epaper
Thursday, January 15, 2026
epaper

కరీంనగర్‌ను కాంగ్రెస్ అడ్డాగా మార్చేస్తాం

కరీంనగర్‌ను కాంగ్రెస్ అడ్డాగా మార్చేస్తాం
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు

కాకతీయ, కరీంనగర్ : రాష్ట్రంలో ఏ ఎన్నిక జరిగినా కాంగ్రెస్ పార్టీదే విజయం ఖాయమని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుపరిపాలన ప్రజలకు శ్రీరామరక్షగా నిలుస్తోందని కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు తెలిపారు. మంగళవారం సాయంత్రం మైత్రి హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలను ప్రజలు పూర్తిగా తిరస్కరించిన పరిస్థితి నెలకొన్నదని పేర్కొన్నారు. గ్రానైట్ పేరిట గత పాలకులు కోట్లాది రూపాయలు దోచుకున్న విషయాన్ని ప్రజలు మర్చిపోలేదని, ఇకపై అలాంటి దోపిడీలకు కాంగ్రెస్ ప్రభుత్వం అవకాశం ఇవ్వదని హెచ్చరించారు. కొత్తపల్లి మండలంతో పాటు కరీంనగర్ రూరల్ ప్రాంతంలోని 20 గ్రామాల్లో ప్రజలు కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను అత్యధిక మెజార్టీలతో గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని రాజేందర్ రావు చెప్పారు. సర్పంచ్‌, ఎంపీటీసీ, జెడ్పిటిసీ సహా ప్రతి ఎన్నికలో కాంగ్రెస్ విజయమే ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం 8 లక్షల కోట్ల అప్పుతో వచ్చిన రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధి పథంలోకి నడిపిస్తూ సంక్షేమ కార్యక్రమాలను వేగంగా అమలు చేస్తోందని వివరించారు. రైతు రుణమాఫీ, సన్నబియ్యం పంపిణీ, రేషన్ కార్డుల జారీ, రైతు భరోసా, మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, అద్దె బస్సులను యజమానుల పేర్లతో మార్చడం వంటి అనేక పథకాలు ప్రజలకు భారీగా ఉపయోగపడుతున్నాయని పేర్కొన్నారు. బావుపేట, బహుదూర్‌ఖాన్‌పేట ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టు కింద ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం జరుగుతుందని, అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇల్లు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.సోనియా గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని సర్పంచ్ స్థానాల్లో అత్యధిక విజయాలను సాధించడం కాంగ్రెస్ లక్ష్యమని, కరీంనగర్ గడ్డను కాంగ్రెస్ కోటగా మార్చడం తమ సంకల్పమని రాజేందర్ రావు స్పష్టం చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వృద్ధురాలిని నట్టేట ముంచారు..!

వృద్ధురాలిని నట్టేట ముంచారు..! విలువైన భూముల అక్రమ రిజిస్ట్రేషన్లు మీడియా ముందుకు వచ్చిన శంభునిపల్లి...

జర్నలిస్టుల అరెస్టులు అన్యాయం

జర్నలిస్టుల అరెస్టులు అన్యాయం అక్రమ అరెస్టులను ఖండించిన టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కో కన్వీనర్ కే....

పురాభివృద్ధే నా లక్ష్యం..!

పురాభివృద్ధే నా లక్ష్యం..! ఎన్నికల హామీల అమలే ప్రాధాన్యం క్యాతన్‌పల్లిలో అభివృద్ధి పనులకు శ్రీకారం సీసీ...

వావిలాలలో వైభవంగా గోదాదేవి కల్యాణం

వావిలాలలో వైభవంగా గోదాదేవి కల్యాణం కాకతీయ, జమ్మికుంట : ధనుర్మాస ఉత్సవాల ముగింపు...

వలపు వల… లక్షల లూటీ

వలపు వల… లక్షల లూటీ ఇన్‌స్టాగ్రామ్ ముసుగులో సెక్స్ ట్రాప్ నగ్న వీడియోలతో...

వాస్తవాల‌కు వేదికగా కాకతీయ

వాస్తవాల‌కు వేదికగా కాకతీయ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ కంచె వేణు కాకతీయ, హుజురాబాద్ : ప్రజా...

నో కాంప్రమైజ్.. ఆన్ డ్యూటీ..!

నో కాంప్రమైజ్.. ఆన్ డ్యూటీ..! ఎస్సైపై వేటు నిలిపివేయాల‌ని ఎమ్మెల్యే హుకుం..!! వెన‌క్కి త‌గ్గ‌ని...

సీఏం రేవంత్ రెడ్డి మాటల మాంత్రికుడు

సీఏం రేవంత్ రెడ్డి మాటల మాంత్రికుడు 6 డీఏలు పెండింగ్ అంటే రాష్ట్రం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img