...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img