epaper
Thursday, January 15, 2026
epaper

పూరన్ కుటుంబానికి అండగా ఉంటాం..

  • దళిత ఐపీఎస్ ఆత్మహత్యకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలి
  • ప్రధాని లేఖ రాసిన నాగర్ కర్నూల్ ఎంపీ డా.మల్లు రవి

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : దళిత ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ ఆత్మహత్యకు కారణమైన డీజీపీ, ఇతర పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోవాలని.. నాగర్ కర్నూల్ ఎంపీ డా.మల్లు రవి ప్రధాని మోదీకి లేఖ రాశారు. పూరన్ కుమార్ కుటుంబానికి అండగా ఉంటామని స్పష్టం చేశారు. ప్రధాని కార్యాలయంలో లేఖను అందజేసిన అనంతరం.. ఎంపీ మల్లు రవి ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో విలేఖరులతో మాట్లాడారు.

చాలా దురదృష్ట‌క‌రం

‘హర్యానాలో తెలంగాణకు చెందిన దళిత ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ సూసైడ్ లెటర్ రాసి ఆత్మహత్య చేసుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ, ఐఐఎంలలో చదివి.. అతి చిన్న వయస్సులోనే సివిల్స్ రాసి ఐపీఎస్ అధికారి అయ్యారు. రాష్ట్రపతి అవార్డు కూడా తీసుకున్నారు. ఆయన పైఅధికారుల ఒత్తిడి కారణంగా అతను ఆత్మహత్య చేసుకున్నారు. ఇది చాలా దురదృష్టకరం. అతని సూసైడ్‌కు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీని కోరాం. అలాగే.. మరోచోట ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని అన్ని రాష్ట్రాల సీఎస్‌లు, డీజీపీలకు ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశాం’ అని మల్లు రవి వివరించారు. ‘ఆత్మహత్య చేసుకొని వారం గడుస్తున్నా.. ఇంకా పోస్టుమార్టం జరగలేదు. ఐపీఎస్ అధికారి ఆత్మహత్యకు కారణమైన ఉన్నతాధికారులపై చర్యలు తీసుకోవాలని అతని భార్య, కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. డీజీపీని సస్పెండ్ చేయాలని కోరుతున్నారు. వీలైనంత త్వరగా హోంమంత్రి వారి డిమాండ్లను అమలు చేయాలి. షెడ్యూల్ క్యాస్ట్ పార్లమెంట్ మెంబర్‌గా నేను కూడా డిమాండ్ చేస్తున్నా. దీనికి సంబంధించిన లెటర్‌ను కూడా ప్రధాని కార్యాలయంలో అందజేశాం’ అని ఎంపీ చెప్పారు.

వెంట‌నే చ‌ర్య‌లు తీసుకోవాలి

‘ఆత్మహత్యకు పాల్పడ్డ ఐపీఎస్ అధికారి కుటుంబ సభ్యులకు కూడా లేఖ రాశాం. అధైర్యపడొద్దని భరోసా ఇచ్చాం. దేశంలోని దళితులందరూ మద్దతుగా నిలుస్తారని లేఖలో ధైర్యాన్నిచ్చాం. ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ కమిటీ మీటింగ్‌లో నేను సభ్యుడిగా ఉన్నాను. ఇవాళ కమిటీ సమావేశం జరగనుంది. ఐపీఎస్ అధికారి సూసైడ్ ఘటనను కమిటీ ఛైర్మన్ దృష్టికి తీసుకెళ్తా. బాధ్యులైన డీజీపీ, ఇతర అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరతా. అంతేకాకుండా నేషనల్ ఎస్సీ కమిషన్ ఛైర్మన్‌కు కూడా దీని గురించి వివరిస్తా. ప్రధానికి రాసిన లేఖను అందజేస్తా. వెంటనే చర్యలు తీసుకోవాలని కోరతా. జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు కూడా ఈ లేఖలను పంపిస్తా. అంతేకాకుండా.. అన్ని రాష్ట్రాలకు చెందిన ఎస్సీ, ఎస్టీ ఎంపీలను కలుస్తా. అందరం కలిసి ప్రధాని, హోంమంత్రిని కలిసి చర్యలు తీసుకోవాలని ఒత్తిడి చేయాలని వారికి తెలియజేస్తాం. అవసరమైతే వారి అందరితో కలిసి చండీఘర్ వెళ్తాం. వారి కుటుంబానికి అండగా నిలుస్తాం.’ అని స్పష్టం చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

బీఆర్ఎస్‌కు ట‌ఫ్ టైం

బీఆర్ఎస్‌కు ట‌ఫ్ టైం ఖ‌మ్మంలో పార్టీని నిల‌బెట్టేది ఎవ‌రు..? మాజీమంత్రినా..? మాజీ ఎంపీనా..? కారు దిగిపోతున్న...

జర్నలిస్టులకు అండగా ప్రజా ప్రభుత్వం

జర్నలిస్టులకు అండగా ప్రజా ప్రభుత్వం అక్రిడిటేషన్లు తగ్గవు… మరింత పెరుగుతాయి జీవో–252లో మార్పులు, సూచనలకు...

ఇరాన్ ఆంక్షల దెబ్బ… బాస్మతి ఎగుమతులకు బ్రేక్

ఇరాన్ ఆంక్షల దెబ్బ… బాస్మతి ఎగుమతులకు బ్రేక్ అమెరికా ఆంక్షలతో ఇరాన్ ఆర్థిక...

జంక్ష‌న్లు జామ్‌

జంక్ష‌న్లు జామ్‌ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ 6 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన...

మూసీ ప్రాజెక్టుతో రియ‌ల్ బూమ్‌

మూసీ ప్రాజెక్టుతో రియ‌ల్ బూమ్‌ ప్రాపర్టీ ధరలు హైక్ ! దాదాపు 15 నుండి...

క‌థ‌నం క‌ల‌క‌లం !

క‌థ‌నం క‌ల‌క‌లం ! ఐఏఎస్ అధికారికి, మంత్రికి మధ్య వివాహేతర బంధం ? అత్యంత...

విష‌మిచ్చి చంపండి

విష‌మిచ్చి చంపండి ఇప్ప‌టికే స‌గం చ‌నిపోయా మహిళా అధికారులను వివాదాల్లోకి లాగొద్దు రేటింగ్స్ కోసం మానసిక...

వివాదాలొద్దు

వివాదాలొద్దు ప‌క్క రాష్ట్రాల‌తో చ‌ర్చ‌ల‌కు సిద్ధం ప‌ర‌స్ప‌ర స‌హ‌కారంతో ముందుకుసాగుదాం ప్రపంచ నగరాలతో హైదరాబాద్ పోటీ 2034...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img