epaper
Thursday, January 15, 2026
epaper

కాంగ్రెస్ గూండాల అరాచకాలు సహించం

కాంగ్రెస్ గూండాల అరాచకాలు సహించం
దాడుల‌కు ప్రతిదాడులు తప్పవు
బిట్ల బాలరాజు, ఆయన భార్య భారతిల ప‌రిస్థితి విష‌మం
బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
పోలీసుల తీరుపై ఆగ్రహం

కాక‌తీయ‌,హైదరాబాద్ : కాంగ్రెస్ గూండాల అరాచకాలను ఇకపై ఉపేక్షించబోమని, అవసరమైతే దాడికి ప్రతిదాడి తప్పదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. రాష్ట్రంలో పోలీసుల వ్యవహార శైలిపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్లారెడ్డి నియోజకవర్గం సోమార్‌పేట్ గ్రామంలో కాంగ్రెస్ నాయకుల దాడిలో తీవ్రంగా గాయపడి సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ నాయకుడు బిట్ల బాలరాజు,ఆయన భార్య గంజి భారతి లను సోమవారం కేటీఆర్ పరామర్శించారు. ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్‌తో కలిసి ఆసుపత్రికి వెళ్లిన ఆయన, బాధితుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

బాధితురాలి పరిస్థితి విషమం

దాడిలో గాయపడిన గంజి భారతి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె పెల్విస్ ఎముకలు విరిగిపోయాయని, యూరినరీ బ్లాడర్ దెబ్బతిన్నట్లు డాక్టర్లు తెలిపారని చెప్పారు. మూడు శస్త్రచికిత్సలు చేయాల్సి ఉందని, కనీసం మూడు వారాల పాటు ఆసుపత్రిలోనే చికిత్స కొనసాగాల్సిన పరిస్థితి ఉందని వెల్లడించారు. రాష్ట్రంలో పోలీసుల తీరు అమానవీయంగా మారిందని కేటీఆర్ మండిపడ్డారు. “డీజీపీ నుంచి కింది స్థాయి అధికారుల వరకూ గుర్తుంచుకోవాలి. మీ జీతాలు ప్రజల సొమ్ముతోనే వస్తాయి. రేవంత్ రెడ్డి ఇంటి సొమ్ముతో గానీ, కాంగ్రెస్ పార్టీ సొమ్ముతో గానీ కాదు. ప్రజల ప్రాణాలు పోతుంటే, రౌడీలు దాడులు చేస్తుంటే చూస్తూ ఊరుకోవడం సరికాదు” అని హెచ్చరించారు.

దాడికి ప్రతిదాడి తప్పదు

నిందితులపై చర్యలు తీసుకోకుండా పోలీసులు నిశ్చేష్టులుగా వ్యవహరిస్తే తామూ తిరగబడాల్సి వస్తుందని కేటీఆర్ స్పష్టం చేశారు. “ఇక దాడికి ప్రతిదాడే సమాధానం అనుకుంటే రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య తలెత్తుతుంది. అప్పుడు జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి” అని అన్నారు. దాడి చేసిన వారితో పాటు దాడికి ప్రేరేపించిన వారిపై కూడా వెంటనే ‘అటెంప్ట్ టు మర్డర్’ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే బాధిత కుటుంబానికి తక్షణమే ఆర్థిక సహాయం, నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. గత రెండేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతోందని కేటీఆర్ ఆరోపించారు. నల్గొండలో మల్లయ్య యాదవ్ హత్య, సూర్యాపేటలో బీసీ అభ్యర్థిని కిడ్నాప్ చేసి మూత్రం తాగించిన ఘటనలను ఆయన గుర్తు చేశారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారని, తగిన సమయంలో సమాధానం చెబుతారని అన్నారు. గాయపడిన భారతి కుటుంబానికి, ఇతర కార్యకర్తలకు అయ్యే పూర్తి వైద్య ఖర్చులను బీఆర్ఎస్ పార్టీనే భరిస్తుందని కేటీఆర్ హామీ ఇచ్చారు. కార్యకర్తలు అధైర్యపడవద్దని, అవసరమైతే డీజీపీ, ఎస్పీ కార్యాలయాల ముట్టడికైనా పిలుపునిస్తామని, న్యాయం జరిగే వరకు పోరాడుతామని స్పష్టం చేశారు. సీఎం తన భాషతో కార్యకర్తలను రెచ్చగొట్టడం మానుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు “ఖబడ్దార్ కాంగ్రెస్ గూండాలారా” అంటూ నినాదాలు చేశాయి.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

మీ పార్టీలో మహిళలకు టికెట్లు ఎక్కడ..?

మీ పార్టీలో మహిళలకు టికెట్లు ఎక్కడ..? నిర్ణయాధికారాలు ఎవరివి..? ముస్లిం మహిళలు మీ...

సికింద్రాబాద్‌పై కత్తి పెట్టొద్దు!

సికింద్రాబాద్‌పై కత్తి పెట్టొద్దు! డీలిమిటేషన్ పేరుతో కుట్ర కార్పొరేషన్‌తో పాటు జిల్లా ఏర్పాటు చేయాలి హైద‌రాబాద్‌ను...

తెలంగాణలో హిందువుల భద్రత ప్రశ్నార్థకం

తెలంగాణలో హిందువుల భద్రత ప్రశ్నార్థకం దేవాలయాలపై దాడులు యాదృచ్ఛికం కావు కాంగ్రెస్ పాలనలో ‘అప్పీజ్‌మెంట్’...

జాగృతిలో అధ్యయన కమిటీ ఏర్పాటు!

జాగృతిలో అధ్యయన కమిటీ ఏర్పాటు! ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై ప్రత్యేక దృష్టి కమిటీ సభ్యుడిగా...

ఆహార కల్తీపై ఉక్కుపాదం!

ఆహార కల్తీపై ఉక్కుపాదం! ప్రజారోగ్యంతో చెలగాటమాడితే చర్యలు తప్పవు కల్తీని హత్యాయత్నంగా పరిగణిస్తాం ప్రత్యేక బృందాలు,...

ప్రభుత్వ విద్యా వ్యవస్థ చిన్నాభిన్నం!

ప్రభుత్వ విద్యా వ్యవస్థ చిన్నాభిన్నం! బీఆర్ఎస్ పాలనలో 6 వేల స్కూల్స్ మూసివేత కాంగ్రెస్...

క్షణాల్లో స్పందించిన పోలీసులు.. ఏటీఎం దొంగ అరెస్ట్!

క్షణాల్లో స్పందించిన పోలీసులు.. ఏటీఎం దొంగ అరెస్ట్! డయల్–100కు సమాచారం.. వెంటనే రంగంలోకి...

గంద‌ర‌గోళంగా మునిసిప‌ల్ ఓట‌ర్ల జాబితా

గంద‌ర‌గోళంగా మునిసిప‌ల్ ఓట‌ర్ల జాబితా వేరే నియోజకవర్గాల ఓటర్లు మున్సిపాలిటీల్లో నమోదు పూర్తిస్థాయి ఎంక్వైరీ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img